విద్యుత్తు ఇవ్వరు.. మోటారు అమర్చరు!
వైకాపా ప్రభుత్వం అమలు చేస్తున్న జలకళ పథకం రైతులకు అందకుండా పోయింది. మెట్ట ప్రాంత సాగు భూములకు నీరందించేందుకంటూ ఉద్దేశించిన ఈ పథకం ఆర్భాటపు తంతుగా మిగిలింది.
రైతులకు దూరమైన జలకళ
హనుమాన్జంక్షన్, న్యూస్టుడే
అంపాపురంలో నిరుపయోగంగా బోరు
వైకాపా ప్రభుత్వం అమలు చేస్తున్న జలకళ పథకం రైతులకు అందకుండా పోయింది. మెట్ట ప్రాంత సాగు భూములకు నీరందించేందుకంటూ ఉద్దేశించిన ఈ పథకం ఆర్భాటపు తంతుగా మిగిలింది. ఇందులో భాగంగా రెండున్నరేళ్ల కిందటే బోర్ల నిర్మాణానికి కార్యాచరణ చేపట్టారు. గ్రామాల వారీగా అర్హులైన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, పరిపాలనాపరమైన అనుమతులు జారీ చేశారు. కానీ ఏ మండలంలో కూడా అనుకున్న లక్ష్యం మేరకు బోర్లు తవ్వలేదు సరికదా, తవ్విన బోర్లలో మూడొంతులకు నేటికీ విద్యుత్తు సరఫరా ఇవ్వలేదు.
నెరవేరని లక్ష్యం
మెట్ట ప్రాంతంలో కనిష్ఠంగా రెండున్నర, గరిష్ఠంగా అయిదు ఎకరాల పొలం ఉండి, ఇప్పటి వరకు ఆ భూముల్లో ఎలాంటి వ్యవసాయ బోరు లేని రైతులు జలకళ పథకానికి అర్హులుగా నిర్ణయించారు. గ్రామ సచివాలయంలో తగిన ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకుంటే, క్షేత్ర పరిశీలన, భూగర్భ జల నిపుణుల సర్వే అనంతరం డ్వామా ఆధ్వర్యంలో అనుమతులు మంజూరు చేసి, ఆ తర్వాత ఎంపిక చేసిన గుత్తేదారు ద్వారా బోరు డ్రిల్లింగ్ చేయించి, తదుపరి విద్యుత్తు, మోటారు సౌకర్యం కల్పిస్తామనేది ప్రభుత్వం చెప్పిన మాట. కానీ కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల పరిధిలో ఇప్పటి వరకు 1,545 బోర్లు తవ్వగా, వాటిల్లో పది శాతం బోర్లకు కూడా విద్యుత్తు సౌకర్యం ఇవ్వలేదు.
ఖర్చు పెట్టుకున్నా లేదంట..
బోరు వేయడంతో పాటు దానికి విద్యుత్తు సౌకర్యం కల్పించే బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంటుందని మొదట్లో ప్రకటించారు. ఆ తర్వాత రూ.రెండు లక్షలకు లోపుగా ఖర్చయ్యే వాటికి మాత్రమే ప్రభుత్వం నిధులిస్తుందని, అంచనాలు దాటితే ఆ మొత్తం లబ్ధిదారే భరించాలనే ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఖర్చు భారమైనా, అవసరం కాబట్టి పెట్టుకుందామని రైతులు ముందుకు వచ్చారు. కానీ ఆ మాటలు మౌఖికంగానే చెప్పారని, ఉత్తర్వుల రూపంలో రాలేదంటూ సీపీడీసీఎల్ అధికారులు చెప్పడంతో రైతులు డీలా పడ్డారు. ఆ తర్వాత విద్యుత్తు ఖర్చు మొత్తం లబ్ధిదారులే భరించుకోవాలని ఆదేశాలు వచ్చాయనే ప్రచారం జరిగింది. రైతులు దీనికి కూడా సిద్ధపడినా, సరైన మార్గదర్శకాలు లేకపోవడం, వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే సైట్ని మూసివేయడంతో మరోసారి లబ్ధిదారులకు మొండి చెయ్యే మిగిలింది.
బోర్లు తవ్విన వారు 30 శాతం లోపే..
ఈ పథకానికి రెండు జిల్లాల పరిధిలో వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ వీటిల్లో ఇప్పటి వరకు బోర్లు తవ్విన వారి సంఖ్య 30 శాతానికి లోపుగానే ఉండటం గమనార్హం. బోర్లు తవ్వేందుకు ఎంపిక చేసిన గుత్తేదారులకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో పాటు, వేసిన బోర్లకు విద్యుత్తు, మోటార్లు సమకూర్చడానికి అవసరమైన నిధులు కేటాయించకపోవడమే జాప్యానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.
ఇదీ పరిస్థితి..
* బాపులపాడు మండలం అంపాపురంలో ఓ మహిళా రైతు పొలంలో ఏడాదిన్నర కిందట బోరు వేశారు. ఇప్పటి వరకు విద్యుత్తు కనెక్షను ఇవ్వలేదు.
* ఇదే గ్రామానికి చెందిన మరొక రైతు పొలంలో గతేడాది ఆరంభంలోనే బోరు చేశారు. ఆ తర్వాత విద్యుత్తు సౌకర్యం కూడా కల్పించారు. కానీ ఇప్పటి వరకు మోటారు అమర్చకపోవడంతో పొలం వరకు వచ్చిన నీరు పంటకు చేరే పరిస్థితి లేకుండా పోయింది.
* ఎవరిని అడగాలో తెలియదు: దరఖాస్తు చేసిన వారికి బోరు ఎప్పుడిస్తారు? విద్యుత్తు ఎప్పుడిస్తారు? మోటారు ఎప్పుడు అమర్చుతారనే విషయం తెల్సుకోవడం లబ్ధిదార్లకు ప్రహసనంగా మారింది. గ్రామ, మండల స్థాయిలో అధికారులు ఆన్లైన్ ప్రకారం కార్యాచరణ మొదలవుతుందని మినహా ఎలాంటి వివరాలు చెప్పరు. విద్యుత్తు గురించి సీపీడీసీఎల్ అధికారుల్ని సంప్రదిస్తే పంచాయతీరాజ్ శాఖ నుంచి తమకు వివరాలు, ఆదేశాలు వస్తేనే అవసరమైన పనులు చేపట్టగలమనే బదులు మాత్రమే వినిపిస్తోంది. దీంతో లబ్ధిదారులు నిస్సహాయులుగా ఉండిపోవాల్సి వస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గులకరాయికి.. రాజకీయ రంగు!
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్పై గులకరాయి కేసు.. కుట్ర కేసుగా మారుతోంది. రాజకీయ రంగు పులుముకునేందుకు రంగం సిద్ధమైంది. తెదేపా నేతలు అనుమానించినట్లే.. మరికొందరు కీలక నేతలను ఇరికించేందుకు ఖాళీ వదిలినట్లు తెలిసింది. -
తెచ్చిపెట్టేది లేదు... తరిమికొట్టుడే..!
[ 19-04-2024]
‘గత ఐదేళ్ల జగన్ పాలనలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఒక్క పరిశ్రమ కూడా నెలకొల్పింది లేదు. కానీ.. గత చంద్రబాబు సర్కారు ఎన్నో ఇబ్బందులు పడి, పారిశ్రామికవేత్తలను ఒప్పించి, రాయితీలు ఇచ్చి ఇక్కడ పెట్టించిన పరిశ్రమలను మూతపడేలా చేయడంలో వైకాపా సర్కారు విజయవంతమైంది. -
అభివృద్ధి పరుగులు పెట్టిస్తా: సుజనా
[ 19-04-2024]
విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ప్రధాని మోదీ, చంద్రబాబు సహకారంతో అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తానని భాజపా పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు. గురువారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. -
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: బాలశౌరి
[ 19-04-2024]
వైకాపా అరాచక పాలన నుంచి విముక్తి పొందేందుకు తెదేపా, జనసేన కూటమి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కూటమి బందరు ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి పిలుపునిచ్చారు. -
ఒడిసిపడతానని.. విడిచిపెడతావేం?
[ 19-04-2024]
సీఎం జగన్ మాటలకు అర్థాలే వేరు. ఆయన చెప్పారంటే... అసలు చేయరని అర్థం. దీనికి సజీవ సాక్ష్యం కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీకి దిగువన ప్రతిపాదించిన రెండు బ్యారేజీల నిర్మాణం. కృష్ణా, గుంటూరు జిల్లాలకు ప్రాణావసరమైన వీటి గురించి జగన్ సర్కారు ఏమాత్రం పట్టించుకోలేదు. -
నాలుగో సింహం నలిగిపోతోంది
[ 19-04-2024]
వారాంతపు సెలవులు లేక పోలీసులు తీవ్ర ఇబ్బందుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. రోజూ ఒత్తిడితో పని చేయాల్సి వస్తోంది. ఈ విధంగా ఉద్యోగం చేయడం కష్టంగా ఉందని పోలీసు ఉద్యోగుల సంఘం తరఫున ఉన్నతాధికారులను, ప్రజా ప్రతినిధులను వేడుకున్నారు. -
తెదేపా అభ్యర్థుల నామ పత్రాల దాఖలు
[ 19-04-2024]
గన్నవరం నియోజకవర్గంలో జనసేన, భాజపా మద్దతుతో తెదేపా బలపర్చిన ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గురువారం ఉదయం 11.15 గంటలకు తొలి విడత నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి జేసీ గీతాంజలిశర్మకు సమర్పించారు. -
లారీ ఢీకొని ప్రసాదంపాడు వాసి దుర్మరణం
[ 19-04-2024]
చంద్రుగొండ మండలం అయ్యన్నపాలెం ఒడ్డు వద్ద గల మలుపు సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన శ్రీకృష్ణచక్రపాణి(61) మృతి చెందారు. -
బావిలో పడిన యువకుడు
[ 19-04-2024]
బాపులపాడు మండలం బొమ్ములూరులో ఓ యువకుడు బావిలో పడిన ఘటన గురువారం రాత్రి కలకలం రేపింది. ఇదే గ్రామానికి చెందిన పవన్ స్థానిక విద్యుత్తు ఉపకేంద్రం సమీపంలో ఉన్న పొలంలోని బావిలో పడిపోయాడు. -
చెత్తకు నిప్పు.. గ్యాస్ పైప్లైన్కు మంటలు
[ 19-04-2024]
ముదినేపల్లి ప్రధాన రహదారిలో చెత్త కాలుస్తుండగా..గ్యాస్ పైప్లైన్ లుకింగ్ పాయింట్కు అంటుకొని భీతావహ పరిస్థితి ఏర్పడింది. వెంటనే స్పందించిన అగ్నిమాపకశాఖ అధికారులు మంటల్ని అదుపు చేశారు. -
ప్రోత్సాహం అన్నావు.. సాయం మరిచావు
[ 19-04-2024]
బందరు బంగారంగా ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన రోల్డ్గోల్డ్ పరిశ్రమ ప్రస్తుతం అనేక ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. -
ఆ భోజనం మా కొద్దు
[ 19-04-2024]
మధ్యాహ్నభోజన మెనూ మార్చాం...పోషకాలతో కూడిన భోజనం అందిస్తున్నాం అని ముఖ్యమంత్రి జగన్ గొప్పలు చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. -
ఇన్నాళ్లూ.. కాలయాపన
[ 19-04-2024]
పేరుకే అది వంద పడకల ఆసుపత్రి.. వైద్యం మాత్రం ‘ప్రాథమిక’ స్థాయిలోనే అందుతోంది. వైద్యశాలను ఉన్నతంగా తీర్చిదిద్దామని ఎమ్మెల్యే సోదరులు ప్రజలను మభ్యపెడుతున్నారు. స్థాయి పెంపు కాగితాలకే పరిమితమైంది. -
నాడు కళకళ.. నేడు వెలవెల
[ 19-04-2024]
వైకాపా పాలనలో పారిశ్రామికవాడలు పూర్తిగా చతికిల పడ్డాయి. గుడివాడ ఆటోనగర్ ఒకప్పుడు దేశవ్యాప్తంగా వ్యవసాయ పరికరాలకు ప్రఖ్యాతి. కర్నాటక, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు ఇక్కడి నుంచి కల్టివేటర్లు, వీల్స్, నూర్పిడి యంత్రాలు సరఫరా అయ్యాయి. -
సుద్దగా అన్నం.. అందుకే తినం
[ 19-04-2024]
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చాలా మంది విద్యార్థులకు రుచించడం లేదు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మెనూ అమలు చేస్తున్నప్పటికీ ఆహార పదార్థాలు రుచి, శుచి ఉండడం లేదని పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చెబుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?