ఇళ్ల తొలగింపులో ఉద్రిక్తత
గుడివాడ పట్టణం లింగవరం రోడ్డులోని కాల్వగట్టుపై పదేళ్లుగా నివాసముంటున్నవారి ఇళ్ల తొలగింపు సోమవారం ఉద్రిక్తతకు దారితీసింది.
సహాయ కమిషనరుకు రావికి మధ్య వాగ్వాదం
గుడివాడ(నెహ్రూచౌక్), న్యూస్టుడే: గుడివాడ పట్టణం లింగవరం రోడ్డులోని కాల్వగట్టుపై పదేళ్లుగా నివాసముంటున్నవారి ఇళ్ల తొలగింపు సోమవారం ఉద్రిక్తతకు దారితీసింది. పురపాలక సంఘం సహాయ కమిషనరు టీవీ రంగారావుతోపాటు ప్రణాళిక విభాగం అధికారులు పొక్లెయిన్తో ఇళ్లను తొలగించే ప్రయత్నం చేయగా, బాధిత మహిళలు అడ్డుపడ్డారు. ఈ క్రమంలో వారికి, అధికారులకు మధ్య కొంతసేపు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. తమ ఇళ్లు తొలగించొద్దని బాధితులు అధికారులకు మొరపెట్టుకున్నారు. అయినా వారు కనికరించకపోవటంతో తెదేపా నియోజకవర్గ బాధ్యుడు రావి వెంకటేశ్వరరావు అక్కడికి చేరుకున్నారు.
పొక్లెయిన్కు అడ్డంగా ఉన్న మహిళలను లాగుతున్న సిబ్బంది
ఇళ్ల తొలగింపు అన్యాయమని అడ్డు తగిలారు. దీనిపై సహాయ కమిషనరు రంగారావు ఆయనకు బదులిస్తూ కోర్టు ఉత్తర్వులను అమలు చేస్తున్నామన్నారు. నిరాశ్రయులకు ఆసరా కల్పించకుండా ఇళ్ల తొలగింపు సరికాదని రావి వాదనకు దిగారు. అనుమతులు లేకుండా, కోర్టు ఉత్తర్వులను సైతం పట్టించుకోకుండా మట్టి తవ్వకాలు చేస్తున్నవారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. పేద ప్రజలను ఇబ్బంది పెడితే సహించేది లేదన్నారు. దీంతో వారి మధ్య మాటల యుద్ధం జరిగింది. ప్రజలు, తెదేపా నాయకుల నుంచి త్రీవస్థాయిలో వ్యతిరేకత రావడంతో చేసేదిలేక అధికారులు వెనుదిరిగారు. తెదేపా నాయకులు దింట్యాల రాంబాబు, షేక్ జానీషరీఫ్, సాంబశివరావు, జబీన్, వాసు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జనగళమే.. జయ కెరటమై..
[ 18-04-2024]
పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో తెదేపా అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాగళం సభలు, రోడ్షోకు జనం పోటెత్తారు. -
నేడే.. ఈనాడే..
[ 18-04-2024]
2024 సాధారణ ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల దాఖల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. -
మీరు.. మనసులు గెలవాలండీ..
[ 18-04-2024]
మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్రంలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులకు అధినేత పవన్కల్యాణ్ బీ ఫారాలు అందించారు. -
అనిశాకు చిక్కిన పౌరసరఫరాల అధికారి
[ 18-04-2024]
ఓ బియ్యం వ్యాపారి నుంచి నెలవారీ మామూలు తీసుకుంటూ పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దార్ చెన్నూరి శ్రీనివాస్ అనిశా వలకు చిక్కారు. -
1నే జీతాలివ్వండి మహాప్రభో!
[ 18-04-2024]
తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంతోపాటు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చెప్పిన జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఉద్యోగుల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. -
ఎదురుమొండికి ఎదురు చూపులే..
[ 18-04-2024]
ఎదురుమొండి వారధి నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. తమ చిరకాల స్వప్నం ఎప్పుడు నెరవేరుతుందోనని దీవుల్లో నివాసముంటున్న పది వేల మంది జనాభా దశాబ్ద కాలంగా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. -
కూటమి ప్రభంజనం ఖాయం
[ 18-04-2024]
ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభంజనం ఖాయమని తెదేపా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురామ్ అన్నారు. -
నాడు ఆశల కేంద్రం.. నేడు విధ్వంసానికి నిలయం
[ 18-04-2024]
రాష్ట్ర విభజన తర్వాత తుళ్లూరు మండలంలో ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. -
వైకాపా నాయకుడి ఇంట్లో వైద్యశాల
[ 18-04-2024]
వైకాపా నాయకుడి ఇంట్లో ప్రభుత్వ వైద్యశాల నిర్వహించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల కోడ్కు విరుద్ధంగా అధికార పార్టీ నాయకుడి ఇంట్లో వైద్య సేవలు కొనసాగడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. -
‘రాష్ట్రంలో వైకాపా రాక్షస పాలన’
[ 18-04-2024]
రాష్ట్రంలో వైకాపా రాక్షస పాలనతో జనం విలవిలలాడుతున్నారని సెంట్రల్ సీపీఎం అభ్యర్థి సి.హెచ్.బాబూరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆధ్యాత్మిక చైతన్యం అవసరం
[ 18-04-2024]
నాలుగు వందల సంవత్సరాల పోరాటం తర్వాత అయోధ్యలో రామ మందిర నిర్మాణం సాధ్యమైందని.. ఆ స్ఫూర్తితో ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చైతన్యం రావాలని శైవపీఠాధిపతి శివస్వామి పిలుపునిచ్చారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
[ 18-04-2024]
స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన ఇంజినీరింగ్ విద్యార్థి నీట మునిగి మృతి చెందిన విషాదకర సంఘటన మండలంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. సీఐ జయ్కుమార్ తెలిపిన వివరాల మేరకు మేరకు బాపట్ల పట్టణానికి చెందిన ఇంకొల్లు నాగేశ్వరరావుది వ్యవసాయ కుటుంబం.