3,814 హెక్టార్లలో పంటలకు నష్టం
రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నా తక్కువ వర్షపాతం నమోదు కావడంతో కొంతవరకు అయినా పంట దక్కుతుందని రైతులు భావిస్తుండగా శనివారం భారీగా వర్షం కురవడంతో ఎక్కడికక్కడ పొలాల్లో నీరు నిలిచింది.
నీట మునిగిన పొలాలు వి పలుచోట్ల కూలిన విద్యుత్తు స్తంభాలు
మచిలీపట్నం(గొడుగుపేట),న్యూస్టుడే
గూడూరు మండలం మల్లవోలులో దెబ్బతిన్న మినుము
రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నా తక్కువ వర్షపాతం నమోదు కావడంతో కొంతవరకు అయినా పంట దక్కుతుందని రైతులు భావిస్తుండగా శనివారం భారీగా వర్షం కురవడంతో ఎక్కడికక్కడ పొలాల్లో నీరు నిలిచింది. రబీలో జిల్లాలో 2.67లక్షల ఎకరాల్లో మినుము పంట సాగైంది. పలు మండలాల్లో చాలావరకు పంట నూర్పిళ్లు చేసినా ఆలస్యంగా సాగు చేసిన పంట ఇంకా పొలాల్లోనే ఉంది. గూడూరు మండలంలోని మేజర్ పంచాయతీ అయిన మల్లవోలులో పనలపై ఉన్న మినుముపంటతోపాటు గుట్టలు కూడా తడిచిపోయి నీళ్లల్లో నానుతున్నాయి. కంకటావ, లేళ్లగరువు, గూడూరు ఇలా పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. పెడన మండలంలోని చేవెండ్ర, చెన్నూరుతోపాటు పలు చోట్ల గుట్టలుగా ఉన్న మినుము మొలకలు రావడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. బందరు, చల్లపల్లి ఘంటసాల, కోడూరు, మోపిదేవి, పామర్రు తదితర మండలాల్లో ఇంకా వేలాది ఎకరాల్లో పంట దెబ్బతింది. కంకిపాడు, పెనమలూరు, గన్నవరం, ఉంగుటూరు, ఉయ్యూరు తదితర మండలాల్లో వరితోపాటు మొక్కజొన్న, బందరు, గూడూరు, బంటుమిల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో వేరుశనగ పంటలకూ నష్టం వాటిల్లింది. జిల్లా వ్యాప్తంగా 3,814 హెక్టార్లలో వివిధ పంటలు వర్షాల కారణంగా దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
నేలకొరిగిన వృక్షాలు..
ఈదురు గాలుల కారణంగా పెడన మండలంలోని కొంగంచర్ల ప్రాంతంలో ప్రధాన రహదారి పక్కన కూలిన చెట్ల కారణంగా ఉదయం రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చేవెండ్ర విద్యుత్తు ఉపకేంద్రం పరిధిలోని చేవెండ్రపాలెం, కమలాపురం, ఉప్పలకలవగుంట తదితర గ్రామాల్లో 20 స్తంభాలు నేలకొరిగినట్లు అధికారులు తెలిపారు. దీంతో శనివారం అర్ధరాత్రి నుంచి విద్యుత్తు సరఫరా నిలిచిపోగా ఆదివారం సాయంత్రానికి పునరుద్ధరించారు..
గుడ్లవల్లేరు మండలం కూరాడ వద్ద రహదారిపై కూలిన భారీవృక్షాన్ని తొలగిస్తున్న సిబ్బంది
35 మి.మీ సగటు వర్షపాతం
జిల్లాలో ఆదివారం ఉదయానికి 35 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదయ్యింది.గుడ్లవల్లేరు మండలంలో 79.8 మి.మీ అత్యధిక వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా తోట్లవల్లూరు లో 7.2 మి.మీ కురిసింది. బంటుమిల్లి 58.4, పెదపారుపూడి 57.8, గుడివాడ 50.6, కంకిపాడు 50.2, కృత్తివెన్ను 44.0, అవనిగడ్డ 42.8, ఉయ్యూరు 42.8, పామర్రు 41.6, మొవ్వ 40.8, చల్లపల్లి 37.4, పెడన 37.2, గూడూరు 37.0, పెనమలూరు 30.4, నందివాడ 29.4, ఉంగుటూరు 29.0, ఘంటసాల 28.8, మోపిదేవి 26.2, నాగాయలంక 26.2, గన్నవరం 25.2, కోడూరు 22.4, పమిడిముక్కల 10.6, మచిలీపట్నం 10.2 మి.మీ చొప్పున వర్షం కురిసింది.
వివరాలు సేకరిస్తున్నాం
జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటల వివరాలు సేకరిస్తున్నాం. ఆ దిశగా జిల్లాలోని అన్ని మండలాల్లో వ్యవసాయ అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. ఎక్కడెక్కడ ఎంత మేర ఏయే పంటలకు నష్టం వాటిల్లిందో నివేదికను ప్రభుత్వానికి అందజేస్తాం.
మనోహరరావు, జిల్లా వ్యవసాయశాఖాధికారి
విద్యుత్తు సరఫరా పునరుద్ధరించాం
మచిలీపట్నం డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో విద్యుత్తు స్తంభాలు నేెలకొరగడంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వాటిని తిరిగి నెలకొల్పేలా చర్యలు తీసుకున్నాం. పెడన, బందరు, బంటుమిల్లి మండలాల్లో కొంతసేపు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడగా వెంటనే పునరుద్ధరించాం.
ఎం. భాస్కరరావు, విద్యుత్తు శాఖ ఈఈ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమ్మతోడు.. అడ్డగోలేచూడు!
[ 28-03-2024]
‘‘విజయవాడ దుర్గామల్లేశ్వర దేవస్థానానికి చెందిన రూ.150 కోట్లకు పైగా విలువైన చుండూరు వెంకటరెడ్డి (సి.వి.రెడ్డి) ఛారిటీస్ స్థలం, భవనాలను అన్యాక్రాంతం చేసేలా అడుగులు పడుతున్నాయి. -
కోడ్ కొండెక్కి.. అక్రమంగా రోడ్డెక్కి
[ 28-03-2024]
కోడ్ వచ్చి.. 10 రోజులైనా కళ్లెం పడనేలేదు. టిప్పర్లు తిరుగుతూనే ఉన్నాయి. రాత్రుళ్లు తవ్వుతూనే ఉన్నారు. అడిగితే తీవ్ర బెదిరింపులు. చిన్నాచితక నాయకులు ఆపినా.. బడా నేతలు తవ్వేస్తున్నారు. -
పశ్చిమ బరిలో సుజనా
[ 28-03-2024]
తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. విజయవాడ పశ్చిమ సీటును పొత్తులో భాగంగా భాజపాకు కేటాయించారు. ఇక్కడి నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి అవకాశం దక్కింది. భాజపా అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. -
నిజం గెలవాలి.. రాష్ట్రం వెలగాలి
[ 28-03-2024]
నిజం గెలవాలి యాత్రలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి బుధవారం సాయంత్రం హనుమాన్జంక్షన్, బిళ్లనపల్లిలో పర్యటించారు. -
ప్రలోభాలు అరికట్టేందుకు ముమ్మర తనిఖీలు
[ 28-03-2024]
జిల్లాలో తనిఖీలు ముమ్మరంగా చేసి మద్యం, నగదు, కానుకలను పట్టుకునేందుకు పటిష్ఠ చర్యలు చేపడతామని ఎన్నికల అధికారి రాజబాబు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు తెలియజేశారు. -
పార్టీ కోసం పనిచేయాల్సిందే.. ఓటర్లను మభ్యపెట్టాల్సిందే!
[ 28-03-2024]
ప్రతి ఓటరు నాడి పసిగట్టి లోబర్చుకోవడంతో పాటు వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పని చేయాలని వైకాపా నాయకులు వాలంటీర్లకు దిశానిర్దేశం చేస్తున్నారు. -
ఎర్రకట్ట విస్తరణ ఎప్పుడో?
[ 28-03-2024]
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. నగరంలో రహదార్లు మాత్రం విస్తరణకు నోచుకోలేదు. వందలాది వాహనాల రాకపోకలతో ఎర్రకట్ట ప్రమాదాలకు నెలవుగా మారింది. -
రైల్వే సరకు రవాణాలో రికార్డు ఆదాయం
[ 28-03-2024]
దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ సరకు రవాణాలో రికార్డు స్థాయి ఆదాయం లభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 36.2 మిలియన్ టన్నుల సరకు రవాణా చేయడం ద్వారా ఈ ఘనత సాధించింది. -
అయిదేళ్లలో రాష్ట్రానికి పెట్టుబడులేవీ?
[ 28-03-2024]
రాష్ట్రానికి వైకాపా ప్రభుత్వ పాలనలో పెట్టుబడులు రాలేదని, యువతకు ఉద్యోగాలు లేవని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఆయన బుధవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. -
మహిళ హత్య కేసులో నిందితుడి అరెస్టు
[ 28-03-2024]
మహిళ హత్య కేసులో నిందితుడిని స్థానిక పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామీణ మండలం దామూలూరు శివారు పంట కాలువ 19న గుర్తుతెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. -
సీఎం జగన్ ఎగ్గొట్టిన హామీలు 85% : నెట్టెం
[ 28-03-2024]
రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు సీఎం జగన్మోహన్రెడ్డి, ఆయన పార్టీనీ చిత్తుగా ఎందుకు ఓడించాలో చెప్పడానికి స్పష్టమైన కారణాలు ఉన్నాయని తెదేపా జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురాం అన్నారు. -
బీమా సొమ్ము చెల్లించాలని తీర్పు
[ 28-03-2024]
బీమా సొమ్ము చెల్లించాలని వినియోగదారుల కమిషన్ తీర్పు చెప్పింది. కమిషన్ కార్యాలయం విడుదల చేసిన వివరాల ప్రకారం.. -
అయిదుగురు బుక్ కీపర్లపై వేటు
[ 28-03-2024]
కృత్తివెన్ను మండలం నీలిపూడిలో ఈ నెల 25న వైకాపా అభ్యర్థి ఉప్పాల రమేష్(రాము) నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అయిదుగురు వెలుగు బుక్ కీపర్లను విధుల నుంచి తొలగిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. -
దుర్గగుడి హుండీ ఆదాయం రూ.3.78 కోట్లు
[ 28-03-2024]
శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం హుండీల్లో 25 రోజులకు భక్తులు సమర్పించిన కానుకలను మల్లికార్జున మహా మండపం ఆరో అంతస్తులో బుధవారం లెక్కించగా.. రూ.3,78,72,537 ఆదాయం వచ్చింది. -
కృష్ణా పూర్వ డీపీవో ఉద్యోగం నుంచి తొలగింపు
[ 28-03-2024]
కృష్ణా జిల్లా పూర్వ పంచాయతీ అధికారి, ప్రస్తుత పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా ఉన్న సీహెచ్ సుబ్రహ్మణ్యంను పూర్తిగా ఉద్యోగం నుంచి తొలగిస్తూ..
తాజా వార్తలు (Latest News)
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 100 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత