వెలంపల్లి మాటే వేదం
దుర్గగుడి ఆలయ పాలకవర్గం ఏర్పాటు, ప్రమాణ స్వీకారం అంతా హడావుడిగా జరిగిపోయింది. ఛైర్మన్గా విజయవాడకు చెందిన కర్నాటి రాంబాబు, మరో 14 మంది సభ్యులుగా నియమితులయ్యారు.
దుర్గగుడికి కొత్త పాలకవర్గం నియామకం
ఉదయం ఉత్తర్వులు.. సాయంత్రం ప్రమాణ స్వీకారం
ఈనాడు, అమరావతి: దుర్గగుడి ఆలయ పాలకవర్గం ఏర్పాటు, ప్రమాణ స్వీకారం అంతా హడావుడిగా జరిగిపోయింది. ఛైర్మన్గా విజయవాడకు చెందిన కర్నాటి రాంబాబు, మరో 14 మంది సభ్యులుగా నియమితులయ్యారు. పాలక వర్గం ఏర్పాటులో దేవాదాయ శాఖ మాజీ మంత్రి, ప్రస్తుత విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ మాటే చెల్లుబాటు అయ్యింది. మొత్తం 15 మందిలో ఛైర్మన్తో సహా పశ్చిమ నియోజకవర్గానికి చెందిన నలుగురికి పదవులు లభించాయి. నగరంలో మధ్య, తూర్పు నియోజకవర్గాల నుంచి ఒకొక్కరికి అవకాశం లభించింది.
వివాదాలమయం
దుర్గగుడి నిత్యం వివాదాలకు కేంద్రంగా మారుతోంది. గతంలో ఒక సభ్యురాలు చీరను తస్కరించి వివాదంలో చిక్కుకున్నారు. మరో సభ్యురాలి వాహనంలో తెలంగాణ మద్యం లభించింది. దేవాలయంలో పెత్తనం చేయడం, ఉచిత దర్శనాలు, అమ్మవారికి వచ్చిన విలువైన చీరలను బహుమతులుగా స్వీకరించడం లాంటి వివాదాల్లో పలువురు చిక్కుకున్నారు. మంగళవారం నియమితులైన కొంతమంది సభ్యులపై కూడా నేరారోపణలు ఉన్నాయి. కాల్మనీ కేసులు, ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం, దౌర్జన్యం కేసులు ఉండగా, వాటిని ఇటీవల తొలగించుకుని క్లీన్ సర్టిఫికెట్ పొందినట్లు సమాచారం. ఛైర్మన్గా నియమితులైన కర్నాటి రాంబాబు గతంలో తెదేపా కార్యకర్తగా ఉండేవారు. తర్వాత వెలంపల్లి విధేయునిగా మారారు. పశ్చిమ నియోజకవర్గంలో జనసేనపై విమర్శలు సంధిస్తూ నేతల దృష్టిని ఆకర్షించారు. గతంలో ఆయన వడ్డీ వ్యాపారం చేసేటప్పుడు పలు ఫిర్యాదులు ఉన్నాయి. పోలీసులు సస్పెక్టు షీట్ తెరిచేందుకు ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. ఆయన అనుచరుడిపై రౌడీషీట్ తెరిచి తర్వాత మూసివేశారు. అందులో భాగంగా పోలీసుల విచారణకు పలుమార్లు పిలిచినట్లు తెలిసింది. స్థిరాస్తి వ్యాపారిగా ఉన్న ఆయనపై ఇతర వివాదాలూ ఉన్నాయి. పశ్చిమ నియోజకవర్గం నుంచి బుద్దా రాంబాబు, కట్టా సత్తయ్య, కేసరి నాగమణిలకు అవకాశం ఇచ్చారు. వీరిలో రాంబాబు.. వెలంపల్లికి వీర విధేయుడు. సభ్యుల్లోఎక్కువ మంది స్థిరాస్తి వ్యాపారులుగా ఉన్నారు. విజయవాడ మధ్య నియోజకవర్గం నుంచి ఎంపికైన చింతా సింహాచలం న్యాయవాది. ఒక్కరి పేరునే ఎమ్మెల్యే సూచించినట్లు తెలిసింది. తూర్పు నియోజకవర్గం వైకాపా ఇంఛార్జి దేవినేని అవినాష్ సిఫార్సుతో బచ్చు మాధవీకృష్ణకు పదవి వచ్చింది. ఇటీవల కృష్ణలంకలో జరిగిన ఘర్షణలో ఈమె కూడా