మీరు తవ్వుకోండి.. మేము చూస్తుంటాం..
మట్టి మాఫియా చెలరేగిపోతోంది. అధికార పార్టీ అండదండలు ఉండడంతో అధికారులు చోద్యం చూస్తున్నారు. దీంతో వారి ఆగడాలు మూడు ట్రాక్టర్లు.. ఆరు ట్రక్కులుగా కొనసాగిపోతోంది.
యథేచ్ఛగా మట్టి అక్రమ వ్యాపారం
ప్రైవేటు లేఔట్లకు తరలిపోతున్న వైనం
చెరువులో మట్టిని ట్రాక్టర్కు లోడింగ్ చేస్తున్న దృశ్యం
న్యూస్టుడే, పోలుకొండ (నందివాడ): మట్టి మాఫియా చెలరేగిపోతోంది. అధికార పార్టీ అండదండలు ఉండడంతో అధికారులు చోద్యం చూస్తున్నారు. దీంతో వారి ఆగడాలు మూడు ట్రాక్టర్లు.. ఆరు ట్రక్కులుగా కొనసాగిపోతోంది. చెరువులు, కాలువలను యథేచ్ఛగా తవ్వేస్తూ టన్నుల కొద్ది మట్టిని ప్రైవేటు లేఔట్లకు తరలించేస్తూ రూ.కోట్లలో అక్రమార్జనకు పాల్పడుతున్నారు. నందివాడ మండలం పోలుకొండ రెవెన్యూ పరిధిలోని శంకరంపాడులో మట్టి అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. చెరువులో మట్టిని తవ్వి శంకరంపాడుతోపాటు పోలుకొండ, రుద్రపాక తదితర గ్రామాల్లో విక్రయిస్తున్నారు. దూరాన్ని బట్టి ట్రక్కు రూ. 700 నుంచి రూ. 1,200 వరకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. నాలుగు రోజులుగా మట్టి అక్రమ తవ్వకాలు కొనసాగుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. అక్రమార్కులు అధికార పార్టీకి చెందిన వ్యక్తులు కావడంతో ఎవరూ పట్టించుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ చెరువుల్లో మట్టి తవ్వకాలకు ఎటువంటి అనుమతులు లేవని, పూర్వం తవ్విన చెరువులు కావడంతో అందులో పోరంబోక భూములు పెద్దమొత్తంలోనే ఉన్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా మత్స్య, రెవెన్యూ శాఖలవారు కానరాకపోవడం విడ్డూరంగా ఉందని గ్రామస్థులు వాపోతున్నారు. మట్టి అక్రమ తవ్వకాలు మొదలెట్టక ముందే అధికారులను ప్రసన్నం చేసుకొని అటువైపు తొంగి చూడకుండా చేశారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పేదలు తమ ఇళ్లస్థలాల మెరకకు 5, 10 ట్రక్కుల మట్టిని తమ పొలాల్లో నుంచి తెచ్చుకుంటే రాద్ధాంతం చేసే అధికారులు, సిబ్బంది రాత్రీ, పగలూ తేడాలేకుండా పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో మట్టిని అక్రమంగా తరలిస్తుంటే ఎందుకు స్పందించడం లేదని ప్రజలు మండి పడుతున్నారు. ట్రాక్టర్ల రాకపోకలతో రోడ్లు ధ్వంసమవుతున్నాయని, ఎప్పుడు, ఎలాంటా ప్రమాదాలు జరుగుతాయోనని ఆందోళన చెందుతున్నారు.
జగనన్న లేఔట్లను మెరక చేయకపోవడంతో పల్లమైపోయి ఏటా వర్షాకాలంలో నీటితో నిండిపోతున్నాయి. 27 లేఔట్లు వేస్తే వాటిలో 90 శాతం నీట మునిగి ఏటా వర్షాకాలంలో తటాకాలను తలపిస్తుండడంతో ఇళ్లనిర్మాణానికి లబ్ధిదారులు సాహసించడం లేదు. మెరకచేసి అభివృద్ధి చేస్తామని చెప్పడమే కానీ మూడేళ్లుగా బొచ్చెడు మట్టి పోసింది లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మండలం నుంచి తరలిపోతున్న మట్టిని జగనన్న లేఔట్ల మెరకకు వినియోగించి పేదలు ఇళ్లు కట్టుకునేలా చూడాలని కోరుతున్నారు. దీనిపై డీటీ మల్లికాంబ వద్ద ‘న్యూస్టుడే’ ప్రస్తావించగా వీఆర్వోలు తన దృష్టికి తీసుకురాలేదన్నారు. పరిశీలించి అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకుంటామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!