పుస్తక పండగ వచ్చింది
గత మూడు దశాబ్దాలకు పైగా దిగ్విజయంగా సాగుతున్న విజయవాడ పుస్తకమహోత్సవం నేటి నుంచి ఆరంభం కాబోతోంది.
ఫిబ్రవరి 9 నుంచి 19 వరకు ప్రదర్శన
ఈ ఏడాది ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో నిర్వహణ
ఈనాడు, అమరావతి
గత మూడు దశాబ్దాలకు పైగా దిగ్విజయంగా సాగుతున్న విజయవాడ పుస్తకమహోత్సవం నేటి నుంచి ఆరంభం కాబోతోంది. నేటి నుంచి 19 వరకు విజయవాడ నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో ప్రదర్శన జరగబోతోంది. వీబీఎఫ్ఎస్ అంకితభావం, పట్టుదల, స్థానిక అధికారులు, నాయకుల సహకారం, ప్రజల ఆదరణతో నిర్విరామంగా మూడు దశాబ్దాలకు పైగా పుస్తక ప్రదర్శన కొనసాగుతోంది. ఏటా పుస్తక మహోత్సవం జరిగే స్వరాజ్య మైదానంలో అంబేడ్కర్ స్మృతివనం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో ప్రదర్శనకు సరైన స్థలం దొరకక.. జాప్యం జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్, చెన్నై పుస్తక మహోత్సవాల సమయంలో కాకుండా.. అవి అయ్యాక పెట్టాలని నిర్ణయించారు. ఒకే సమయంలో పెడితే.. పుస్తక విక్రేతలు, ప్రచురణ సంస్థలకు ఇబ్బంది అవుతుంది. మళ్లీ వచ్చే ఏడాది నుంచి సంక్రాంతికి ముందు జనవరిలోనే పుస్తక మహోత్సవం ఏర్పాటు చేస్తామని వీబీఎఫ్ఎస్ గౌరవాధ్యక్షులు బెల్లపు బాబ్జి వెల్లడించారు.
నేషనల్ బుక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తొలిసారి 1989 అక్టోబరులో మొదటి విజయవాడ పుస్తక మహోత్సవం జరిగింది. అప్పటి నుంచి ఏటా విజయవాడలో పుస్తకమహోత్సవం నిర్వహించాలని సంకల్పించారు. నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రోత్సాహంతో.. విజయవాడలోని ప్రచురణ కర్తలు, సాహితీ వేత్తలు, కవులు, రచయితలు అంతా కలిసి విజయవాడ పుస్తక మహోత్సవ సంఘం(వీబీఎఫ్ఎస్)గా ఏర్పడ్డారు. 1991 నుంచి ఏటా జనవరిలో పుస్తక మహోత్సవం నిర్వహించడం ఆరంభించారు. తొలి ఏడాది 1989లో 84 స్టాళ్లతో నిర్వహించగా, 1991లో 90కు పెరిగాయి. అప్పుడు విజయవాడ జనాభా 5లక్షలుండగా, పుస్తక మహోత్సవానికి వచ్చిన సందర్శకుల సంఖ్య లక్ష వరకూ ఉండేది. 2015లో నిర్వహించిన 26వ పుస్తక మహోత్సవంలో అత్యధికంగా 389 స్టాళ్లను పెట్టి రికార్డు సృష్టించారు. ఈ ఏడాది 200 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఏటా కనీసం ఐదు లక్షల మందికి పైగా పాఠక ప్రియులు తరలివచ్చి ఇక్కడ పుస్తకాలను కొనుగోలు చేస్తుంటారు.
స్టాళ్లకు చేరుకున్న పుస్తకాల
ప్రముఖుల గౌరవార్థం..
విజయవాడకు విమానసౌకర్యం లేని రోజుల్లోనే కుష్వంత్ సింగ్, ఆర్కే లక్ష్మణ్, రొమిల్లా థాపర్ వంటి జాతీయ సాహితీ వేత్తలను ఇక్కడికి రప్పించారు. ఆరుద్ర, సి.నారాయణరెడ్డి, రావూరి భరద్వాజ, కాళీపట్నం రామారావు, మధురాంతకాం రాజారాం, బాపు రమణలు ఇలా తెలుగు సాహిత్యానికి వన్నెలద్దిన రచయితలంతా ఇక్కడికి తరచుగా వచ్చి వెళ్లేవారు. ప్రచురణకర్తలు సొంతంగా ఏర్పాటు చేసుకొనే పుస్తకావిష్కరణ సభలూ, వాటికి హాజరయ్యే రచయితలూ, కవులూ అనేకమంది ఉండేవారు. ఈసారి సాహిత్య వేదికకు గొల్లపూడి మారుతీరావు, ప్రతిభ వేదికకు సత్యజిత్రే, పుస్తక మహోత్సవ ప్రాంగణానికి విక్రమ్ పబ్లిషర్స్ అధినేత ఆర్.రామస్వామి పేర్లను పెట్టారు.
13న పాదయాత్ర..
ఈ ఏడాది పుస్తక ప్రియుల పాదయాత్రను ఫిబ్రవరి 13న నిర్వహిస్తున్నారు. విజయవాడలోని సిద్థార్థ ఆర్ట్స్ కళాశాల నుంచి ఆరంభించి.. ప్రదర్శన జరిగే పాలిటెక్నిక్ కళాశాల వరకూ ఈ పాదయాత్ర జరుగుతుందని విజయవాడ పుస్తక మహోత్సవ సంఘం సమన్వయకర్త ఎమెస్కో విజయకుమార్, గౌరవాధ్యక్షులు బెల్లపు బాబ్జీ, అధ్యక్షులు మనోహరనాయుడు, కార్యదర్శి కె.లక్ష్మయ్య వెల్లడించారు.
200 స్టాళ్లు.. లక్షల పుస్తకాలు..
పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో ఈసారి 200 పుస్తకాల స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్టాళ్లలో కెజి నుంచి పీజీ వరకూ పుస్తకాలు అందుబాటులో ఉంచుతున్నారు. పిల్లలకు సంబంధించిన పుస్తకాలు అధికంగా ఉండబోతున్నాయి. భారతం, రామాయణం, భగవద్గీత, కథల పుస్తకాలు, పంచతంత్రం సహా అన్నీ ఉంటాయి. తెలుగు, ఆంగ్ల నవలలు, ఇంజినీరింగ్, మెడికల్ పుస్తకాలు, ఆధ్యాత్మిక పుస్తకాలు సహా అన్ని రకాలూ అందుబాటులో ఉంటాయి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పుస్తక విక్రేతలు, ప్రచురణ కర్తలు తరలివచ్చి స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జనగళమే.. జయ కెరటమై..
[ 18-04-2024]
పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో తెదేపా అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాగళం సభలు, రోడ్షోకు జనం పోటెత్తారు. -
నేడే.. ఈనాడే..
[ 18-04-2024]
2024 సాధారణ ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల దాఖల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. -
మీరు.. మనసులు గెలవాలండీ..
[ 18-04-2024]
మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్రంలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులకు అధినేత పవన్కల్యాణ్ బీ ఫారాలు అందించారు. -
అనిశాకు చిక్కిన పౌరసరఫరాల అధికారి
[ 18-04-2024]
ఓ బియ్యం వ్యాపారి నుంచి నెలవారీ మామూలు తీసుకుంటూ పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దార్ చెన్నూరి శ్రీనివాస్ అనిశా వలకు చిక్కారు. -
1నే జీతాలివ్వండి మహాప్రభో!
[ 18-04-2024]
తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంతోపాటు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చెప్పిన జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఉద్యోగుల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. -
ఎదురుమొండికి ఎదురు చూపులే..
[ 18-04-2024]
ఎదురుమొండి వారధి నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. తమ చిరకాల స్వప్నం ఎప్పుడు నెరవేరుతుందోనని దీవుల్లో నివాసముంటున్న పది వేల మంది జనాభా దశాబ్ద కాలంగా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. -
కూటమి ప్రభంజనం ఖాయం
[ 18-04-2024]
ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభంజనం ఖాయమని తెదేపా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురామ్ అన్నారు. -
నాడు ఆశల కేంద్రం.. నేడు విధ్వంసానికి నిలయం
[ 18-04-2024]
రాష్ట్ర విభజన తర్వాత తుళ్లూరు మండలంలో ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. -
వైకాపా నాయకుడి ఇంట్లో వైద్యశాల
[ 18-04-2024]
వైకాపా నాయకుడి ఇంట్లో ప్రభుత్వ వైద్యశాల నిర్వహించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల కోడ్కు విరుద్ధంగా అధికార పార్టీ నాయకుడి ఇంట్లో వైద్య సేవలు కొనసాగడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. -
‘రాష్ట్రంలో వైకాపా రాక్షస పాలన’
[ 18-04-2024]
రాష్ట్రంలో వైకాపా రాక్షస పాలనతో జనం విలవిలలాడుతున్నారని సెంట్రల్ సీపీఎం అభ్యర్థి సి.హెచ్.బాబూరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆధ్యాత్మిక చైతన్యం అవసరం
[ 18-04-2024]
నాలుగు వందల సంవత్సరాల పోరాటం తర్వాత అయోధ్యలో రామ మందిర నిర్మాణం సాధ్యమైందని.. ఆ స్ఫూర్తితో ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చైతన్యం రావాలని శైవపీఠాధిపతి శివస్వామి పిలుపునిచ్చారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
[ 18-04-2024]
స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన ఇంజినీరింగ్ విద్యార్థి నీట మునిగి మృతి చెందిన విషాదకర సంఘటన మండలంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. సీఐ జయ్కుమార్ తెలిపిన వివరాల మేరకు మేరకు బాపట్ల పట్టణానికి చెందిన ఇంకొల్లు నాగేశ్వరరావుది వ్యవసాయ కుటుంబం.
తాజా వార్తలు (Latest News)
-
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
-
గంజాయి మిల్క్షేక్!.. మత్తు ముఠాల నయా దందా
-
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
-
అధిక సమయం ఆన్లైన్లో ఉంటే.. పిల్లలు బడికి గైర్హాజరయ్యే ముప్పు అధికం
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)