logo

లైంగికంగా వేధిస్తున్నారంటూ అధికారిపై ఫిర్యాదు

తనను లైంగికంగా వేధింపులకు గురి చేశాడంటూ మొవ్వ మండల మహళా సమాఖ్య కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగిని మంగళవారం కూచిపూడిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Published : 08 Feb 2023 06:11 IST

పోలీస్‌ స్టేషన్‌ వద్ద బాధిరాలికి సంఘీభావంగా బుక్‌ కీపర్లు, వెలుగు కార్యాలయ సిబ్బంది, మహిళా సంఘ నాయకులు

కూచిపూడి, న్యూస్‌టుడే: తనను లైంగికంగా వేధింపులకు గురి చేశాడంటూ మొవ్వ మండల మహళా సమాఖ్య కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగిని మంగళవారం కూచిపూడిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెకు మద్దతుగా మండలంలోని బుక్‌ కీపర్లు, వెలుగు కార్యాలయం సిబ్బంది, మహిళా సంఘ నాయకులు పోలీస్‌ స్టేషన్‌ వద్దకు చేరుకొని సంఘీభావం తెలిపారు. మండల సమాఖ్య కార్యాలయంలో పన్నెండేళ్లుగా ఓ ఉద్యోగిని(40) పని చేస్తున్నారు  రికార్డులు పరిశీలించే క్రమంలో గత నెల 23న ఏపీఎం కాకుమాను సుబ్బారావు తన చేయి పట్టుకొని లాగాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అదే సమయంలో లైంగిక వేధింపుల పాల్జేశాడని.. అప్పటి నుంచి తను మానసికంగా కుంగిపోయి ఆస్పత్రిపాలైనట్లు ప్రస్తావించారు. అతని నుంచి తనకు రక్షణ కల్పించాలని ఫిర్యాదు చేయగా కూచిపూడి పోలీసులు కేసు నమోదు చేశారు. సంబంధిత అధికారిపై చర్యలు తీసుకోకపోగా అధికార పార్టీకి చెందిన ఒక ఎంపీటీసీ సభ్యుడు రాజీ ప్రయత్నాలు చేయడం ఏమిటని మహిళా సంఘ నాయకులు విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు