logo

గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్టు

గంజాయి విక్రయిస్తున్న ముఠాను పటమట పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో రామవరప్పాడులోని పాలెంవారి వీధిలో గంజాయి విక్రయం జరుగుతుందని పోలీసులకు సమాచారం అందింది.

Published : 07 Feb 2023 03:26 IST

పటమట, న్యూస్‌టుడే: గంజాయి విక్రయిస్తున్న ముఠాను పటమట పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో రామవరప్పాడులోని పాలెంవారి వీధిలో గంజాయి విక్రయం జరుగుతుందని పోలీసులకు సమాచారం అందింది. ఎస్‌ఐ జాన్‌ బాషా సిబ్బందితో కలిసి అక్కడ మాటు వేశారు. గంజాయి సరఫరా చేస్తున్న కంకిపాడుకు చెందిన గుడిసేవా జ్యోతి ప్రకాష్‌, రవి ధనుష్‌, షేక్‌ గౌస్‌ బాషా, రామవరప్పాడుకు చెందిన పాలెం గౌతంలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 5.3 కిలోల గంజాయి, ఒక ద్విచక్ర వాహనం, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో సుమంత్‌, అలీ పరారయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని