logo

హత్యా? ఆత్మహత్యా?

నిద్రమత్తులో ఉన్న యువకుడు తెల్లారేసరికి తీవ్రమైన గాయాలతో సొంతింటిలోనే విగతజీవిలా పడి ఉన్న సంఘటన ఉంగుటూరు మండలం పెద్దఅవుటపల్లిలో మంగళవారం తెల్లవారు జామున చోటుచేసుకుంది.

Published : 08 Feb 2023 06:11 IST

యువకుడి అనుమానాస్పద మృతి

దీప్‌చంద్‌ (పాత చిత్రం)

పెద్దఅవుటపల్లి (గన్నవరం గ్రామీణం), న్యూస్‌టుడే: నిద్రమత్తులో ఉన్న యువకుడు తెల్లారేసరికి తీవ్రమైన గాయాలతో సొంతింటిలోనే విగతజీవిలా పడి ఉన్న సంఘటన ఉంగుటూరు మండలం పెద్దఅవుటపల్లిలో మంగళవారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దఅవుటపల్లికి చెందిన ఉప్పలపాటి దీప్‌చంద్‌(29) గృహోపకరణాల పనులు చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. అతడికి ఇంకా వివాహం కాలేదు. తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. డ్రైవర్‌గా పని చేసే తండ్రి తెల్లవారు జామున 5 గంటలకే విధులకు వెళ్లాడు. అనంతరం కొద్ది సేపటికే తల్లి రమాదేవి పాలు తీసేందుకని బయటకు వెళ్లి తిరిగొచ్చే సరికి దీప్‌చంద్‌ ఇంట్లో తీవ్రగాయాలతో చనిపోయి రక్తపు మడుగులో కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలిని పరిశీలించారు. వీఆర్వో జి.శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కుటుంబ సభ్యుల పాత్రపై ఆరా:  కేవలం తల్లీకొడుకులు మాత్రమే ఉన్న ఇంట్లో ఉన్నట్లుండి కుమారుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంపై పోలీసులు అన్ని కోణాల్లో ఆరా తీస్తున్నారు. తల్లి నుంచి పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఇటీవల అప్పులపాలైన దీప్‌చంద్‌ వల్ల తాము ఇబ్బందులు పడుతున్నట్లు పలుమార్లు తల్లి రమాదేవి వాపోయినట్లు సమాచారం. ఆవేశంలో తల్లే కుమారుడిని రోకలి బండతో హతమార్చి ఉంటుందా? అని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, పోస్టుమార్టం అనంతరం వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ విజయపాల్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని