కృత్రిమ కొరత... రైతులకు వాత!
మిరప పంటకు కొన్నాళ్లుగా పడుతున్న చీడతో రైతులు విలవిలలాడుతుంటే.. ఇదే అదనుగా పురుగు మందులకు కృత్రిమ కొరతను సృష్టిస్తూ కొంతమంది దశారులు అన్నదాతల జేబులు కొల్లగొడుతున్నారు.
బ్లాక్మార్కెట్లో మిరప తెగులు నివారణ మందులు
ఈనాడు, అమరావతి- విజయవాడ సిటీ, న్యూస్టుడే
మిరప పంటకు కొన్నాళ్లుగా పడుతున్న చీడతో రైతులు విలవిలలాడుతుంటే.. ఇదే అదనుగా పురుగు మందులకు కృత్రిమ కొరతను సృష్టిస్తూ కొంతమంది దశారులు అన్నదాతల జేబులు కొల్లగొడుతున్నారు. మిరప పంటకు.. సోకుతున్న నల్లతామర, ఆకు ముడత నివారణకు కొన్ని మందులు ప్రస్తుతం బాగా పనిచేస్తున్నాయి. పంటను కాపాడుకునేందుకు.. రైతులు ఈ మందుల కోసం పోటీ పడి కొంటున్నారు. ఇదే అవకాశంగా చేసుకుని.. కొంతమంది డీలర్లు మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ఎమ్మార్పీ ధరతో సంబంధం లేకండా తాము చెప్పినంత చెల్లిస్తేనే మందును ఇస్తామంటూ రైతులను దోపిడీ చేస్తున్నారు. అప్పులు చేసి మరీ ఈ పురుగు మందులను కొనుగోలు చేస్తూ.. గుల్లవుతున్నారు. జిల్లాలో ఏటా 45వేల ఎకరాల్లో మిర్చి పంటను రైతులు సాగుచేస్తున్నారు. ఈ ఏడాది మరింత మంది రైతులు ముందుకు వచ్చారు. అధిక మొత్తాలు చెల్లించి మరీ కౌలుకు భూములు తీసుకుని మిరప సాగు చేస్తున్నారు. మిరపకు కొన్నాళ్లుగా నల్లతామర, ఆకు ముడత విపరీతంగా సోకుతోంది. ఎలాగైనా పంటలను కాపాడుకునేందుకు పురుగు మందులపై ఆధారపడుతున్నారు. ఆర్థికంగా భారమైనప్పటికీ పిచికారి మందులు కొనుగోలు చేస్తున్నారు. అసలు ధరకు ఎక్కడా మందులు దొరకడం లేదని చెబుతూ.. బ్లాక్మార్కెట్లో అధిక ధరలకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. సమయానికి మందులను పిచికారీ చేయకపోతే.. పంట నష్టపోవాల్సి ఉంటుందనే ఆందోళనతో రైతులు అప్పులు చేసి మరీ ఈ మందును బ్లాక్ మార్కెట్లో ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు.
పువ్వుపై నల్లతామర పురుగు
ఒక సంస్థకు చెందిన మందు 34మిల్లీలీటర్లు రూ.1653 ఎమ్మార్పీ ధర ఉండేది. దీనిని ప్రస్తుతం రూ.2,250కి సదరు సంస్థ పెంచేసింది. బ్లాక్మార్కెట్లో రూ.3500 వరకూ అమ్ముకుంటున్నారు. మిరప పంట పూత దశలో ఉన్నప్పుడు పత్రహరితాన్ని పూర్తిగా నల్లనల్లి పురుగు తినేస్తోంది. దీనివల్ల అత్యధిక శాతం మిరప తోటలు దెబ్బతింటున్నాయి. ఆకుముడత వైరస్, నల్ల తామర కూడా మరోవైపు పంటపై దాడి చేస్తున్నాయి. జిల్లాలోని గంపలగూడెం సహా పలు ప్రాంతాల్లో మిరప పంటకు భారీగా నష్టం వాటిల్లింది. అందుకే.. పురుగు మందులపై అధికంగా ఆధారపడుతున్నారు. కొన్ని మందులు సత్ఫలితాలు ఇస్తుండడంతో వాటికి డిమాండ్ పెరిగింది.
మార్కెట్లో నకిలీ మందు..
గుంటూరులో ఈ మందుకు నకిలీ సైతం తయారు చేస్తూ.. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు పంపిస్తున్నట్టు సమాచారం. ఏలూరు జిల్లాలోని ఆగిరిపల్లి కేంద్రంగా ఈ దందా సాగుతోంది. గుంటూరులో తయారుచేసి ఆగిరిపల్లికి పంపించి.. అక్కడి నుంచి ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలోని రైతులకు సరఫరా చేస్తున్నారు. ఆగిరిపల్లి నుంచి కొంతమంది రైతులతో పెద్దఎత్తున పిచికారీ మందును పంపించి.. వారితోనే మిగతా వారికి పంపిణీ చేయిస్తున్నారు. ఏదైనా తేడా జరిగితే.. సదరు రైతులు సైతం ఇరుక్కుపోతారు. జిల్లాలోని జగ్గయ్యపేట, తిరువూరు, గంపలగూడెం, ఎ.కొండూరుతో పాటు పలు ప్రాంతాల్లో ప్రస్తుతం మిరప అత్యధికంగా సాగుచేస్తున్నారు. ఇప్పటికే వ్యవసాయ ఖర్చులు పెరిగాయి. పురుగు మందుల వినియోగం వల్ల మరింత ఆర్థిక భారం పడుతోంది. బయట తీసుకున్న అప్పులకు వడ్డీలు కట్టలేక రైతులు విలవిలలాడుతున్నారు. ఒకవైపు అధిక ధరలు, మరోవైపు నకిలీ మందులతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ మిరప తెగులుకు మందును ప్రభుత్వమే సరఫరా చేస్తే తమ పంటలను కాపాడుకోవచ్చని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. మందుల కొట్టుల నుంచి అధికారులకు నెలవారీ మామూళ్లు అందుతుండడంతో వాళ్లు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తనిఖీలు నిర్వహిస్తున్నాం
మిర్చిలో నల్లతామర నివారణకు వినియోగించే పిచికారి మందును కృత్రిమ కొరత లేకుండా, అధిక ధరలు విక్రయాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. దీనిలో భాగంగా ప్రత్యేక స్క్వాడ్ బృందం ఏర్పాటు చేసి పురుగులు, ఎరువులు దుకాణాలను తనిఖీ చేయిస్తున్నాం. రైతులు కూడా తమవంతు సహకారం అందించాలి.
విజయభారతి, వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకురాలు, ఎన్టీఆర్ జిల్లా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గులకరాయికి.. రాజకీయ రంగు!
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్పై గులకరాయి కేసు.. కుట్ర కేసుగా మారుతోంది. రాజకీయ రంగు పులుముకునేందుకు రంగం సిద్ధమైంది. తెదేపా నేతలు అనుమానించినట్లే.. మరికొందరు కీలక నేతలను ఇరికించేందుకు ఖాళీ వదిలినట్లు తెలిసింది. -
తెచ్చిపెట్టేది లేదు... తరిమికొట్టుడే..!
[ 19-04-2024]
‘గత ఐదేళ్ల జగన్ పాలనలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఒక్క పరిశ్రమ కూడా నెలకొల్పింది లేదు. కానీ.. గత చంద్రబాబు సర్కారు ఎన్నో ఇబ్బందులు పడి, పారిశ్రామికవేత్తలను ఒప్పించి, రాయితీలు ఇచ్చి ఇక్కడ పెట్టించిన పరిశ్రమలను మూతపడేలా చేయడంలో వైకాపా సర్కారు విజయవంతమైంది. -
అభివృద్ధి పరుగులు పెట్టిస్తా: సుజనా
[ 19-04-2024]
విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ప్రధాని మోదీ, చంద్రబాబు సహకారంతో అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తానని భాజపా పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు. గురువారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. -
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: బాలశౌరి
[ 19-04-2024]
వైకాపా అరాచక పాలన నుంచి విముక్తి పొందేందుకు తెదేపా, జనసేన కూటమి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కూటమి బందరు ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి పిలుపునిచ్చారు. -
ఒడిసిపడతానని.. విడిచిపెడతావేం?
[ 19-04-2024]
సీఎం జగన్ మాటలకు అర్థాలే వేరు. ఆయన చెప్పారంటే... అసలు చేయరని అర్థం. దీనికి సజీవ సాక్ష్యం కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీకి దిగువన ప్రతిపాదించిన రెండు బ్యారేజీల నిర్మాణం. కృష్ణా, గుంటూరు జిల్లాలకు ప్రాణావసరమైన వీటి గురించి జగన్ సర్కారు ఏమాత్రం పట్టించుకోలేదు. -
నాలుగో సింహం నలిగిపోతోంది
[ 19-04-2024]
వారాంతపు సెలవులు లేక పోలీసులు తీవ్ర ఇబ్బందుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. రోజూ ఒత్తిడితో పని చేయాల్సి వస్తోంది. ఈ విధంగా ఉద్యోగం చేయడం కష్టంగా ఉందని పోలీసు ఉద్యోగుల సంఘం తరఫున ఉన్నతాధికారులను, ప్రజా ప్రతినిధులను వేడుకున్నారు. -
తెదేపా అభ్యర్థుల నామ పత్రాల దాఖలు
[ 19-04-2024]
గన్నవరం నియోజకవర్గంలో జనసేన, భాజపా మద్దతుతో తెదేపా బలపర్చిన ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గురువారం ఉదయం 11.15 గంటలకు తొలి విడత నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి జేసీ గీతాంజలిశర్మకు సమర్పించారు. -
లారీ ఢీకొని ప్రసాదంపాడు వాసి దుర్మరణం
[ 19-04-2024]
చంద్రుగొండ మండలం అయ్యన్నపాలెం ఒడ్డు వద్ద గల మలుపు సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన శ్రీకృష్ణచక్రపాణి(61) మృతి చెందారు. -
బావిలో పడిన యువకుడు
[ 19-04-2024]
బాపులపాడు మండలం బొమ్ములూరులో ఓ యువకుడు బావిలో పడిన ఘటన గురువారం రాత్రి కలకలం రేపింది. ఇదే గ్రామానికి చెందిన పవన్ స్థానిక విద్యుత్తు ఉపకేంద్రం సమీపంలో ఉన్న పొలంలోని బావిలో పడిపోయాడు. -
చెత్తకు నిప్పు.. గ్యాస్ పైప్లైన్కు మంటలు
[ 19-04-2024]
ముదినేపల్లి ప్రధాన రహదారిలో చెత్త కాలుస్తుండగా..గ్యాస్ పైప్లైన్ లుకింగ్ పాయింట్కు అంటుకొని భీతావహ పరిస్థితి ఏర్పడింది. వెంటనే స్పందించిన అగ్నిమాపకశాఖ అధికారులు మంటల్ని అదుపు చేశారు. -
ప్రోత్సాహం అన్నావు.. సాయం మరిచావు
[ 19-04-2024]
బందరు బంగారంగా ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన రోల్డ్గోల్డ్ పరిశ్రమ ప్రస్తుతం అనేక ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. -
ఆ భోజనం మా కొద్దు
[ 19-04-2024]
మధ్యాహ్నభోజన మెనూ మార్చాం...పోషకాలతో కూడిన భోజనం అందిస్తున్నాం అని ముఖ్యమంత్రి జగన్ గొప్పలు చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. -
ఇన్నాళ్లూ.. కాలయాపన
[ 19-04-2024]
పేరుకే అది వంద పడకల ఆసుపత్రి.. వైద్యం మాత్రం ‘ప్రాథమిక’ స్థాయిలోనే అందుతోంది. వైద్యశాలను ఉన్నతంగా తీర్చిదిద్దామని ఎమ్మెల్యే సోదరులు ప్రజలను మభ్యపెడుతున్నారు. స్థాయి పెంపు కాగితాలకే పరిమితమైంది. -
నాడు కళకళ.. నేడు వెలవెల
[ 19-04-2024]
వైకాపా పాలనలో పారిశ్రామికవాడలు పూర్తిగా చతికిల పడ్డాయి. గుడివాడ ఆటోనగర్ ఒకప్పుడు దేశవ్యాప్తంగా వ్యవసాయ పరికరాలకు ప్రఖ్యాతి. కర్నాటక, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు ఇక్కడి నుంచి కల్టివేటర్లు, వీల్స్, నూర్పిడి యంత్రాలు సరఫరా అయ్యాయి. -
సుద్దగా అన్నం.. అందుకే తినం
[ 19-04-2024]
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చాలా మంది విద్యార్థులకు రుచించడం లేదు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మెనూ అమలు చేస్తున్నప్పటికీ ఆహార పదార్థాలు రుచి, శుచి ఉండడం లేదని పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చెబుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!