ఆగని మృత్యుఘోష
రోడ్డు ప్రమాదాలు నానాటికీ పెరుగుతున్నాయి. మరణాలకు అడ్డుకట్ట పడడం లేదు. వీటికితోడు రహదారుల నిర్మాణంలో లోపాలు కూడా కారణమవుతున్నాయి.
ప్రాణాలు తోడేస్తున్న బ్లాక్స్పాట్లు
నిత్యకృత్యంగా మారిన రోడ్డు ప్రమాదాలు
ఈనాడు, అమరావతి
రోడ్డు ప్రమాదాలు నానాటికీ పెరుగుతున్నాయి. మరణాలకు అడ్డుకట్ట పడడం లేదు. వీటికితోడు రహదారుల నిర్మాణంలో లోపాలు కూడా కారణమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మారడం లేదు. ఫలితంగా ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. రహదారుల నిర్మాణానికి రూ.వందల కోట్లు వెచ్చిస్తున్నా భద్రత విషయంలో ప్రమాణాలు ఏమాత్రం పాటించడం లేదు. జిల్లాలోని చాలాచోట్ల బ్లాక్స్పాట్లను సరి చేయడంలో విఫలమవుతున్నారు. ఎక్కువగా ప్రాణనష్టం వీటి కారణంగానే సంభవిస్తోంది. రహదారి భద్రతా సమావేశాల్లో ప్రమాదాల అడ్డుకట్టకు నిర్ణయాలు తీసుకుంటున్నా అవి ఆచరణలోకి రావడం లేదు. ఎన్టీఆర్ జిల్లాలో జాతీయ రహదారులపైనే ఎక్కువ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
గుర్తించినా పట్టించుకోరు
రహదారులు ఇరుకిరుకుగా ఉండడం, వంకరగా ఉండడం, సైన్ బోర్డులు ఏర్పాటు చేయకపోవడం, రద్దీ ప్రాంతాల్లో వేగనిరోధకాలు లేకపోవడం, తదితర కారణాలతో దుర్ఘటనలు జరుగుతున్నాయి. వీటిని రవాణా, ర.భ, జాతీయ రహదారుల విభాగాలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి లోపాలను సరిచేయాలి. అక్కడక్కడా బాగు చేసినా, చాలా చోట్ల అలాగే ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లా పరిధిలో మొత్తం 105 బ్లాక్స్పాట్లు ఉన్నట్లు తేల్చారు. జిల్లా నుంచి జాతీయ, రాష్ట్ర రహదారులు ఎక్కువ నిడివితో విస్తరించి ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో గతేడాది గణాంకాలు పరిశీలిస్తే సగటున నెలకు 129 ప్రమాదాలు జరిగాయి. నెలకు 35 మరణాలు సంభవించగా, 114 మంది క్షతగాత్రులయ్యారు. రాత్రి సమయాల్లో ప్రమాదాలు ఎక్కువ చోటుచేసుకుంటున్నాయి. రహదారులపై దీపాల వెలుతురు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
నీ చెన్నై - కోల్కతా జాతీయ రహదారిపై రామవరప్పాడు నుంచి గూడవల్లి కూడలి వరకు రాత్రి సమయాల్లో అంధకారం నెలకొంటోంది. సెంట్రల్ లైటింగ్ వెలగడం లేదు. ఈ పరిధిలోని 8 కి.మీ నిడివిలో రోజుకు సగటున ఐదు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇందులో సగం రాత్రి సమయాల్లోనే ఉంటున్నాయి. ఇటీవల.. ఏలూరు నుంచి ద్విచక్ర వాహనంపై ఇద్దరు వ్యక్తులు వస్తున్నారు. గూడవల్లి వచ్చే సరికి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీ చీకట్లో ఢీకొనడంతో అక్కడికక్కడే చనిపోయారు.
* విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిలోని పలు ప్రాంతాలు ప్రమాదాలకు కేంద్రాలుగా మారాయి. ప్రధానంగా చిల్లకల్లు, అంబారుపేట అడ్డరోడ్డు, ఐతవరం, కీసర వంతెన సమీపం, బీరకలపాడు అడ్డరోడ్డు, తదితర ప్రాంతాలు ప్రమాదాలకు అడ్డాలుగా మారాయి. కంచికచర్లలోని బంకు సెంటర్ నుంచి చెవిటికల్లు సెంటర్ వరకు జాతీయ రహదారి ఒకవైపు ఎత్తుగా, మరోవైపు పల్లంగా ఉంటుంది. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. కేవలం మూడు నెలల్లోనే 30 వరకు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.
* హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిలో కనకదుర్గ వంతెన గత ఏడాది ప్రారంభమైంది. హైదరాబాద్ వెళ్లే వైపు భవానీపురం వద్ద వంతెన ముగుస్తుంది. ఈ ప్రాంతంలో పక్క నుంచి వచ్చే అప్రోచ్ రోడ్డు ఇరుకిరుకుగా ఉండడంతో వంతెన పైనుంచి వచ్చే వాహనాలు, అప్రోచ్ రోడ్డు నుంచి వచ్చేవి ఢీకొంటున్నాయి. ఈ లోపాన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా
[ 20-04-2024]
తనను పోలీసులు నిత్యం వేధిస్తున్నారని తెదేపా నేత బొండా ఉమా అన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
రాజీనామా చేయకుంటే ఊరుకోం.. వాలంటీర్లపై వైకాపా నాయకుల ఒత్తిడి
[ 20-04-2024]
‘వాలంటీర్లు రాజీనామా చేసి మా కోసం ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాల్సిందే. మా కోసమే మిమ్మల్ని పెట్టుకున్నాం. -
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం
[ 20-04-2024]
మద్యంపై ఆదాయం అంటే.. ప్రజల రక్త మాంసాలతో వ్యాపారం చేయడమే. మహిళల కంట నీరు పెట్టించే.. ఆదాయంతో ఎవరికీ మేలు జరగదు సరికదా... సమాజానికి నష్టం. -
మహా మాయగాళ్లు..!
[ 20-04-2024]
‘టిడ్కో ఇళ్లకు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన పని లేదు. మన అందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే. -
పేర్నీ.. స్థాయి తెలుసుకొని మాట్లాడు
[ 20-04-2024]
అరాచకాలు, అక్రమాలు మినహా ప్రజా సంక్షేమం, అభివృద్ధి ఏమాత్రం పట్టని పేర్ని వెంకట్రామయ్య(నాని)కి తెదేపా, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్లను విమర్శించే స్థాయి లేదని కూటమి నాయకులు పేర్కొన్నారు. -
కృష్ణా డెల్టాపై కక్షగట్టి.. ఎండగట్టే యత్నం: ఎంపీ
[ 20-04-2024]
రాష్ట్రాభివృద్ధిపై కనీస అవగాహన లేని జగన్ లాంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రిని ప్రజలు ఎన్నడూ చూడలేదని మచిలీపట్నం ఎంపీ కూటమి అభ్యర్థి వల్లభనేని బాలశౌరి పేర్కొన్నారు. -
భవన నిర్మాణదారుడి ఖాతా నుంచి రూ.35 లక్షలు మాయం
[ 20-04-2024]
భవన నిర్మాణదారుడి ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు రూ.35 లక్షలు లాగేశారు. పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. -
కోతల జోగి.. చేతలు ఏవీ..?
[ 20-04-2024]
దీర్ఘకాలంగా ఉన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. ఎప్పటికప్పుడు పాలకులు ఈ సమస్యపై హామీలు ఇవ్వడం తప్పితే పీఠం ఎక్కాక దాని ఊసే ఎత్తడం లేదు. -
పీఠమెక్కారు.. ఆక్వా రైతు నడ్డి విరిచారు
[ 20-04-2024]
అధికారంలోకి వచ్చాక ఆక్వారంగానికి పెద్దపీట వేస్తాం.. తక్కువధరకే విద్యుత్తు అందిస్తామంటూ ఊదరగొట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పీఠమెక్కాక ఆ ఊసే ఎత్తలేదు.. బాదుడే బాదుడు మొదలుపెట్టారని ఆక్వారైతులు ఆరోపిస్తున్నారు. -
మండుటెండలో సమరోత్సాహం
[ 20-04-2024]
కేరళ డప్పు నృత్యాలు.. కోలాటాల కోలాహలం.. విజయవాడ వీధుల నిండా జనం. నామినేషన్ కార్యక్రమమే విజయయాత్ర తరహాలో.. గెలుపే లక్ష్యంగా.. పసుపు తెలుపు జెండాలు.. కమలనాథుల కాషాయం.. కలగలసి రంగుల హరివిల్లులా శోభాయాత్ర మాదిరి అట్టహాసంగా ఎన్డీఏ కూటమి బలపర్చిన తెదేపా విజయవాడ పార్లమెంటు అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని) శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. -
కూటమి కోలాహలం.. నగరం పసుపుమయం
[ 20-04-2024]
ఎన్టీయే కూటమి అభ్యర్థిగా కేశినేని శివనాథ్ (చిన్ని) నామినేషన్తో విజయవాడ నగరం పసుపు మయంగా మారింది. -
అట్టహాసంగా తెదేపా అభ్యర్థి బోడే నామినేషన్
[ 20-04-2024]
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే ప్రసాద్ శుక్రవారం అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. తెదేపా, జనసేన, భాజపా నేతలు, కార్యకర్తలు, అభిమానలు భారీగా తరలి వచ్చారు. -
బీసీల అభ్యున్నతికి లచ్చన్న కృషి
[ 20-04-2024]
బడుగు, బలహీన వర్గాల కోసం అలుపెరగని పోరాటం చేసిన ఉద్యమకారుడు సర్దార్ గౌతు లచ్చన్న అని మాజీ ఎంపీ, తెదేపా జిల్లా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు అన్నారు. -
నాట్యప్రయోగిక పరీక్షలు
[ 20-04-2024]
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, సిద్ధేంద్రయోగి కూచిపూడి నాట్య కళాపీఠంలో మాస్టర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (ఎంపీఏ) కూచిపూడి నృత్యం రెండు, నాలుగో సెమిష్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. -
ఎన్నికల ఖర్చులపై ప్రత్యేక నిఘా
[ 20-04-2024]
ఎన్నికల ఖర్చులపై ప్రత్యేక నిఘా ఉంచామని.. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని నియోజకవర్గ ఎన్నికల ఖర్చు పరిశీలకుడు వికాస్ చంద్రక రోల్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ప్రాజెక్ట్ వదులుకున్నా.. దీపిక నాకు థ్యాంక్స్ చెప్పాలి: కరీనాకపూర్
-
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్
-
నిరంతరం రాష్ట్రం గురించి ఆలోచించే నేత చంద్రబాబు : పవన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మారిన లోగో రంగు.. వివాదంలో దూరదర్శన్
-
ఆ ముగ్గురిని చూస్తే ముచ్చటేసింది.. రోహిత్ ఈజ్ బ్యాక్: హర్భజన్