logo

ద్విచక్ర వాహనం టైరు పేలి మహిళ మృతి

వీరవల్లి సమీపంలో 16వ జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి టైరు పేలి ఓ మహిళ దుర్మరణం చెందారు.

Published : 09 Feb 2023 01:48 IST

హనుమాన్‌జంక్షన్‌, న్యూస్‌టుడే: వీరవల్లి సమీపంలో 16వ జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి టైరు పేలి ఓ మహిళ దుర్మరణం చెందారు. హనుమాన్‌జంక్షన్‌ శివాజీ కాలనీకు చెందిన పిల్లా ఉదయలక్ష్మి(55), కుమారుడు ఫణితేజ ద్విచక్ర వాహనంపై విజయవాడ వెళ్లి తిరిగి వస్తుండగా పాత చక్కెర కర్మాగారం సమీపానికి వచ్చేసరికి అనూహ్యంగా వెనక టైరు పేలింది. దీంతో అదుపు తప్పి కిందపడిపోయిన ఉదయలక్ష్మికి తీవ్ర గాయలవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కుమారుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. వీరవల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని