గుడివాడలో గలాటా
పోలీసులు నోటీసు ఇవ్వకుండా నాటకీయ పరిణామాల మధ్య సోమవారం అరెస్టు చేసిన గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావును మంగళవారం న్యాయస్థానం ఎదుట హాజరుపర్చారు.
పూచికత్తుతో రావి విడుదల
న్యాయస్థానం వద్దకు భారీగా చేరుకున్న తెదేపా శ్రేణులు
రావిని ఆసుపత్రికి తరలిస్తున్న పోలీసులు
నెహ్రూచౌక్(గుడివాడ), గుడివాడ గ్రామీణం, న్యూస్టుడే: పోలీసులు నోటీసు ఇవ్వకుండా నాటకీయ పరిణామాల మధ్య సోమవారం అరెస్టు చేసిన గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావును మంగళవారం న్యాయస్థానం ఎదుట హాజరుపర్చారు. అదనపు జుడిషియల్ ప్రథమ శ్రేణి మేజిస్ట్రేట్ నాగలక్ష్మి విచారించి పూచీకత్తుపై విడుదల చేశారు. నాగవరప్పాడులోని నీటి పారుదల కాల్వ గట్టుపై నివాసముంటున్నవారి ఇళ్ల తొలగింపును రావి అడ్డుకొని వారికి కొంత సమయం ఇవ్వాలని అధికారులను కోరారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆక్రమణలు తొలగిస్తుండగా రావి వెంకటేశ్వరరావు, తెదేపా నాయకులు తమ విధులకు ఆటంకం కలిగించారని ఒకటో వార్డు సచివాలయం అడ్మిన్ పేరే వెంకట ముత్యాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుడివాడ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై సమాచారం లేకపోవడంతో రావి తెదేపా శ్రేణులతో కలిసి గూడూరులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర చేపట్టిన దీక్షకు మద్దతు తెలిపి వస్తుండగా పోలీసులు అడ్డుకొని అత్యంత నాటకీయ పరిణామాల మధ్య అర్ధరాత్రి పమిడిముక్కల పోలీసు స్టేషన్కు తరలించారు. అక్కడి నుంచి మంగళవారం ఉదయం గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చి వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు తరలించారు. ఈ క్రమంలో ఆసుపత్రి వద్దకు తెదేపా శ్రేణులు భారీగా చేరుకోవడంతో ఓపీ చీటీ లేని వారిని ఆసుపత్రిలోకి రాకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. అనంతరం అదనపు జుడిషియల్ ప్రథమ శ్రేణి మేజిస్ట్రేట్ కోర్టుకు తరలించారు. అప్పటికే తెదేపా నాయకులు, కార్యకర్తలు భారీగా కోర్టు ప్రాంగణానికి చేరుకోవడంతో పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. ఉభయ పక్షాలను విచారించిన న్యాయమూర్తి నాగలక్ష్మి ఇద్దరి పూచీకత్తు, షరతులతో రావిని విడుదల చేశారు. పట్టణంలో అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా టియర్ గ్యాస్ వాహనంతో భారీగా పోలీసు బలగాలు మోహరించారు. 144 సెక్షన్ అమలు చేశారు.
ఎనిమిది మందిపై కేసు
అధికారుల విధులకు ఆటంకం కలిగించారని పేర్కొంటూ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుతో పాటు తెదేపా నాయకులు దింట్యాల రాంబాబు, ముళ్లపూడి రమేష్, దాసు శ్యామ్ ప్రసాద్, వసంతవాడ దుర్గారావు, సర్కార్, పోలాసి ఉమామహేశ్వరరావు, షేక్ జానీషరీఫ్ తదితరులపై సెక్షన్ 353, 341, రెడ్ విత్ 149 కింద పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విడుదల అనంతరం రావికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. పేదల పక్షాన పోరాడితే అక్రమ కేసులు బనాయిస్తారా? ఇలాంటి చర్యలకు భయపడే ప్రసక్తే లేదని మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, అర్బన్బ్యాంకు ఛైర్మన్ పిన్నమనేని బాబ్జి, తెదేపా నాయకుడు వెనిగండ్ల రాము పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గులకరాయికి.. రాజకీయ రంగు!
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్పై గులకరాయి కేసు.. కుట్ర కేసుగా మారుతోంది. రాజకీయ రంగు పులుముకునేందుకు రంగం సిద్ధమైంది. తెదేపా నేతలు అనుమానించినట్లే.. మరికొందరు కీలక నేతలను ఇరికించేందుకు ఖాళీ వదిలినట్లు తెలిసింది. -
తెచ్చిపెట్టేది లేదు... తరిమికొట్టుడే..!
[ 19-04-2024]
‘గత ఐదేళ్ల జగన్ పాలనలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఒక్క పరిశ్రమ కూడా నెలకొల్పింది లేదు. కానీ.. గత చంద్రబాబు సర్కారు ఎన్నో ఇబ్బందులు పడి, పారిశ్రామికవేత్తలను ఒప్పించి, రాయితీలు ఇచ్చి ఇక్కడ పెట్టించిన పరిశ్రమలను మూతపడేలా చేయడంలో వైకాపా సర్కారు విజయవంతమైంది. -
అభివృద్ధి పరుగులు పెట్టిస్తా: సుజనా
[ 19-04-2024]
విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ప్రధాని మోదీ, చంద్రబాబు సహకారంతో అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తానని భాజపా పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు. గురువారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. -
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: బాలశౌరి
[ 19-04-2024]
వైకాపా అరాచక పాలన నుంచి విముక్తి పొందేందుకు తెదేపా, జనసేన కూటమి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కూటమి బందరు ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి పిలుపునిచ్చారు. -
ఒడిసిపడతానని.. విడిచిపెడతావేం?
[ 19-04-2024]
సీఎం జగన్ మాటలకు అర్థాలే వేరు. ఆయన చెప్పారంటే... అసలు చేయరని అర్థం. దీనికి సజీవ సాక్ష్యం కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీకి దిగువన ప్రతిపాదించిన రెండు బ్యారేజీల నిర్మాణం. కృష్ణా, గుంటూరు జిల్లాలకు ప్రాణావసరమైన వీటి గురించి జగన్ సర్కారు ఏమాత్రం పట్టించుకోలేదు. -
నాలుగో సింహం నలిగిపోతోంది
[ 19-04-2024]
వారాంతపు సెలవులు లేక పోలీసులు తీవ్ర ఇబ్బందుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. రోజూ ఒత్తిడితో పని చేయాల్సి వస్తోంది. ఈ విధంగా ఉద్యోగం చేయడం కష్టంగా ఉందని పోలీసు ఉద్యోగుల సంఘం తరఫున ఉన్నతాధికారులను, ప్రజా ప్రతినిధులను వేడుకున్నారు. -
తెదేపా అభ్యర్థుల నామ పత్రాల దాఖలు
[ 19-04-2024]
గన్నవరం నియోజకవర్గంలో జనసేన, భాజపా మద్దతుతో తెదేపా బలపర్చిన ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గురువారం ఉదయం 11.15 గంటలకు తొలి విడత నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి జేసీ గీతాంజలిశర్మకు సమర్పించారు. -
లారీ ఢీకొని ప్రసాదంపాడు వాసి దుర్మరణం
[ 19-04-2024]
చంద్రుగొండ మండలం అయ్యన్నపాలెం ఒడ్డు వద్ద గల మలుపు సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన శ్రీకృష్ణచక్రపాణి(61) మృతి చెందారు. -
బావిలో పడిన యువకుడు
[ 19-04-2024]
బాపులపాడు మండలం బొమ్ములూరులో ఓ యువకుడు బావిలో పడిన ఘటన గురువారం రాత్రి కలకలం రేపింది. ఇదే గ్రామానికి చెందిన పవన్ స్థానిక విద్యుత్తు ఉపకేంద్రం సమీపంలో ఉన్న పొలంలోని బావిలో పడిపోయాడు. -
చెత్తకు నిప్పు.. గ్యాస్ పైప్లైన్కు మంటలు
[ 19-04-2024]
ముదినేపల్లి ప్రధాన రహదారిలో చెత్త కాలుస్తుండగా..గ్యాస్ పైప్లైన్ లుకింగ్ పాయింట్కు అంటుకొని భీతావహ పరిస్థితి ఏర్పడింది. వెంటనే స్పందించిన అగ్నిమాపకశాఖ అధికారులు మంటల్ని అదుపు చేశారు. -
ప్రోత్సాహం అన్నావు.. సాయం మరిచావు
[ 19-04-2024]
బందరు బంగారంగా ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన రోల్డ్గోల్డ్ పరిశ్రమ ప్రస్తుతం అనేక ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. -
ఆ భోజనం మా కొద్దు
[ 19-04-2024]
మధ్యాహ్నభోజన మెనూ మార్చాం...పోషకాలతో కూడిన భోజనం అందిస్తున్నాం అని ముఖ్యమంత్రి జగన్ గొప్పలు చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. -
ఇన్నాళ్లూ.. కాలయాపన
[ 19-04-2024]
పేరుకే అది వంద పడకల ఆసుపత్రి.. వైద్యం మాత్రం ‘ప్రాథమిక’ స్థాయిలోనే అందుతోంది. వైద్యశాలను ఉన్నతంగా తీర్చిదిద్దామని ఎమ్మెల్యే సోదరులు ప్రజలను మభ్యపెడుతున్నారు. స్థాయి పెంపు కాగితాలకే పరిమితమైంది. -
నాడు కళకళ.. నేడు వెలవెల
[ 19-04-2024]
వైకాపా పాలనలో పారిశ్రామికవాడలు పూర్తిగా చతికిల పడ్డాయి. గుడివాడ ఆటోనగర్ ఒకప్పుడు దేశవ్యాప్తంగా వ్యవసాయ పరికరాలకు ప్రఖ్యాతి. కర్నాటక, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు ఇక్కడి నుంచి కల్టివేటర్లు, వీల్స్, నూర్పిడి యంత్రాలు సరఫరా అయ్యాయి. -
సుద్దగా అన్నం.. అందుకే తినం
[ 19-04-2024]
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చాలా మంది విద్యార్థులకు రుచించడం లేదు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మెనూ అమలు చేస్తున్నప్పటికీ ఆహార పదార్థాలు రుచి, శుచి ఉండడం లేదని పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చెబుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు