ఇళ్ల సమస్యలపై సమర భేరి
విజయవాడ నగర పరిసరాల్లో టిడ్కో ఇళ్లు, జగనన్న గృహాల సమస్యల పరిష్కారంపై సమర భేరి మోగింది. సీపీఐ, సీపీఎం, తెదేపా వేర్వేరుగా ఆయా ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలపై స్పందన వేదికగా గూడు కోసం.. తమ గోడు వినిపించారు.
మాట్లాడుతున్న జి.కోటేశ్వరరావు, చిత్రంలో సి.హెచ్.కోటేశ్వరరావు, దుర్గా భవానీ, దుర్గాంబ తదితరులు
ఎన్టీఆర్ కలెక్టరేట్, న్యూస్టుడే : విజయవాడ నగర పరిసరాల్లో టిడ్కో ఇళ్లు, జగనన్న గృహాల సమస్యల పరిష్కారంపై సమర భేరి మోగింది. సీపీఐ, సీపీఎం, తెదేపా వేర్వేరుగా ఆయా ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలపై స్పందన వేదికగా గూడు కోసం.. తమ గోడు వినిపించారు. పేదల కోసం ప్రభుత్వం నిర్మించిన టిడ్కో ఇళ్లల్లో అన్ని మౌలిక వసతులు కల్పించి, వాటిని లబ్ధిదారులకు అందజేయాలని, జగన్న ఇళ్లకు రూ.5 లక్షల చొప్పున చెల్లించాలని కోరుతూ.. సీపీఐ నగర, జిల్లా కమిటీలు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపాయి. కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి సి.హెచ్.కోటేశ్వరరావు మాట్లాడుతూ.. టిడ్కో ఇళ్లకు ఎలాంటి రుసుము లేకుండా అందజేస్తామని ఎన్నికలకు ముందు సీఎం జగన్ హామీ ఇచ్చారని, మూడున్నర ఏళ్లు గడిచినా సదరు హామీ నెరవేరలేదన్నారు. వీటిని ఈనెల 22వ తేదీలోగా స్వాధీన పరచకుంటే.. తీవ్ర స్థాయిలో ఉద్యమించనున్నట్టు హెచ్చరించారు. సీపీఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ.. గృహ నిర్మాణాలకు రూ.5 లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈనెల 22న వేలాది మంది లబ్ధిదారులతో మహా ధర్నా నిర్వహించనున్నట్టు వెల్లడించారు. నాయకులు లంక దుర్గారావు, పెన్మెత్స దుర్గాభవానీ, మూలి సాంబశివరావు, పంచదార్ల దుర్గాంబ తదితరులు పాల్గొన్నారు.
పాతపాడులో స్థలాలు వద్దు
విజయవాడ గ్రామీణ మండలం పి.నైనవరం గ్రామానికి చెందిన లబ్ధిదారులకు.. 8 కిలో మీటర్ల దూరంలోని పాతపాడులో ఇళ్ల స్థలాలు ఇవ్వడం సరికాదని, తమ గ్రామంలోనే ఇవ్వాలని కోరుతూ విన్నవించారు. నైనవరంలో సరిపడా స్థలాలు ఉండగా, పాతపాడులో సమస్యాత్మక ప్రాంతంలో కేటాయించారని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. సీపీఎం అనుబంధ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కోట కల్యాణ్, కౌలు రైతు సంఘ నేత మాతంగి ఆంజనేయులు, వృత్తిదారుల సంఘం నాయకులు ఎస్.శ్రీనివాసరావు, సురేష్, జమున, రాణి తదితరులు పాల్గొన్నారు.
నున్నలో ఆగిన పనులు
విజయవాడ గ్రామీణ మండలం నున్న గ్రామ లేఔట్లో రామవరప్పాడు, నున్న గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు 1360 గృహాలను నిర్మిస్తుండగా, ఇవి బేస్ మెంట్ స్థాయిలో ఉన్నాయని, మట్టి లేదా రబ్బీసుతో నింపడానికి 5 నెలల నుంచి పనులు ఆగినట్టు ఆ గ్రామ తెదేపా నేత దండు సుబ్రహ్మణ్యరాజు కలెక్టర్కు వివరించారు. పనులు పూర్తయ్యేలా చూడాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయిదాడి కేసు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్
[ 18-04-2024]
సీఎం జగన్పై రాయిదాడి కేసులో నిందితుడికి విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. -
జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడి అరెస్ట్
[ 18-04-2024]
సీఎం జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడిని విజయవాడ అజిత్సింగ్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. -
జనగళమే.. జయ కెరటమై..
[ 18-04-2024]
పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో తెదేపా అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాగళం సభలు, రోడ్షోకు జనం పోటెత్తారు. -
నేడే.. ఈనాడే..
[ 18-04-2024]
2024 సాధారణ ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల దాఖల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. -
మీరు.. మనసులు గెలవాలండీ..
[ 18-04-2024]
మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్రంలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులకు అధినేత పవన్కల్యాణ్ బీ ఫారాలు అందించారు. -
అనిశాకు చిక్కిన పౌరసరఫరాల అధికారి
[ 18-04-2024]
ఓ బియ్యం వ్యాపారి నుంచి నెలవారీ మామూలు తీసుకుంటూ పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దార్ చెన్నూరి శ్రీనివాస్ అనిశా వలకు చిక్కారు. -
1నే జీతాలివ్వండి మహాప్రభో!
[ 18-04-2024]
తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంతోపాటు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చెప్పిన జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఉద్యోగుల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. -
ఎదురుమొండికి ఎదురు చూపులే..
[ 18-04-2024]
ఎదురుమొండి వారధి నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. తమ చిరకాల స్వప్నం ఎప్పుడు నెరవేరుతుందోనని దీవుల్లో నివాసముంటున్న పది వేల మంది జనాభా దశాబ్ద కాలంగా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. -
కూటమి ప్రభంజనం ఖాయం
[ 18-04-2024]
ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభంజనం ఖాయమని తెదేపా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురామ్ అన్నారు. -
నాడు ఆశల కేంద్రం.. నేడు విధ్వంసానికి నిలయం
[ 18-04-2024]
రాష్ట్ర విభజన తర్వాత తుళ్లూరు మండలంలో ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. -
వైకాపా నాయకుడి ఇంట్లో వైద్యశాల
[ 18-04-2024]
వైకాపా నాయకుడి ఇంట్లో ప్రభుత్వ వైద్యశాల నిర్వహించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల కోడ్కు విరుద్ధంగా అధికార పార్టీ నాయకుడి ఇంట్లో వైద్య సేవలు కొనసాగడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. -
‘రాష్ట్రంలో వైకాపా రాక్షస పాలన’
[ 18-04-2024]
రాష్ట్రంలో వైకాపా రాక్షస పాలనతో జనం విలవిలలాడుతున్నారని సెంట్రల్ సీపీఎం అభ్యర్థి సి.హెచ్.బాబూరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆధ్యాత్మిక చైతన్యం అవసరం
[ 18-04-2024]
నాలుగు వందల సంవత్సరాల పోరాటం తర్వాత అయోధ్యలో రామ మందిర నిర్మాణం సాధ్యమైందని.. ఆ స్ఫూర్తితో ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చైతన్యం రావాలని శైవపీఠాధిపతి శివస్వామి పిలుపునిచ్చారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
[ 18-04-2024]
స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన ఇంజినీరింగ్ విద్యార్థి నీట మునిగి మృతి చెందిన విషాదకర సంఘటన మండలంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. సీఐ జయ్కుమార్ తెలిపిన వివరాల మేరకు మేరకు బాపట్ల పట్టణానికి చెందిన ఇంకొల్లు నాగేశ్వరరావుది వ్యవసాయ కుటుంబం.
తాజా వార్తలు (Latest News)
-
పంజాబ్ ఆలౌట్.. ముంబయి థ్రిల్లింగ్ విక్టరీ
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
-
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
వైకాపా అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం