ఆలోచనలు.. ఆవిష్కరణలు
మనం నిత్యజీవితంలో వినియోగించే అనేక వస్తువులు, ఇతర సౌకర్యాలు అన్నీ గతంలో పలువురు శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల ఫలితమే.
ఇన్స్పైర్ మనక్ పోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థినులు
మచిలీపట్నం(గొడుగుపేట),న్యూస్టుడే
ప్రయోగాలు ప్రదర్శిస్తున్న విద్యార్థులు
మనం నిత్యజీవితంలో వినియోగించే అనేక వస్తువులు, ఇతర సౌకర్యాలు అన్నీ గతంలో పలువురు శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల ఫలితమే. అలా ప్రతి ఒక్కరిలోనూ భిన్నమైన ఆలోచనలు, రక రకాల ఊహలు ఉంటాయి. వాటిని గుర్తించి వెన్నుతట్టి ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టించడమే కాదు సమాజానికి అవసరమైన అనేక సౌకర్యాలు సమకూరతాయి. 2020-22 సంవత్సరానికి నిర్వహించిన ఇన్స్పైర్ మనక్ పోటీల్లో జిల్లాలోని వివిధ ప్రాంతాల విద్యార్థులు తమ ఊహలకు రూపాలు ఇచ్చి అందరి మన్ననలు అందుకుంటున్నారు. జిల్లా నుంచి మొత్తం 35 ప్రాజెక్టులు రాష్ట్రస్థాయికి అర్హత సాధించడం విశేషం. వాటిలో పలువురు విద్యార్థుల ప్రయోగాలు, వాటి ఉపయోగాలు, తదితర అంశాలపై ప్రత్యేక కథనం.
రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట
రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు గూడూరు మండలం తరకటూరు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని అర్జా సాయిలక్ష్మి ఇన్నోవేటివ్ స్పీడ్బ్రేకర్స్ అనే పరికరాన్ని రూపొందించి తన సత్తా చాటింది. తాను తీర్చిదిద్దిన పరికరం ఒకేచోట తిరుగుతూ ఉంటుంది. సరైన మార్గంలో మాత్రమే దీనిపై నుంచి వాహనాలు వెళ్లగలవు. రాంగ్రూట్లో ఎదురుగా వస్తే వెళ్లడానికి అవకాశం ఉండదు. దీనివల్ల రోడ్డు ప్రమాదాలను కూడా నియంత్రించవచ్చని వివరించి రాష్ట్రస్థాయికి అర్హత సాధించింది..
వాయి కాలుష్యం తగ్గించేలా..
వాయుకాలుష్యాన్ని తగ్గించేందుకు బంటుమిల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఇసుమర్తి సుకీర్తి మినీ ఎయిర్ ఫ్యూరిఫైర్ను రూపొందించింది. నీటిని ఎయిర్ ఫిల్టర్గా ఉపయోగించేలా దీన్ని తయారుచేశారు. ఈ పరికరంలో తక్కువ శబ్ధం గల ఫ్యాన్లు వినియోగించారు. వీటి ద్వారా గాలిని నీటి ట్యాంకు ద్వారా పంపుతామని తద్వారా నీటిలో దుమ్ము, శిలీంధ్రాలు, బ్యాక్టీరియాలకు అడ్డుకట్ట పడి చల్లని గాలి వస్తుందని విద్యార్థిని వివరించింది.
మహిళలకు ఆసరా
ఆపదలో ఉన్న మహిళలు, యువతులకు ఆసరాగా ఉండేలా బంటుమిల్లి మండలంలోని రామవరపుమోడి ప్రాథ]మికోన్నత పాఠశాల విద్యార్థిని తాతా యోగశ్రీప్రియ ఉమెన్ సేఫ్టీబ్యాంగిల్ అనే పరికరాన్ని తీర్చిదిద్దింది. చూడటానికి చేతిగాజు మాదిరిగా ఉండే ఈ పరికరాన్ని ధరిస్తే ఎక్కడికి వెళ్లినా ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా అండగా ఉంటుందని వివరించింది. ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పుడు పరికరానికి ఉండే చిన్న స్విచ్ఛ్ను నొక్కితే పోలీసు కార్యాలయానికి సమాచారం వెళ్లిపోతుంది.
వైర్లెస్ మొబైల్ఛార్జర్
గూడూరు మండలంలోని కప్పలదొడ్డి జడ్పీ ఉన్నతపాఠశాల విద్యార్థిని బి.యువశ్రీ ఇన్నోవేటివ్ వైర్లెస్ మొబైల్ ఛార్జర్ను అందుబాటులోకి తెచ్చింది. విద్యుత్తు అయస్కాంత ప్రేరణశక్తి ద్వారా ఇది పనిచేస్తుంది. ప్రస్తుతం పవర్ బ్యాంకులు లాంటివి అందుబాటులోకి వచ్చినా వాటికి వైర్ల అవసరం ఉంది. పైగా వాటికి కూడా ఛార్జింగ్ పెట్టుకోవాలి. తాను తీర్చిదిద్దిన పరికరానికి ఎలాంటి వైర్లు అవసరం లేకుండా కేవలం చరవాణి పరికరంపైన ఉంచితే చాలు ఛార్జింగ్ అవుతుందని, ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చని చెబుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమ్మతోడు.. అడ్డగోలేచూడు!
[ 28-03-2024]
‘‘విజయవాడ దుర్గామల్లేశ్వర దేవస్థానానికి చెందిన రూ.150 కోట్లకు పైగా విలువైన చుండూరు వెంకటరెడ్డి (సి.వి.రెడ్డి) ఛారిటీస్ స్థలం, భవనాలను అన్యాక్రాంతం చేసేలా అడుగులు పడుతున్నాయి. -
కోడ్ కొండెక్కి.. అక్రమంగా రోడ్డెక్కి
[ 28-03-2024]
కోడ్ వచ్చి.. 10 రోజులైనా కళ్లెం పడనేలేదు. టిప్పర్లు తిరుగుతూనే ఉన్నాయి. రాత్రుళ్లు తవ్వుతూనే ఉన్నారు. అడిగితే తీవ్ర బెదిరింపులు. చిన్నాచితక నాయకులు ఆపినా.. బడా నేతలు తవ్వేస్తున్నారు. -
పశ్చిమ బరిలో సుజనా
[ 28-03-2024]
తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. విజయవాడ పశ్చిమ సీటును పొత్తులో భాగంగా భాజపాకు కేటాయించారు. ఇక్కడి నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి అవకాశం దక్కింది. భాజపా అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. -
నిజం గెలవాలి.. రాష్ట్రం వెలగాలి
[ 28-03-2024]
నిజం గెలవాలి యాత్రలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి బుధవారం సాయంత్రం హనుమాన్జంక్షన్, బిళ్లనపల్లిలో పర్యటించారు. -
ప్రలోభాలు అరికట్టేందుకు ముమ్మర తనిఖీలు
[ 28-03-2024]
జిల్లాలో తనిఖీలు ముమ్మరంగా చేసి మద్యం, నగదు, కానుకలను పట్టుకునేందుకు పటిష్ఠ చర్యలు చేపడతామని ఎన్నికల అధికారి రాజబాబు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు తెలియజేశారు. -
పార్టీ కోసం పనిచేయాల్సిందే.. ఓటర్లను మభ్యపెట్టాల్సిందే!
[ 28-03-2024]
ప్రతి ఓటరు నాడి పసిగట్టి లోబర్చుకోవడంతో పాటు వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పని చేయాలని వైకాపా నాయకులు వాలంటీర్లకు దిశానిర్దేశం చేస్తున్నారు. -
ఎర్రకట్ట విస్తరణ ఎప్పుడో?
[ 28-03-2024]
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. నగరంలో రహదార్లు మాత్రం విస్తరణకు నోచుకోలేదు. వందలాది వాహనాల రాకపోకలతో ఎర్రకట్ట ప్రమాదాలకు నెలవుగా మారింది. -
రైల్వే సరకు రవాణాలో రికార్డు ఆదాయం
[ 28-03-2024]
దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ సరకు రవాణాలో రికార్డు స్థాయి ఆదాయం లభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 36.2 మిలియన్ టన్నుల సరకు రవాణా చేయడం ద్వారా ఈ ఘనత సాధించింది. -
అయిదేళ్లలో రాష్ట్రానికి పెట్టుబడులేవీ?
[ 28-03-2024]
రాష్ట్రానికి వైకాపా ప్రభుత్వ పాలనలో పెట్టుబడులు రాలేదని, యువతకు ఉద్యోగాలు లేవని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఆయన బుధవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. -
మహిళ హత్య కేసులో నిందితుడి అరెస్టు
[ 28-03-2024]
మహిళ హత్య కేసులో నిందితుడిని స్థానిక పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామీణ మండలం దామూలూరు శివారు పంట కాలువ 19న గుర్తుతెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. -
సీఎం జగన్ ఎగ్గొట్టిన హామీలు 85% : నెట్టెం
[ 28-03-2024]
రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు సీఎం జగన్మోహన్రెడ్డి, ఆయన పార్టీనీ చిత్తుగా ఎందుకు ఓడించాలో చెప్పడానికి స్పష్టమైన కారణాలు ఉన్నాయని తెదేపా జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురాం అన్నారు. -
బీమా సొమ్ము చెల్లించాలని తీర్పు
[ 28-03-2024]
బీమా సొమ్ము చెల్లించాలని వినియోగదారుల కమిషన్ తీర్పు చెప్పింది. కమిషన్ కార్యాలయం విడుదల చేసిన వివరాల ప్రకారం.. -
అయిదుగురు బుక్ కీపర్లపై వేటు
[ 28-03-2024]
కృత్తివెన్ను మండలం నీలిపూడిలో ఈ నెల 25న వైకాపా అభ్యర్థి ఉప్పాల రమేష్(రాము) నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అయిదుగురు వెలుగు బుక్ కీపర్లను విధుల నుంచి తొలగిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. -
దుర్గగుడి హుండీ ఆదాయం రూ.3.78 కోట్లు
[ 28-03-2024]
శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం హుండీల్లో 25 రోజులకు భక్తులు సమర్పించిన కానుకలను మల్లికార్జున మహా మండపం ఆరో అంతస్తులో బుధవారం లెక్కించగా.. రూ.3,78,72,537 ఆదాయం వచ్చింది. -
కృష్ణా పూర్వ డీపీవో ఉద్యోగం నుంచి తొలగింపు
[ 28-03-2024]
కృష్ణా జిల్లా పూర్వ పంచాయతీ అధికారి, ప్రస్తుత పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా ఉన్న సీహెచ్ సుబ్రహ్మణ్యంను పూర్తిగా ఉద్యోగం నుంచి తొలగిస్తూ..
తాజా వార్తలు (Latest News)
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?