దుర్గమ్మ దర్శనం టికెట్ల విక్రయాల్లో చేతివాటం
దుర్గమ్మ దర్శనం టికెట్ల జారీ కౌంటర్లలో పని చేసే ఉద్యోగి చేతివాటానికి పాల్పడిన ఘటన సోమవారం వెలుగు చూసింది. ఆదివారం మాఘ పూర్ణిమ కావడంతో దుర్గమ్మ దర్శనానికి వేలాది భక్తులు తరలివచ్చారు.
ఇంద్రకీలాద్రి, న్యూస్టుడే: దుర్గమ్మ దర్శనం టికెట్ల జారీ కౌంటర్లలో పని చేసే ఉద్యోగి చేతివాటానికి పాల్పడిన ఘటన సోమవారం వెలుగు చూసింది. ఆదివారం మాఘ పూర్ణిమ కావడంతో దుర్గమ్మ దర్శనానికి వేలాది భక్తులు తరలివచ్చారు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్కు సమీపంలోని పఠాన్చెరువు ప్రాంతానికి నుంచి 19 మంది అమ్మవారి దర్శనానికి వచ్చారు. అంతరాలయ దర్శనం చేసుకోవాలంటే 19 టికెట్లు తీసుకోవాలని మల్లికార్జున మహా మండపం కౌంటరులో ఉన్న జూనియర్ అసిస్టెంట్ చెప్పారు. దర్శనానికి వచ్చిన వారిలో నలుగురు చిన్నారులు ఉన్నారు. దాంతో ఆ భక్తుడు హైదరాబాద్లోని కార్పొరేటర్తో ఫోన్లో ఆ ఉద్యోగికి ఫోను చేయించగా... 15 టికెట్లకు అంగీకరించారు. టికెట్ల కోసం కౌంటర్లోని ఉద్యోగికి రూ.7,500 నగదు ఇవ్వగా.. ఆయన 15 టికెట్లు ఇచ్చి పంపారు. ఆ టికెట్లు తీసుకొని లిఫ్టు మార్గంలో వచ్చి క్యూల్లో ఆలయంలోకి రాగా.. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగి వారిలో 8 మందికి మాత్రమే అంతరాలయ దర్శనానికి అనుమతించారు. మిగతా వారు రూ.100 క్యూలైన్లోకి వెళ్లాలని చెప్పడంతో ఆ భక్తుడు కంగుతిన్నారు. 15 టికెట్లలో 8 మాత్రమే రూ.500 టిక్కెట్లు ఉన్నాయి. మిగతా 7 టికెట్లు రూ.100 ఉండటంతో దేవస్థానానికి రావాల్సిన ఆదాయంలో రూ.2,800కు గండి పడిన విషయం వెలుగు చూసింది. ఈవో భ్రమరాంబ సెలవులో ఉండటంతో దేవస్థానం అధికారులు ఆ భక్తుడి నుంచి ఫిర్యాదు తీసుకోవడంతో పాటు టికెట్ల పంచనామా చేసి నివేదిక సిద్ధం చేసినట్లు తెలిసింది. శుక్రవారం, ఆదివారాల్లో టికెట్ల కౌంటర్లలో ఉద్యోగులు చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో మాన్యువల్ టికెట్ల స్థానంలో కంప్యూటరు ప్రింట్తో టికెట్లు ఇస్తున్నా అవకతవకలు తప్పడం లేదు. అధికారులు స్పందించి కంప్యూటర్ ప్రింట్లో కూడా రూ.500, రూ.100 టిక్కెట్ల మధ్య వ్యత్యాసం ఉండేలా చూడాలని భక్తులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్