సమస్యల నివేదన.. నిధుల ప్రకటన
తిరువూరులో ఆదివారం జగనన్న విద్యాదీవెన పథకం నిధుల విడుదల సభకు హాజరైన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నియోజకవర్గానికి వరాలు ప్రకటించారు.
కట్లేరు వాగుపై వంతెన నిర్మాణానికి రూ.26 కోట్లు
నియోజకవర్గానికి మరో ఆరు వేల ఇళ్ల మంజూరు
తిరువూరు సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి
జగనన్న విద్యా దీవెన చెక్కును విద్యార్థులకు అందజేస్తున్న సీఎం జగన్. చిత్రంలో మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యేలు మేకా వెంకట ప్రతాప అప్పారావు, సామినేని ఉదయభాను, కలెక్టర్ డిల్లీరావు తదితరులు
తిరువూరు, న్యూస్టుడే: తిరువూరులో ఆదివారం జగనన్న విద్యాదీవెన పథకం నిధుల విడుదల సభకు హాజరైన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నియోజకవర్గానికి వరాలు ప్రకటించారు. సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రధానంగా నెలకొన్న సమస్యల్లో ఏడింటిని సీఎం జగన్ దృష్టికి తీసుకు వచ్చారు. అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని చేసిన విజ్ఞప్తికి సీఎం స్పందించారు. వినగడప వద్ద కట్లేరు వాగుపై వంతెన నిర్మాణానికి రూ.26 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎ.కొండూరు మండలంలో అత్యధికంగా ఉన్న కిడ్నీ బాధితులకు తమ ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు చేశామని, కృష్ణా జలాలు అందించే పథకం నిర్మాణానికి రూ.50 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. తిరువూరు నియోజకవర్గంలో 8 వేల పైచిలుకు నివేశన స్థలాలు పంపిణీ చేశామని, ఇప్పటికే మంజూరు చేసిన 4 వేల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని, ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు మరో 6 వేల ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ రహదారుల అభివృద్ధికి రూ.10 కోట్లు, తిరువూరు పట్టణంలో డ్రెయిన్ల నిర్మాణానికి రూ.4 కోట్లు మంజూరు చేస్తున్నానని ప్రకటించారు. పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేయాలని కోరగా, ఐఐటీ, పాలిటెక్నిక్ కళాశాల, బడిమానేసిన పిల్లల కోసం వివిధ కోర్సులతో కూడిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ త్వరలో తిరువూరు వస్తుందని ప్రకటించిన సీఎం జగన్ తన ప్రసంగం ముగించారు.
సీఎం సభ వద్ద దళిత ప్రజాప్రతినిధికి అవమానం
సీఎం పర్యటన సందర్భంగా అధికారపార్టీకి చెందిన దళిత మహిళా ప్రజాప్రతినిధికి అవమానం జరిగింది. ముఖ్యమంత్రి రావడానికి ముందు ఎంపీపీ జి.భారతితో కలిసి సభావేదికపైకి వెళ్తున్న పురపాలక సంఘం ఛైర్పర్సన్ గత్తం కస్తూరిబాయిని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. తాను మున్సిపల్ ఛైర్పర్సన్నని చెప్పినప్పటికీ అధికారులు ఇచ్చిన జాబితాలో మీ పేరు లేదంటూ వేదిక పైకి వెళ్లేందుకు అనుమతించలేదు. సీఎం వస్తున్నారు...పక్కకు వెళ్లాలంటూ భద్రతా సిబ్బంది దురుసుగా ప్రవర్తించడంతో ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. వేదిక వద్ద ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న వైకాపా నాయకుడు కలకొండ రజనీకాంత్ తన వద్ద ఉన్న జాబితాను భద్రతా సిబ్బందికి చూపించడంతో అనుమతించారు. ఇది గమనించిన మంత్రి బొత్స సత్యనారాయణ ఆమెను సముదాయించారు. పురపాలక సంఘం పరిధిలో జరుగుతున్న కార్యక్రమంలో ప్రథమ పౌరురాలైన తన పేరు లేకపోవడం పట్ల ఆమె మంత్రి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఆమె చెప్పగా, కార్యక్రమం పూర్తయిన తరువాత బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటానని ఆయన సర్ది చెప్పడంతో శాంతించారు. ప్రొటోకాల్ పాటించకుండా తనను అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్, పురపాలక శాఖ ఉన్నతాధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.
చంటి బిడ్డకు సాయం కోసం వస్తే పోలీసులు అడ్డుకున్నారు
మెదడువాపు వ్యాధితో బాధపడుతున్న తమ కుమార్తె చికిత్సకు అవసరమైన సాయం కోరేందుకు సీఎం జగన్ను కలవాలని వచ్చిన తనను పోలీసులు అడ్డుకున్నారని ఎ.కొండూరు మండలం చీమలపాడుకు చెందిన కల్యాణి ఆవేదన వ్యక్తం చేశారు. హెలిప్యాడ్ వద్ద సీఎంను కలిసేందుకు వెళ్లగా అనుమతించ లేదని, సభావేదిక వద్దకు వెళ్లాలని చెప్పారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తన కుమార్తె భవ్య చికిత్స నిమిత్తం 10 నెలల్లో రూ.19 లక్షలు ఖర్చు చేశామని, అయినా కోలుకోలేదని వాపోయారు. సీఎంను కలిసి ఆర్థిక సాయం అడిగేందుకు వస్తే పోలీసులు తమను ఎక్కడికక్కడ నిలువరించారని కన్నీటి పర్యంతమైంది. హెలిప్యాడ్ నుంచి మండుటెండలో కుమార్తెను తీసుకుని సభావేదిక వద్దకు వచ్చిన ఆమెకు నిరాశే మిగిలింది.
నిర్బంధాలు... ఆంక్షలు
ఎండ వేడి తట్టుకోలేక సభ వద్ద సొమ్మసిల్లి పడిపోయిన ఓ మహిళను
తీసుకెళ్తున్న అంబులెన్సు జనం మధ్య ఇరుక్కుపోయిందిలా...
తిరువూరు, న్యూస్టుడే: సీఎం జగన్మోహన్రెడ్డి ఆదివారం తిరువూరులో పర్యటించారు. జగనన్న విద్యా దీవెన నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంతోపాటు పరిసర మండలాల్లోని ప్రతిపక్ష పార్టీల నాయకులను పోలీసులు నిర్బంధించారు. దీంతోపాటు ట్రాఫిక్ మళ్లించడంతో ప్రజలు అవస్థలు పాలయ్యారు.
ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో లక్ష్మీపురం నుంచి వెనుదిరిగి వెళ్తున్న ద్విచక్ర వాహన చోదకులు
ఎ.కొండూరు పోలీసులు అదుపులోకి తీసుకున్న తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి వాసం మునియ్యకు స్టేషన్ వద్ద సంఘీభావం తెలుపుతున్న నాయకులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయవాడ తూర్పులో వైకాపాకు షాక్.. తెదేపా గూటికి ఎంవీఆర్ చౌదరి
[ 23-04-2024]
తూర్పు నియోజకవర్గంలో వైకాపాకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు వైకాపా నాయకులు -
పేరుకే ఆర్టీసీ గ్రూప్.. అంతా వైకాపా భజనే
[ 23-04-2024]
తాను ఆర్టీసీ జోనల్ ఛైర్పర్సన్గా ఉన్న సమయంలో ఆర్టీసీ అధికారులు, యూనియన్ నాయకులతో ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్లో వైకాపా నాయకురాలు తాతినేని పద్మావతి పార్టీకి సంబంధించిన వీడియోలు, చిత్రాలు, కార్యక్రమాలను పోస్టు చేస్తున్నారు. -
గెలుపు వాకిట పసుపు తోరణం
[ 23-04-2024]
ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు మయం.. తెలుపు, కాషాయం జెండాలతో రంగుల హరివిల్లు..! నినాదాలతో హోరెత్తిన నియోజకవర్గాలు.. జై చంద్రబాబు, పవన్ కల్యాణ్, మోదీ అని దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు. -
పదిలో.. మళ్లీ పదకొండే
[ 23-04-2024]
పదోతరగతి ఫలితాల్లో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కృష్ణా మళ్లీ 11వ స్థానానికే పరిమితమైంది. కృష్ణాలో గతేడాది కంటే ఉత్తీర్ణత శాతం మెరుగైనా.. -
రూ.3వేలు పెంచి.. సంక్షేమం రద్దు చేసి
[ 23-04-2024]
ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో తీసుకుంటే దాన్ని మోసం అంటాము. కానీ సీఎం జగన్ దాన్ని సాయం అని చెప్పుకుంటూ ఊదరగొడుతున్నారు. -
బుద్ధప్రసాద్ నామపత్రం దాఖలు
[ 23-04-2024]
అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. -
‘కూటమి’ కోసం కదలిన కోలవెన్ను
[ 23-04-2024]
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే ప్రసాద్, బందరు జనసేన ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరికి మద్దతుగా రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్, తెదేపా నాయకుడు తుమ్మల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి -
ఫోర్జరీ సంతకాలతో డబ్బులు డ్రా
[ 23-04-2024]
-
జీతాలు అందక.. జీవనం గడవక
[ 23-04-2024]
ఒప్పంద/పొరుగు సేవల విధానంలో పని చేస్తున్న ఉద్యోగుల పట్ల వైకాపా ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. పొరుగు సేవల ఉద్యోగులు, పలువురు ఒప్పంద ఉద్యోగులకు ప్రతి నెలా సక్రమంగా జీతాలు అందని పరిస్థితి ఏర్పడింది. -
పదిలో అద్భుత ప్రతిభ
[ 23-04-2024]
విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్టుడే: ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రతిభతో మెరిశారు. -
వెలంపల్లీ..హామీ..చేసిందేమీ..
[ 23-04-2024]
భవానీపురం పరిధిలో సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు చెప్పిన మాటలు నీటి మూటలుగానే మిగిలాయి. -
‘అరాచక పాలకులను సాగనంపాలి’
[ 23-04-2024]
అరాచక పాలకులను ప్రజలు సాగనంపాలని ఎన్డీయే విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. -
పేదింట విరిసిన విద్యాకుసుమాలు
[ 23-04-2024]
తల్లిదండ్రుల పేదరికం చిన్నారుల ప్రతిభకు ఆటంకం కాదు అని దళవాయి సుబ్బరామయ్య మున్సిపల్ హైస్కూల్ పదో తరగతి విద్యార్థినులు నిరూపించారు. సోమవారం వెల్లడైన ఫలితాల్లో మంచి ప్రతిభ చటారు. -
నన్ను చంపేందుకు వైకాపా నేతల కుట్ర
[ 23-04-2024]
వైకాపా నేతలు తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని తిరువూరు తెదేపా అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఆరోపించారు. సోమవారం నామినేషన్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. -
28 మంది అభ్యర్థులు... 31 నామపత్రాలు
[ 23-04-2024]
మచిలీపట్నం పార్లమెంట్ స్థానంతో పాటు జిల్లాలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సోమవారం 28 మంది అభ్యర్థులు నామపత్రాలు అందజేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM