ఎంత పని చేశావ్ బామ్మర్దీ..
బావ డబ్బుపై కన్నేసిన ఓ బామ్మర్ది కిడ్నాప్ డ్రామా ఆడాడు. ఆ నగదు కొట్టేసి జల్సా చేయాలనుకున్నాడు.
డబ్బు కోసం బావని కిడ్నాప్ చేశాడు
ఈనాడు, హైదరాబాద్: బావ డబ్బుపై కన్నేసిన ఓ బామ్మర్ది కిడ్నాప్ డ్రామా ఆడాడు. ఆ నగదు కొట్టేసి జల్సా చేయాలనుకున్నాడు. ఏడుగురి సాయంతో విజయవంతంగా కాజేసినా సీసీ ఫుటేజ్తో గుట్టు బయటపడింది. ప్రధాన సూత్రధారి పి.రాజేష్ (36)తోపాటు డి.రాఘవేంద్ర (33), పి.నాగజీవన్కుమార్ (30), అబ్దుల్సలీమ్ (30), పి.లక్ష్మయ్య (31), ఎ.కృష్ణగోపాల్ (27), శ్రీనివాస్ (35)ను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు గౌస్ కోసం గాలిస్తున్నారు. పంజాగుట్ట పోలీస్స్టేషన్లో బుధవారం ఇన్స్పెక్టర్ హరీష్చంద్రారెడ్డి, డీఐ దుర్గారావుతో కలిసి ఏసీపీ ఎస్.మోహన్కుమార్ మీడియాకు వివరాలు తెలిపారు. యూసుఫ్గూడ నవోదయ కాలనీ వాసి బి.వి.మురళీకృష్ణ (40)కు ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఉంది. విజయవాడలో చేతివృత్తి పనులు చేసుకునే బామ్మర్ది పి.రాజేష్కు తన కార్యాలయంలో ఉద్యోగమిచ్చి నెలకు రూ.15,000 వేతనం ఇచ్చేవాడు. అక్కడ నిత్యం రూ.లక్షలు చేతులు మారటం గమనించాడు. ఇదే విషయాన్ని కొంతకాలం క్రితం విజయవాడ వెళ్లినప్పుడు మద్యం మత్తులో సోదరుడు పిల్లా నాగ జీవన్కుమార్తో పంచుకున్నాడు. దీంతో ఆ నగదు కాజేయాలని ఇద్దరూ పథకం పన్నారు. విజయవాడకు చెందిన మరో ఆరుగురి సాయం కోరారు. వాళ్లకు మాత్రం.. అప్పు తీసుకొని ఎగ్గొట్టిన వ్యక్తి నుంచి వసూలు చేసేందుకు కిడ్నాప్ చేయబోతున్నట్టు చెప్పారు. వచ్చే సొమ్ములో కొంత ఇస్తామని ఒప్పించారు.
ఐటీ అధికారులమంటూ.. రాజేష్ నగరంలోనే ఉండగా గతనెల 26న మిగిలిన ఏడుగురు కారులో విజయవాడ నుంచి హైదరాబాద్ చేరారు. మరుసటిరోజు మురళీకృష్ణ బైకుపై పిల్లలను అమీర్పేట్ లాల్బంగ్లా వద్ద పాఠశాలకు తీసుకెళ్లటాన్ని గమనించారు. అతిన వద్దకెళ్లి తాము ఐటీ అధికారులమంటూ చెప్పి సకాలంలో పన్ను చెల్లించట్లేదంటూ బెదిరించి బలవంతంగా కారులోకి ఎక్కించుకొని వెళ్లిపోయారు. ఐటీ అధికారులు బావను తీసుకెళ్లారంటూ అక్కకు రాజేష్ ఫోన్ చేసి రూ.60 లక్షలు ఇవ్వకపోతే అరెస్ట్ చేస్తారంటూ చెప్పాడు. తాను కూడా వారి అదుపులోనే ఉన్నట్టు వివరించాడు. సొంత తమ్ముడే తన భర్త కిడ్నాప్ గురించి చెప్పటంతో మురళీకృష్ణ భార్య నమ్మింది. అతడు చెప్పినట్టుగా నగదుతో నాంపల్లి రైల్వేస్టేషన్లో ఉన్న సోదరుడికి అప్పగించింది. ఆమె వెళ్లగానే నగదు సంచి నాగజీవన్కుమార్కు అప్పగించిన రాజేష్ యూసుఫ్గూడలోని సోదరి ఇంటికి చేరాడు. అదేరోజు సాయంత్రం కిడ్నాపర్లు మురళీకృష్ణను బాటసింగారం వద్ద వదిలేసి వెళ్లిపోయారు. అక్కడ నుంచి మలక్పేట వరకూ బస్సులో, తరువాత మెట్రోరైల్లో ఇంటికి చేరాడు. తన కుటుంబం గురించి పూర్తిగా తెలిసినవారే కిడ్నాప్ చేశారని అనుమానించి భార్య, పిల్లలకు అపాయం వాటిల్లవచ్చనే భయంతో ఎవరికీ చెప్పలేదు. చివరకు భార్య ప్రోద్బలంతో ఈనెల 4న పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇన్స్పెక్టర్లు హరీష్చంద్రారెడ్డి, దుర్గారావు, ఎస్సైలు సీహెచ్.నరేష్, మహ్మద్ రఫీయుద్దీన్ బృందం దర్యాప్తు చేపట్టారు.
విందు వినోదాల్లో మునిగి.. కిడ్నాపర్ల చెర నుంచి బావ బయటపడగానే ఊపిరి పీల్చుకున్నట్టు బామ్మర్ది నటించాడు. పోలీసులూ అనుమానించలేదు. రూ.30 లక్షలు చేతికి రాగానే మిగిలిన ఏడుగురు ఏపీ, తెలంగాణాల్లోని పలు ప్రాంతాలు చుడుతూ విందు, వినోదాలతో డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేశారు. సీసీ ఫుటేజ్, ఫోన్కాల్స్ జాబితా ఆధారంగా బామ్మర్దే ప్రధాన సూత్రధారిగా నిర్దారణకు వచ్చారు. అతన్ని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించటంతో కిడ్నాప్ డ్రామా వెలుగు చూసింది. ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. వారినుంచి రూ.15,04,500 నగదు, కారు, బైకు, 7 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసును చేధించిన సిబ్బందిని ఏసీపీ మోహన్కుమార్ అభినందించి రివార్డులు అందజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోడ్డేయలేదని అడిగితే.. కొడాలి నాని వర్గం దాడి
[ 25-04-2024]
గుడివాడ వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరుల ఆగడాలు శృతిమించిపోతున్నాయి. ఈ ఐదేళ్లు ఎమ్మెల్యేగా జనం సమస్యలు పట్టించుకోకుండా వదిలేసి.. -
నీ నిర్లక్ష్యమే.. పెనువిపత్తు!
[ 25-04-2024]
అకాల వర్షాలు.. వరదలకు నిలువునా మునిగిపోయిన అన్నదాతను ఆదుకోవడంలో జగన్ సర్కారు ఘోరంగా విఫలమైంది. పరిహారం ఇవ్వడంలో కనికరం చూపించలేదు. -
అభిమాన కెరటం
[ 25-04-2024]
తెదేపా, జనసేన, భాజపా.. కూటమి అభ్యర్థుల నామినేషన్లకు.. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మూడు పార్టీల శ్రేణులు.. ఏకతాటిపైకి వచ్చి తమ అభ్యర్థుల కోసం తరలివస్తున్నారు. -
సిగ్గు విడిచి సంబరమా!
[ 25-04-2024]
వైకాపా నేతల నామినేషన్లు.. జనానికి ప్రాణసంకటంలా మారాయి. నామినేషన్ల ర్యాలీలకు డబ్బులిచ్చి భారీగా జనాన్ని ఆటోలు, వాహనాల్లో తీసుకొచ్చి.. లేని బలాన్ని.. ఉన్నట్టు చూపించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. -
నయవంచన
[ 25-04-2024]
పాడి రైతుల ముంగిట్లో 20 ఏళ్లుగా సేవలిందిస్తున్న గోపాలమిత్రలు కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆరుగాలం శ్రమించినా నెలకు రూ.6,500 మాత్రమే చెల్లిస్తుండడంతో కుటుంబ పోషణకు చాలక ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతున్నారు. -
వైకాపా నాయకులకు దోచుకోవడమే తెలుసు : షర్మిల
[ 25-04-2024]
కృష్ణానది ఇసుకను దోసుకుతిన్న ఘనుడు ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ అని పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. -
జాతీయ స్థాయిలో మెరిసిన తెలుగు తేజం
[ 25-04-2024]
సివిల్ సర్వీస్లో ఎంపికవడమే కాదు.. అక్కడ ఇచ్చిన శిక్షణలో కూడా రాణించి బంగారు పతకాలు అందుకున్నారు. -
కూటమిలో జోష్
[ 25-04-2024]
విజయమే లక్ష్యంగా తెదేపా, జనసేన, భాజపా నాయకులు కార్యకర్తలు బందరులో బుధవారం జనసునామి సృష్టించారు. -
బెజవాడ సీపీగా రామకృష్ణ
[ 25-04-2024]
విజయవాడ కొత్త పోలీస్ కమిషనర్గా 2006 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన పీహెచ్డీ రామకృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. -
నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు ప్రవర్తిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
వైకాపా నాయకులు పోలీసు వ్యవస్థను అడ్డంపెట్టుకొని ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. -
షర్మిల యాత్ర విజయవంతం చేయండి
[ 25-04-2024]
కృష్ణలంకలో గురువారం (నేడు) జరిగే షర్మిలారెడ్డి యాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఏపీ ఎన్నికల ఇన్ఛార్జి చౌహాన్ పిలుపునిచ్చారు. -
పని ప్రాంతంలోనే ఎన్నికల విధులు వేయరూ..
[ 25-04-2024]
మహిళా ఉపాధ్యాయులను వారి పని చేసే నియోజకవర్గాల్లోనే ఎన్నికల విధుల్లో నియమించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ నవాబ్, కోసూరి రాజశేఖర్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావుకు బుధవారం వినతి పత్రం సమర్పించారు. -
కలగా మిగిలిన వంతెన
[ 25-04-2024]
జగనన్న వస్తాడు..ఏదో చేస్తాడని ఓట్లేస్తే పాములలంక వంతెన నిర్మించకుండా అయిదేళ్ల్లుగా ఉసూరుమనిపించారని పాములలంక గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. -
పరిహారం.. పరిహాసం
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గతేడాది ఖరీఫ్, రబీ పంటల సాగులో అన్నదాత పూర్తిగా నష్టపోయారు. నేటి వరకూ రైతులకు పావలా ఆర్థిక సాయం కూడా అందలేదని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
43 మంది అభ్యర్థులు...57 నామపత్రాలు
[ 25-04-2024]
జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలో పోటీ చేసేందుకు బుధవారం మొత్తం 43 మంది నామపత్రాలు దాఖలు చేశారు. -
పామర్రుని తెదేపా అడ్డాగా మారుస్తా: వర్ల
[ 25-04-2024]
అన్న నందమూరి తారకరామారావు పుట్టిన ఈ గడ్డపై మళ్లీ పసుపు జెండాను ఎగరేసి నియోజకవర్గాన్ని తెదేపాకు అడ్డాగా మారుస్తానని ఎన్డీఏ కూటమి అభ్యర్థి వర్ల కుమార్రాజా అన్నారు. -
పీఏసీఎన్ కంప్యూటరీకరణపై శిక్షణ
[ 25-04-2024]
ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల కంప్యూటరీకరణపై చల్లపల్లి పీఏసీఎన్లో శిక్షణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. -
‘బటన్ నొక్కుడు తప్ప చేసిందేమీ లేదు’
[ 25-04-2024]
నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెబుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్టీఆర్ గృహాలు నిర్మించుకున్న పేదలకు ఎందుకు నిధులు మంజూరు చేయలేదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శీలం ప్రకాష్రావు ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM