జగనన్నా.. కాలనీలోకి వెళ్లేదెలా..?
తుపాను కారణంగా కురిసిన వర్షాలకు అవనగడ్డ నియోజకవర్గంలోని అతి పెద్ద జగనన్న కాలనీ (ఎడ్లంక రహదారిలో) రహదారులు బురదమయంగా తయారయ్యాయి. దీంతో కాలనీ లోపలకు వెళ్లడానికి దారిలేని పరిస్థితి ఏర్పడింది.
బురదతో లబ్దిదారుల అవస్థలు
న్యూస్టుడే, అవనిగడ్డ
తుపాను కారణంగా కురిసిన వర్షాలకు అవనగడ్డ నియోజకవర్గంలోని అతి పెద్ద జగనన్న కాలనీ (ఎడ్లంక రహదారిలో) రహదారులు బురదమయంగా తయారయ్యాయి. దీంతో కాలనీ లోపలకు వెళ్లడానికి దారిలేని పరిస్థితి ఏర్పడింది. ఇసుక, కంకర, ఇనుము, సిమెంటుతో పాటు బోర్లు వేయడానికి, సెంట్రింగ్ సామగ్రి తరలింపు, కాంక్రీట్ మిక్చర్ వంటి యంత్రాలు లోపలకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. బేస్మెంట్ వరకు వచ్చిన నిర్మాణాల్లో పోయడానికి మట్టి, బుసక లేకపోవడంతో లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. బుసక ఉచితంగా ఇవ్వాలని కోరుతున్నారు. టిప్పర్ బుసక రూ.12 వేలు చొప్పున కనీసం 4 టిప్పర్లు బుసక తోలి నింపాల్సి ఉంటుందని తాపీ పనివారు చెబుతున్నారు. ఇప్పటికే నిర్మాణ వ్యయం పెరిగిపోవడంతో కాలనీలో గృహం పూర్తికావాలంటే రూ.7.5 లక్షలకుపైగా వెచ్చించాల్సి వస్తోందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాపీ పని వారికి రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షలు చెల్లించాల్సివస్తోందని.. తక్కువ ఖర్చుతో నిర్మాణాలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పలు కాలనీల్లో బోరింగ్ పంపులు, ఇనుము, ఇటుకలు, నీటి డ్రమ్ములు దొంగిలిస్తున్నారని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారులు అభివృద్ధి చేయాలని, కంకరపోసి, వాహనాలు కూరుకుపోకుండా చేయాలని కోరుతున్నారు. ఇప్పటి వరకు కాలనీలో అన్ని గృహాలకు కుళాయిలు ఏర్పాటు చేయలేదని, విద్యుత్తు వసతి కల్పించలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణాలు వెంటనే ప్రారంభించాలని, లేకపోతే పట్టాలు రద్దు చేస్తామని చెప్పిన అధికారులు వసతుల కల్పన విషయంలో మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శిస్తున్నారు. అధికారులు స్పందించి వసతులు కల్పించాలని కోరుతున్నారు.
అంతర్గత రోడ్ల దుస్థితి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
[ 29-03-2024]
పెండింగ్లో ఉన్న 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను తెదేపా ప్రకటించింది. -
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
[ 29-03-2024]
రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదు.. ప్రజలకు సేవచేయడమని ఎన్టీఆర్ నిరూపించారని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు, నేతలకు ఎక్స్(ట్విటర్) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. -
మీకో దండం.. మీతో ఉండం
[ 29-03-2024]
మచిలీపట్నం నగరపాలిక పరిధిలో 12 మంది వాలంటీర్లు ఈ నెలలోనే తమ రాజీనామాలను కమిషనర్కు సమర్పించారు. 39వ వార్డులో ఆరుగురు, 20వ వార్డులో నలుగురు, 7, 47వ వార్డుల్లో ఒక్కొక్కరు చొప్పున వైదొలగారు. -
అంతా అన్నారు.. కొంతే కొన్నారు!
[ 29-03-2024]
దివిసీమలో ఖరీఫ్ ఆలస్యంగా సాగు చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే కోతలు కోస్తున్నారు. నూర్పిళ్లు చేస్తున్నారు. -
ఆత్మీయ అతిథికి అపూర్వ స్వాగతం
[ 29-03-2024]
సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ గురువారం కృష్ణా జిల్లాలో పర్యటించారు. -
తమ్ముళ్లూ.. మీరే మా బలం
[ 29-03-2024]
పోరాట పటిమ చూపి రానున్న ఎన్నికల్లో తెదేపా విజయానికి కృషి చేయాలని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. -
‘తుస్సుమన్న జగన్ బస్సు యాత్ర’
[ 29-03-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర తుస్సుమందని.. డబ్బులిచ్చినా, బిర్యానీలు పెట్టినా ఎవరూ రావడం లేదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. -
దూసుకొస్తున్నాయ్.. జాగ్రత్తమ్మా!
[ 29-03-2024]
రెప్పపాటులో దూసుకొచ్చే వాహనాలు.. ఆదమరచి రోడ్డుపైనే ఆడుకునే చిన్నారులు.. రోడ్డు దాటాలా వద్దా అని తటపటాయించి ఒక్కసారిగా పరిగెత్తే విద్యార్థులు.. -
వైకాపా నేతల కనుసన్నల్లో.. అర్ధరాత్రి ఇసుక అక్రమ తవ్వకాలు
[ 29-03-2024]
అనుమతులు లేని తవ్వకాలపై ప్రజలు ఆందోళనకు దిగినా.. జాతీయ హరిత ట్రైబ్యునల్కు ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకునే నాథుడే లేరు. -
అంతర జిల్లా ద్విచక్ర వాహనాల దొంగ అరెస్టు
[ 29-03-2024]
జల్సాలకు అలవాటుపడి వివిధ జిల్లాల్లో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతూ వాటిని విక్రయిస్తున్న దొంగను పట్టుకొని 37 ద్విచక్ర వాహనాలను తోట్లవల్లూరు పోలీసులు పట్టుకున్నారని కృష్ణా జిల్లా ఎస్పీ నయీం అస్మి తెలిపారు. -
నిశిత తనిఖీలు
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నగదు, మద్యం, గంజాయి తదితరాల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. -
కోడ్ ఉల్లంఘించి.. వైకాపా నేతల వేడుకలు
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా.. వైకాపా నేతల ఉల్లంఘనలు యథేచ్ఛగా సాగుతున్నాయి. -
‘అతడి ఆత్మహత్యాయత్నానికి కారకులెవరు..?’
[ 29-03-2024]
ఓ మనిషి ప్రాణం తీసుకునేలా ప్రేరేపించడం దారుణం. న్యాయం కోసం వస్తే కంచె చేను మేసిన చందంగా రక్షించాల్సిన వారే అతడి ఆత్మహత్యాయత్నానికి కారణం కావడం శోచనీయం. -
ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
[ 29-03-2024]
జిల్లాలోని గంపలగూడెం మండలం పెదకొమిర, రెడ్డిగూడెం మండలం మద్దులపర్వలోని ఆదర్శ పాఠశాలల్లో ప్రథమ ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాళ్లు ఆర్.శైలజ, ఎ.వీరరాజు గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు