పొరుగు జిల్లాలో...వీధికెక్కిన వైకాపా విభేదాలు
సొంత నియోజకవర్గంలో కాదని మైలవరం వైకాపా నాయకులు పక్క జిల్లా గుంటూరుకు వెళ్లి పోట్లాడుకున్న వైనమిది.
మంత్రి జోగి, ఎమ్మెల్యే వసంత వర్గీయుల వాదులాట
మైలవరం, న్యూస్టుడే: సొంత నియోజకవర్గంలో కాదని మైలవరం వైకాపా నాయకులు పక్క జిల్లా గుంటూరుకు వెళ్లి పోట్లాడుకున్న వైనమిది. రెండు వర్గాలుగా విడిపోయి మరీ వైకాపా జిల్లా కోఆర్డినేటర్ మర్రి రాజశేఖర్ ఎదుట వాగ్వాదానికి దిగి, పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. మంగళవారం జరిగిన ఈ ఘటన నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.
రెండ్రోజుల కిందట మంత్రి జోగి రమేష్ అనుచరుడు, ఇబ్రహీంపట్నానికి చెందిన నల్లమోతు మధుబాబు, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ను దుర్భాషలాడారు. దీనిపై సోమవారం నియోజకవర్గంలోని అన్ని పోలీస్స్టేషన్లలో ఎమ్మెల్యే వర్గీయులు ఫిర్యాదు చేశారు. దీనిపై ఇబ్రహీంపట్నంలో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో అతనిపై చర్యలు తీసుకోవాలని, నియోజకవర్గంలో పట్టు సాధించాలన్న ఆలోచనతో ఎమ్మెల్యే వర్గం ‘చలో సజ్జల’ కార్యక్రమాన్ని చేపట్టింది. అన్ని మండలాల నుంచి భారీ సంఖ్యలో ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు తొలుత గొల్లపూడి, తర్వాత ప్రభుత్వ సలహాదారు సజ్జలను కలిసేందుకు కార్లలో తాడేపల్లి వెళ్లారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో గుంటూరులోని వైకాపా కార్యాలయంలో ఉన్న జిల్లా కోఆర్డినేటర్ మర్రి రాజశేఖర్ వద్దకు వెళ్లారు. అప్పటికే అక్కడ ఎమ్మెల్యే వ్యతిరేక వర్గంగా ముద్రపడిన జి.కొండూరు జడ్పీటీసీ సభ్యుడు మందా జక్రధరరావు, ఇబ్రహీంపట్నం జడ్పీటీసీ సభ్యురాలి భర్త, జి.కొండూరు మండలానికే చెందిన మరో ఇద్దరు సర్పంచులు, పలువురు నాయకులున్నారు.
కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండు
ఇదిలా ఉండగా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోకుంటే పార్టీకి నష్టం వాటిల్లుతుందని ఎమ్మెల్యే వర్గీయులు మర్రి రాజశేఖర్కు ఫిర్యాదు చేశారు. మరోవైపు వచ్చిన వారిలో ముఖ్యమంత్రిని దూషించిన వారు చాలామంది ఉన్నారంటూ జడ్పీటీసీ సభ్యుడు జక్రధరరావు ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం తరపున వ్యాఖ్యానించడం, ఇరు వర్గాల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లకు దారితీసింది. ఎమ్మెల్యే ఇచ్చిన సొమ్ముతో గెలిచిన వ్యక్తులు నీతులు మాట్లాడుతున్నారంటూ తీవ్ర స్థాయిలో వాదనకు దిగడంతో, కల్పించుకున్న నాయకులు ఇరు వర్గాలను వేరుచేశారు. జరుగుతున్న పరిణామాలపై తక్షణ చర్యలు తీసుకోకపోతే, రాజీనామాలు తప్పవంటూ పలువురు ఎమ్మెల్యే వర్గీయులు హెచ్చరించి బయటకు వచ్చేశారు.
పార్టీలో ఉంటూ ఎవరైతే తనకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారో, వారే దుర్భాషలాడే స్థాయికి వెళ్లటాన్ని నాయకులు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసిందని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ‘న్యూస్టుడే’కు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయిదాడి కేసు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్
[ 18-04-2024]
సీఎం జగన్పై రాయిదాడి కేసులో నిందితుడికి విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. -
జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడి అరెస్ట్
[ 18-04-2024]
సీఎం జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడిని విజయవాడ అజిత్సింగ్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. -
జనగళమే.. జయ కెరటమై..
[ 18-04-2024]
పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో తెదేపా అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాగళం సభలు, రోడ్షోకు జనం పోటెత్తారు. -
నేడే.. ఈనాడే..
[ 18-04-2024]
2024 సాధారణ ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల దాఖల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. -
మీరు.. మనసులు గెలవాలండీ..
[ 18-04-2024]
మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్రంలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులకు అధినేత పవన్కల్యాణ్ బీ ఫారాలు అందించారు. -
అనిశాకు చిక్కిన పౌరసరఫరాల అధికారి
[ 18-04-2024]
ఓ బియ్యం వ్యాపారి నుంచి నెలవారీ మామూలు తీసుకుంటూ పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దార్ చెన్నూరి శ్రీనివాస్ అనిశా వలకు చిక్కారు. -
1నే జీతాలివ్వండి మహాప్రభో!
[ 18-04-2024]
తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంతోపాటు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చెప్పిన జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఉద్యోగుల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. -
ఎదురుమొండికి ఎదురు చూపులే..
[ 18-04-2024]
ఎదురుమొండి వారధి నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. తమ చిరకాల స్వప్నం ఎప్పుడు నెరవేరుతుందోనని దీవుల్లో నివాసముంటున్న పది వేల మంది జనాభా దశాబ్ద కాలంగా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. -
కూటమి ప్రభంజనం ఖాయం
[ 18-04-2024]
ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభంజనం ఖాయమని తెదేపా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురామ్ అన్నారు. -
నాడు ఆశల కేంద్రం.. నేడు విధ్వంసానికి నిలయం
[ 18-04-2024]
రాష్ట్ర విభజన తర్వాత తుళ్లూరు మండలంలో ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. -
వైకాపా నాయకుడి ఇంట్లో వైద్యశాల
[ 18-04-2024]
వైకాపా నాయకుడి ఇంట్లో ప్రభుత్వ వైద్యశాల నిర్వహించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల కోడ్కు విరుద్ధంగా అధికార పార్టీ నాయకుడి ఇంట్లో వైద్య సేవలు కొనసాగడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. -
‘రాష్ట్రంలో వైకాపా రాక్షస పాలన’
[ 18-04-2024]
రాష్ట్రంలో వైకాపా రాక్షస పాలనతో జనం విలవిలలాడుతున్నారని సెంట్రల్ సీపీఎం అభ్యర్థి సి.హెచ్.బాబూరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆధ్యాత్మిక చైతన్యం అవసరం
[ 18-04-2024]
నాలుగు వందల సంవత్సరాల పోరాటం తర్వాత అయోధ్యలో రామ మందిర నిర్మాణం సాధ్యమైందని.. ఆ స్ఫూర్తితో ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చైతన్యం రావాలని శైవపీఠాధిపతి శివస్వామి పిలుపునిచ్చారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
[ 18-04-2024]
స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన ఇంజినీరింగ్ విద్యార్థి నీట మునిగి మృతి చెందిన విషాదకర సంఘటన మండలంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. సీఐ జయ్కుమార్ తెలిపిన వివరాల మేరకు మేరకు బాపట్ల పట్టణానికి చెందిన ఇంకొల్లు నాగేశ్వరరావుది వ్యవసాయ కుటుంబం.
తాజా వార్తలు (Latest News)
-
పదవి కోసం పెద్దిరెడ్డి నా కాళ్లు పట్టుకున్నారు: కిరణ్కుమార్రెడ్డి
-
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
-
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కోహ్లీకి అరుదైన గౌరవం.. జైపుర్ మ్యూజియంలో మైనపు విగ్రహం
-
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!