గుడ్డు ధర నిర్ణయం తీరుపై అభ్యంతరం
ధర చెప్పకుండా ఉత్పత్తిదారుల వద్ద గుడ్లు తరలిస్తూ, కొన్ని రోజుల తరువాత తక్కువ సొమ్ము ముట్టజెప్పడంపై కోళ్లఫారాల నిర్వాహకులు తీవ్ర అభ్యంతరం తెలిపారు.
దేవరపల్లిలో ఆందోళన చేస్తున్న కోళ్ల ఫారాల రైతులు
దేవరపల్లి, న్యూస్టుడే: ధర చెప్పకుండా ఉత్పత్తిదారుల వద్ద గుడ్లు తరలిస్తూ, కొన్ని రోజుల తరువాత తక్కువ సొమ్ము ముట్టజెప్పడంపై కోళ్లఫారాల నిర్వాహకులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. దళారుల తీరు కారణంగా సుమారు 50 కోళ్లఫారాలు మూతపడ్డాయని ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ రాష్ట్ర ఛైర్మన్ కేవీ ముకుందరెడ్డి అన్నారు. తమకు జరుగుతున్న అన్యాయంపై తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో సోమవారం తూర్పు, పశ్చిమ, కృష్ణా ఉమ్మడి జిల్లాల కోళ్ల రైతులు ఆందోళన చేపట్టారు. అంతకుముందు ఆదివారం రాత్రి దేవరపల్లిలో ఉత్పత్తిదారుల నుంచి కొందరు నాలుగు లారీల్లో గుడ్లు రహస్యంగా తరలించబోగా కోళ్లఫారాల నిర్వాహకులకు విషయం తెలిసి అడ్డుకున్నారు. గుడ్లకు సోమవారం నాటి ధర వర్తింపజేయాలన్న షరతుతో లారీలను విడిచిపెట్టారు. ఏ రోజు ధర ఆ రోజే ఖరారు చేసి గుడ్లు తీసుకెళ్లాలని కోళ్లఫారాల నిర్వాహకులు డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల్లో కోళ్లఫారాలు ఏర్పాటు చేస్తున్న వారి వద్ద గుడ్లు కొంటామని బెదిరిస్తూ వర్తకులు గిట్టుబాటు ధర రైతులకు ఇవ్వకుండా దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. కేంద్రం ఎగ్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రేషన్ దుకాణాల్లో గుడ్లు కూడా విక్రయించాలన్నారు. ముఖ్యమంత్రి దృష్టికి కోళ్లపరిశ్రమ ఇబ్బందులు తీసుకెళ్లగా ఓ విధానాన్ని రూపొందించి ఆదుకుంటామని ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని ముకుందరెడ్డి కోరారు. ఆందోళనలో సంఘం కార్యదర్శి పడాల సుబ్బారెడ్డి, ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల జోనల్ ఇన్చార్జులు గంగాధరరావు, కుటుంబరావు, గన్నమని హరికృష్ణ, రైతులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడి అరెస్ట్
[ 18-04-2024]
సీఎం జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడిని విజయవాడ అజిత్సింగ్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. -
జనగళమే.. జయ కెరటమై..
[ 18-04-2024]
పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో తెదేపా అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాగళం సభలు, రోడ్షోకు జనం పోటెత్తారు. -
నేడే.. ఈనాడే..
[ 18-04-2024]
2024 సాధారణ ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల దాఖల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. -
మీరు.. మనసులు గెలవాలండీ..
[ 18-04-2024]
మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్రంలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులకు అధినేత పవన్కల్యాణ్ బీ ఫారాలు అందించారు. -
అనిశాకు చిక్కిన పౌరసరఫరాల అధికారి
[ 18-04-2024]
ఓ బియ్యం వ్యాపారి నుంచి నెలవారీ మామూలు తీసుకుంటూ పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దార్ చెన్నూరి శ్రీనివాస్ అనిశా వలకు చిక్కారు. -
1నే జీతాలివ్వండి మహాప్రభో!
[ 18-04-2024]
తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంతోపాటు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చెప్పిన జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఉద్యోగుల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. -
ఎదురుమొండికి ఎదురు చూపులే..
[ 18-04-2024]
ఎదురుమొండి వారధి నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. తమ చిరకాల స్వప్నం ఎప్పుడు నెరవేరుతుందోనని దీవుల్లో నివాసముంటున్న పది వేల మంది జనాభా దశాబ్ద కాలంగా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. -
కూటమి ప్రభంజనం ఖాయం
[ 18-04-2024]
ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభంజనం ఖాయమని తెదేపా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురామ్ అన్నారు. -
నాడు ఆశల కేంద్రం.. నేడు విధ్వంసానికి నిలయం
[ 18-04-2024]
రాష్ట్ర విభజన తర్వాత తుళ్లూరు మండలంలో ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. -
వైకాపా నాయకుడి ఇంట్లో వైద్యశాల
[ 18-04-2024]
వైకాపా నాయకుడి ఇంట్లో ప్రభుత్వ వైద్యశాల నిర్వహించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల కోడ్కు విరుద్ధంగా అధికార పార్టీ నాయకుడి ఇంట్లో వైద్య సేవలు కొనసాగడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. -
‘రాష్ట్రంలో వైకాపా రాక్షస పాలన’
[ 18-04-2024]
రాష్ట్రంలో వైకాపా రాక్షస పాలనతో జనం విలవిలలాడుతున్నారని సెంట్రల్ సీపీఎం అభ్యర్థి సి.హెచ్.బాబూరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆధ్యాత్మిక చైతన్యం అవసరం
[ 18-04-2024]
నాలుగు వందల సంవత్సరాల పోరాటం తర్వాత అయోధ్యలో రామ మందిర నిర్మాణం సాధ్యమైందని.. ఆ స్ఫూర్తితో ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చైతన్యం రావాలని శైవపీఠాధిపతి శివస్వామి పిలుపునిచ్చారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
[ 18-04-2024]
స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన ఇంజినీరింగ్ విద్యార్థి నీట మునిగి మృతి చెందిన విషాదకర సంఘటన మండలంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. సీఐ జయ్కుమార్ తెలిపిన వివరాల మేరకు మేరకు బాపట్ల పట్టణానికి చెందిన ఇంకొల్లు నాగేశ్వరరావుది వ్యవసాయ కుటుంబం.
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ నటుడు రణ్వీర్సింగ్ ఏఐ వీడియో వైరల్
-
ఇన్స్టామార్ట్తో స్విగ్గీ మాల్ అనుసంధానం.. నిమిషాల్లోనే ఆ వస్తువులూ డెలివరీ
-
వదిన- మరదళ్ల సవాల్.. బారామతిలో నామినేషన్ వేసిన సుప్రియా, సునేత్ర
-
ఏపీలో నాలుగు బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ
-
ఆ టైంలో నేను దేశంలోనే లేను.. రెజ్లర్లపై వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ పిటిషన్
-
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్