ఉన్నారు. గడపగడపకూ కార్యక్రమంలో ప్రశ్నించినందుకు తమపై దాడి చేశారని బాధితురాలు ఈమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. జగ్గయ్యపేట నుంచి ఇద్దరికి అవకాశం దక్కింది. జగ్గయ్యపేటకు చెందిన నంబూరి రవి సభ్యుడిగా నియమితులయ్యారు. గతంలో ఆయనపై ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన ఫిర్యాదు, దొంగనోట్ల చలామణీ ఆరోపణలు ఉన్నాయి. దొంగనోట్ల కేసులో పక్క రాష్ట్రం పోలీసులు తీసుకెళ్లి విచారణ చేశారు. జగ్గయ్యపేట నుంచి అల్లూరి కృష్ణవేణికీ అవకాశం లభించింది. ఇటీవల ఎమ్మెల్యే ఉదయభాను, వెలంపల్లి మధ్య వివాదం ఏర్పడిన విషయం తెలిసిందే. ఇద్దరూ కార్యక్రమంలో పక్కపక్కనే కూర్చున్నారు. దేవిశెట్టి బాలకృష్ణ (తిరువూరు), చింకా శ్రీనివాస్(మైలవరం), అనుమోలు ఉదయలక్ష్మి(నందిగామ)లకు అవకాశం ఇచ్చారు. ఇతర జిల్లాల నుంచి రామసీత(తిరుపతి), ఎం.వెంకటేశ్వరరావు(పశ్చిమగోదావరి), వేదకుమారి(ఏలూరు), కల్యాణి(పల్నాడు) సభ్యులుగా నియమితులయ్యారు. ఎన్టీఆర్ జిల్లాలోని ఏడు నియోజవర్గాలకు ప్రాతినిధ్యం కల్పించారు.
దేవాదాయ శాఖ మంత్రి ఏరి?
ప్రమాణస్వీకారం అంతా పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జరిగింది. అసలు దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణకే సమాచారం లేదని తెలిసింది. మంగళవారం ఉదయం ఉత్తర్వులు రావడం, సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయడం చకాచకా జరిగిపోయాయి. కోఆప్షన్ సభ్యుల నియామకం విషయంలో ‘అంతా మీ ఇష్టం సర్.. మీకు నచ్చినట్లు చేసుకోండి..!’ అంటూ ప్రజాప్రతినిధులనుద్దేశించి దుర్గగుడి ఈవో భ్రమరాంబ వ్యాఖ్యానించడం విశేషం. పాలక వర్గంలో ఎనిమిది మంది పురుషులు, ఏడుగురు మహిళలు ఉన్నారు. ఛైర్మన్ పదవి బీసీ వర్గానికి దక్కింది. విధేయత, సామాజిక వర్గాల సమీకరణ ప్రకారం పాలకవర్గాన్ని నియమించారు.
కర్నాటి రాంబాబు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోడ్డేయలేదని అడిగితే.. కొడాలి నాని వర్గం దాడి
[ 25-04-2024]
గుడివాడ వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరుల ఆగడాలు శృతిమించిపోతున్నాయి. ఈ ఐదేళ్లు ఎమ్మెల్యేగా జనం సమస్యలు పట్టించుకోకుండా వదిలేసి.. -
నీ నిర్లక్ష్యమే.. పెనువిపత్తు!
[ 25-04-2024]
అకాల వర్షాలు.. వరదలకు నిలువునా మునిగిపోయిన అన్నదాతను ఆదుకోవడంలో జగన్ సర్కారు ఘోరంగా విఫలమైంది. పరిహారం ఇవ్వడంలో కనికరం చూపించలేదు. -
అభిమాన కెరటం
[ 25-04-2024]
తెదేపా, జనసేన, భాజపా.. కూటమి అభ్యర్థుల నామినేషన్లకు.. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మూడు పార్టీల శ్రేణులు.. ఏకతాటిపైకి వచ్చి తమ అభ్యర్థుల కోసం తరలివస్తున్నారు. -
సిగ్గు విడిచి సంబరమా!
[ 25-04-2024]
వైకాపా నేతల నామినేషన్లు.. జనానికి ప్రాణసంకటంలా మారాయి. నామినేషన్ల ర్యాలీలకు డబ్బులిచ్చి భారీగా జనాన్ని ఆటోలు, వాహనాల్లో తీసుకొచ్చి.. లేని బలాన్ని.. ఉన్నట్టు చూపించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. -
నయవంచన
[ 25-04-2024]
పాడి రైతుల ముంగిట్లో 20 ఏళ్లుగా సేవలిందిస్తున్న గోపాలమిత్రలు కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆరుగాలం శ్రమించినా నెలకు రూ.6,500 మాత్రమే చెల్లిస్తుండడంతో కుటుంబ పోషణకు చాలక ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతున్నారు. -
వైకాపా నాయకులకు దోచుకోవడమే తెలుసు : షర్మిల
[ 25-04-2024]
కృష్ణానది ఇసుకను దోసుకుతిన్న ఘనుడు ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ అని పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. -
జాతీయ స్థాయిలో మెరిసిన తెలుగు తేజం
[ 25-04-2024]
సివిల్ సర్వీస్లో ఎంపికవడమే కాదు.. అక్కడ ఇచ్చిన శిక్షణలో కూడా రాణించి బంగారు పతకాలు అందుకున్నారు. -
కూటమిలో జోష్
[ 25-04-2024]
విజయమే లక్ష్యంగా తెదేపా, జనసేన, భాజపా నాయకులు కార్యకర్తలు బందరులో బుధవారం జనసునామి సృష్టించారు. -
బెజవాడ సీపీగా రామకృష్ణ
[ 25-04-2024]
విజయవాడ కొత్త పోలీస్ కమిషనర్గా 2006 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన పీహెచ్డీ రామకృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. -
నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు ప్రవర్తిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
వైకాపా నాయకులు పోలీసు వ్యవస్థను అడ్డంపెట్టుకొని ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. -
షర్మిల యాత్ర విజయవంతం చేయండి
[ 25-04-2024]
కృష్ణలంకలో గురువారం (నేడు) జరిగే షర్మిలారెడ్డి యాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఏపీ ఎన్నికల ఇన్ఛార్జి చౌహాన్ పిలుపునిచ్చారు. -
పని ప్రాంతంలోనే ఎన్నికల విధులు వేయరూ..
[ 25-04-2024]
మహిళా ఉపాధ్యాయులను వారి పని చేసే నియోజకవర్గాల్లోనే ఎన్నికల విధుల్లో నియమించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ నవాబ్, కోసూరి రాజశేఖర్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావుకు బుధవారం వినతి పత్రం సమర్పించారు. -
కలగా మిగిలిన వంతెన
[ 25-04-2024]
జగనన్న వస్తాడు..ఏదో చేస్తాడని ఓట్లేస్తే పాములలంక వంతెన నిర్మించకుండా అయిదేళ్ల్లుగా ఉసూరుమనిపించారని పాములలంక గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. -
పరిహారం.. పరిహాసం
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గతేడాది ఖరీఫ్, రబీ పంటల సాగులో అన్నదాత పూర్తిగా నష్టపోయారు. నేటి వరకూ రైతులకు పావలా ఆర్థిక సాయం కూడా అందలేదని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
43 మంది అభ్యర్థులు...57 నామపత్రాలు
[ 25-04-2024]
జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలో పోటీ చేసేందుకు బుధవారం మొత్తం 43 మంది నామపత్రాలు దాఖలు చేశారు. -
పామర్రుని తెదేపా అడ్డాగా మారుస్తా: వర్ల
[ 25-04-2024]
అన్న నందమూరి తారకరామారావు పుట్టిన ఈ గడ్డపై మళ్లీ పసుపు జెండాను ఎగరేసి నియోజకవర్గాన్ని తెదేపాకు అడ్డాగా మారుస్తానని ఎన్డీఏ కూటమి అభ్యర్థి వర్ల కుమార్రాజా అన్నారు. -
పీఏసీఎన్ కంప్యూటరీకరణపై శిక్షణ
[ 25-04-2024]
ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల కంప్యూటరీకరణపై చల్లపల్లి పీఏసీఎన్లో శిక్షణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. -
‘బటన్ నొక్కుడు తప్ప చేసిందేమీ లేదు’
[ 25-04-2024]
నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెబుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్టీఆర్ గృహాలు నిర్మించుకున్న పేదలకు ఎందుకు నిధులు మంజూరు చేయలేదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శీలం ప్రకాష్రావు ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు