న్యాయం కోసం వెళ్లిన న్యాయవాదిపై అక్రమ కేసు
న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వెళ్లిన న్యాయవాదిపైన విజయవాడ భవానీపురం పోలీసులు అక్రమ కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ బెజవాడ బార్ అసోసియేషన్(బీబీఏ) సభ్యులు సోమవారం విధులకు గైర్హాజరయ్యారు.
విజయవాడలో రోడ్డెక్కి ఆందోళన
నినాదాలు చేస్తున్న న్యాయవాదులు, చిత్రంలో బీబీఏ ప్రధాన కార్యదర్శి గంధం శ్రీనివాస్ తదితరులు
విజయవాడ న్యాయవిభాగం, న్యూస్టుడే : న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వెళ్లిన న్యాయవాదిపైన విజయవాడ భవానీపురం పోలీసులు అక్రమ కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ బెజవాడ బార్ అసోసియేషన్(బీబీఏ) సభ్యులు సోమవారం విధులకు గైర్హాజరయ్యారు. ప్రదర్శనలు నిర్వహించి, రోడ్డుపై బైఠాయించి ఆందోళనలు చేశారు. భవానీపురానికి చెందిన ఓ న్యాయవాది కుమార్తె(10) స్థానికంగా ఉన్న పార్క్లో ఆడుకుంటుండగా.. ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో న్యాయవాది రాత్రి 10 గంటల సమయంలో భవానీపురం పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. ఆయన్ని పోలీసులు రాత్రి 11.00 గంటలకు వరకు కూర్చోబెట్టి, ఎఫ్.ఐ.ఆర్ కట్టకుండా దిశ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈలోపు నిందితుడు రాత్రి 11.00 గంటల తర్వాత పోలీస్ స్టేషన్కు వచ్చి సదరు న్యాయవాదిపై తప్పుడు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు విచారించకుండానే న్యాయవాదిపై కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని న్యాయవాది, బీబీఏ కార్యవర్గ సభ్యులకు చెప్పగా.. వారు పోలీస్ కమిషనర్కు ఫోన్లో తెలిపారు. దీనిపై తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చి, ఆ మాట నిలబెట్టుకోకపోవడంతో న్యాయవాదులు బీబీఏ హాలులో సోమవారం ఉదయం సమావేశమయ్యారు. భవానీపురం సీఐ ఉమర్, ఏఎస్ఐ గంగాధర్లను తక్షణమే సస్పెండ్ చేయాలని, బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. న్యాయస్థానాల ప్రాంగణం నుంచి ర్యాలీగా అయిదో నెంబరు రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఒక్కసారిగా వందల సంఖ్యలో న్యాయవాదులు రోడ్డుపైకి రావడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. దాదాపు ఐదు గంటల పాటు న్యాయవాదులు ఆందోళన చేపట్టారు.
సీఐపై చర్యలకు పోలీస్ కమిషనర్ హామీ.. నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటాను సోమవారం కలవగా.. భవానీపురం సీఐపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని బీబీఏ ప్రధాన కార్యదర్శి గంధం శ్రీనివాస్ తెలిపారు. న్యాయవాదిపై పెట్టిన కేసు తీసివేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. పోలీసులపై చర్యలు తీసుకునే వరకు న్యాయవాదులు తమ విధులకు గైర్హాజరై.. ఆందోళనలు కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు.
కేసు అమానుషం.. బాధితుడైన న్యాయవాదిపై కేసు నమోదు అమానుషమని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయార్స్(ఐఏఎల్) జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు చలసాని అజయ్కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
సెలవుపై భవానీపురం సీఐ?
ఈనాడు, అమరావతి: భవానీపురం సీఐ ఉమర్ సెలవుపై వెళ్లినట్లు తెలిసింది. న్యాయవాదుల ఆందోళన నేపథ్యంలో విషయం పెద్దది కాకుండా ఉండేందుకు సీఐను సెలవుపై పంపించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో స్టేషన్లో జరుగుతున్న వ్యవహారాలు, సీఐ గురించి రహస్యంగా విచారణ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. సున్నితమైన అంశం పెద్దది కాకుండా చూడడంలో వైఫల్యం చెందినట్లు అంచనా వేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయవాడ తూర్పులో వైకాపాకు షాక్.. తెదేపా గూటికి ఎంవీఆర్ చౌదరి
[ 23-04-2024]
తూర్పు నియోజకవర్గంలో వైకాపాకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు వైకాపా నాయకులు -
పేరుకే ఆర్టీసీ గ్రూప్.. అంతా వైకాపా భజనే
[ 23-04-2024]
తాను ఆర్టీసీ జోనల్ ఛైర్పర్సన్గా ఉన్న సమయంలో ఆర్టీసీ అధికారులు, యూనియన్ నాయకులతో ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్లో వైకాపా నాయకురాలు తాతినేని పద్మావతి పార్టీకి సంబంధించిన వీడియోలు, చిత్రాలు, కార్యక్రమాలను పోస్టు చేస్తున్నారు. -
గెలుపు వాకిట పసుపు తోరణం
[ 23-04-2024]
ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు మయం.. తెలుపు, కాషాయం జెండాలతో రంగుల హరివిల్లు..! నినాదాలతో హోరెత్తిన నియోజకవర్గాలు.. జై చంద్రబాబు, పవన్ కల్యాణ్, మోదీ అని దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు. -
పదిలో.. మళ్లీ పదకొండే
[ 23-04-2024]
పదోతరగతి ఫలితాల్లో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కృష్ణా మళ్లీ 11వ స్థానానికే పరిమితమైంది. కృష్ణాలో గతేడాది కంటే ఉత్తీర్ణత శాతం మెరుగైనా.. -
రూ.3వేలు పెంచి.. సంక్షేమం రద్దు చేసి
[ 23-04-2024]
ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో తీసుకుంటే దాన్ని మోసం అంటాము. కానీ సీఎం జగన్ దాన్ని సాయం అని చెప్పుకుంటూ ఊదరగొడుతున్నారు. -
బుద్ధప్రసాద్ నామపత్రం దాఖలు
[ 23-04-2024]
అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. -
‘కూటమి’ కోసం కదలిన కోలవెన్ను
[ 23-04-2024]
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే ప్రసాద్, బందరు జనసేన ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరికి మద్దతుగా రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్, తెదేపా నాయకుడు తుమ్మల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి -
ఫోర్జరీ సంతకాలతో డబ్బులు డ్రా
[ 23-04-2024]
-
జీతాలు అందక.. జీవనం గడవక
[ 23-04-2024]
ఒప్పంద/పొరుగు సేవల విధానంలో పని చేస్తున్న ఉద్యోగుల పట్ల వైకాపా ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. పొరుగు సేవల ఉద్యోగులు, పలువురు ఒప్పంద ఉద్యోగులకు ప్రతి నెలా సక్రమంగా జీతాలు అందని పరిస్థితి ఏర్పడింది. -
పదిలో అద్భుత ప్రతిభ
[ 23-04-2024]
విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్టుడే: ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రతిభతో మెరిశారు. -
వెలంపల్లీ..హామీ..చేసిందేమీ..
[ 23-04-2024]
భవానీపురం పరిధిలో సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు చెప్పిన మాటలు నీటి మూటలుగానే మిగిలాయి. -
‘అరాచక పాలకులను సాగనంపాలి’
[ 23-04-2024]
అరాచక పాలకులను ప్రజలు సాగనంపాలని ఎన్డీయే విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. -
పేదింట విరిసిన విద్యాకుసుమాలు
[ 23-04-2024]
తల్లిదండ్రుల పేదరికం చిన్నారుల ప్రతిభకు ఆటంకం కాదు అని దళవాయి సుబ్బరామయ్య మున్సిపల్ హైస్కూల్ పదో తరగతి విద్యార్థినులు నిరూపించారు. సోమవారం వెల్లడైన ఫలితాల్లో మంచి ప్రతిభ చటారు. -
నన్ను చంపేందుకు వైకాపా నేతల కుట్ర
[ 23-04-2024]
వైకాపా నేతలు తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని తిరువూరు తెదేపా అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఆరోపించారు. సోమవారం నామినేషన్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. -
28 మంది అభ్యర్థులు... 31 నామపత్రాలు
[ 23-04-2024]
మచిలీపట్నం పార్లమెంట్ స్థానంతో పాటు జిల్లాలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సోమవారం 28 మంది అభ్యర్థులు నామపత్రాలు అందజేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM