మహిళా సంక్షేమంపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్
మహిళా సంక్షేమం పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ రంజిత్బాషా అధికారులకు సూచించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు
ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న రంజిత్బాషా, జేసీ, అధికారులు
కలెక్టరేట్ (మచిలీపట్నం), న్యూస్టుడే: మహిళా సంక్షేమం పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ రంజిత్బాషా అధికారులకు సూచించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా రోజూ అనీమియా పరీక్షలు నిర్వహించాలన్నారు. జేసీ అపరాజితసింగ్, ఇతర అధికారులతో కలిసి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. చల్లపల్లి మండల పరిషత్కు చెందిన రాజీవ్గాంధీ షాపింగ్ కాంప్లెక్స్లోని 18 దుకాణాలకు 2011 నుంచి వేలం నిర్వహించడం లేదని విచారించి బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. పోర్టుకు అనుసంధాన రహదారుల కోసం భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని మార్కెట్ విలువ ప్రకారం ఎకరాకు రూ.1.50 కోట్లు నష్టపరిహారం చెల్లిస్తే భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు పోతేపల్లికి చెందిన రైతులు వినతిపత్రం అందజేశారు.
ఆధార్ కేంద్రం ప్రారంభం: ఆధార్ నవీకరణ సేవల కోసం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు. కేంద్రం ద్వారా అందించే సేవలపై సిబ్బందిని ఆరా తీశారు.
జాతీయ రహదారి పనులు సమన్వయంతో చేపట్టాలి: జాతీయ రహదారులకు సంబంధించిన పనులను సమన్వయంతో చేపట్టాలని కలెక్టర్ రంజిత్బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం విజయవాడ తూర్పు, పశ్చిమ బైపాస్ రహదారిపై వివిధ శాఖల అధికారులతో చర్చించారు. జాతీయ రహదారి -16కు సంబంధించి గన్నవరం నియోజకవర్గ పరిధిలోని పొట్టిపాడు నుంచి ఉయ్యూరు మీదగా గుంటూరు వైపు వెళ్లే పనులను ఆయా శాఖల అధికారులు చర్చించి చేపట్టాలన్నారు. జేసీ అపరాజితసింగ్, డీఆర్వో వెంకటేశ్వర్లు, వివిధ ఇంజినీరింగ్శాఖల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
* జగనన్న లేఔట్ల్లో గృహ నిర్మాణాల లక్ష్యం పూర్తి చేసే విషయంలో అధికారులు అంకితభావంతో కృషి చేయాలని కలెక్టర్ రంజిత్బాషా అధికారులను ఆదేశించారు. జడ్పీ సమావేశ మందిరంలో జేసీ అపరాజితసింగ్తో కలిసి గృహనిర్మాణాల పురోగతి, ఇతర సమస్యలపై మండలాల వారీగా అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయవాడ తూర్పులో వైకాపాకు షాక్.. తెదేపా గూటికి ఎంవీఆర్ చౌదరి
[ 23-04-2024]
తూర్పు నియోజకవర్గంలో వైకాపాకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు వైకాపా నాయకులు -
పేరుకే ఆర్టీసీ గ్రూప్.. అంతా వైకాపా భజనే
[ 23-04-2024]
తాను ఆర్టీసీ జోనల్ ఛైర్పర్సన్గా ఉన్న సమయంలో ఆర్టీసీ అధికారులు, యూనియన్ నాయకులతో ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్లో వైకాపా నాయకురాలు తాతినేని పద్మావతి పార్టీకి సంబంధించిన వీడియోలు, చిత్రాలు, కార్యక్రమాలను పోస్టు చేస్తున్నారు. -
గెలుపు వాకిట పసుపు తోరణం
[ 23-04-2024]
ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు మయం.. తెలుపు, కాషాయం జెండాలతో రంగుల హరివిల్లు..! నినాదాలతో హోరెత్తిన నియోజకవర్గాలు.. జై చంద్రబాబు, పవన్ కల్యాణ్, మోదీ అని దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు. -
పదిలో.. మళ్లీ పదకొండే
[ 23-04-2024]
పదోతరగతి ఫలితాల్లో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కృష్ణా మళ్లీ 11వ స్థానానికే పరిమితమైంది. కృష్ణాలో గతేడాది కంటే ఉత్తీర్ణత శాతం మెరుగైనా.. -
రూ.3వేలు పెంచి.. సంక్షేమం రద్దు చేసి
[ 23-04-2024]
ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో తీసుకుంటే దాన్ని మోసం అంటాము. కానీ సీఎం జగన్ దాన్ని సాయం అని చెప్పుకుంటూ ఊదరగొడుతున్నారు. -
బుద్ధప్రసాద్ నామపత్రం దాఖలు
[ 23-04-2024]
అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. -
‘కూటమి’ కోసం కదలిన కోలవెన్ను
[ 23-04-2024]
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే ప్రసాద్, బందరు జనసేన ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరికి మద్దతుగా రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్, తెదేపా నాయకుడు తుమ్మల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి -
ఫోర్జరీ సంతకాలతో డబ్బులు డ్రా
[ 23-04-2024]
-
జీతాలు అందక.. జీవనం గడవక
[ 23-04-2024]
ఒప్పంద/పొరుగు సేవల విధానంలో పని చేస్తున్న ఉద్యోగుల పట్ల వైకాపా ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. పొరుగు సేవల ఉద్యోగులు, పలువురు ఒప్పంద ఉద్యోగులకు ప్రతి నెలా సక్రమంగా జీతాలు అందని పరిస్థితి ఏర్పడింది. -
పదిలో అద్భుత ప్రతిభ
[ 23-04-2024]
విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్టుడే: ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రతిభతో మెరిశారు. -
వెలంపల్లీ..హామీ..చేసిందేమీ..
[ 23-04-2024]
భవానీపురం పరిధిలో సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు చెప్పిన మాటలు నీటి మూటలుగానే మిగిలాయి. -
‘అరాచక పాలకులను సాగనంపాలి’
[ 23-04-2024]
అరాచక పాలకులను ప్రజలు సాగనంపాలని ఎన్డీయే విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. -
పేదింట విరిసిన విద్యాకుసుమాలు
[ 23-04-2024]
తల్లిదండ్రుల పేదరికం చిన్నారుల ప్రతిభకు ఆటంకం కాదు అని దళవాయి సుబ్బరామయ్య మున్సిపల్ హైస్కూల్ పదో తరగతి విద్యార్థినులు నిరూపించారు. సోమవారం వెల్లడైన ఫలితాల్లో మంచి ప్రతిభ చటారు. -
నన్ను చంపేందుకు వైకాపా నేతల కుట్ర
[ 23-04-2024]
వైకాపా నేతలు తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని తిరువూరు తెదేపా అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఆరోపించారు. సోమవారం నామినేషన్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. -
28 మంది అభ్యర్థులు... 31 నామపత్రాలు
[ 23-04-2024]
మచిలీపట్నం పార్లమెంట్ స్థానంతో పాటు జిల్లాలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సోమవారం 28 మంది అభ్యర్థులు నామపత్రాలు అందజేశారు.
తాజా వార్తలు (Latest News)
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్