logo

మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

యజమాని మందలించాడని ఓ మెకానిక్‌ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొల్లి సాయికిరణ్‌(26) కానూరు మురళీనగర్‌ నివాసి.

Published : 07 Feb 2023 03:26 IST

పెనమలూరు, న్యూస్‌టుడే: యజమాని మందలించాడని ఓ మెకానిక్‌ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొల్లి సాయికిరణ్‌(26) కానూరు మురళీనగర్‌ నివాసి. ఆటోనగర్‌లోని ఓ షెడ్డులో మెకానిక్‌గా పని చేస్తుంటాడు. కొంత కాలంగా షెడ్డులో సామాన్లు చోరీకి గురవుతున్నాయంటూ షెడ్డు యజమాని సాయికిరణ్‌ను రెండ్రోజుల క్రితం మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన సాయికిరణ్‌ సోమవారం ఇంటి సమీపంలోని ఓ షెడ్డులో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొంతసేపటికి తండ్రి శివయ్య గుర్తించి కిందకు దించి చూడగా అప్పటికే కుమారుడు మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని