లీజు పత్రాలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి
ల్లాలో ప్రభుత్వ ఆస్తులను లీజుకు ఇచ్చే సందర్భాల్లో తప్పనిసరిగా సంబంధిత ఒప్పంద ప్రతాలు రిజిస్ట్రేషన్ చేయించాలని కలెక్టర్ రంజిత్బాషా అధికారులకు స్పష్టం చేశారు.
స్పందనలో కలెక్టర్
కలెక్టరేట్(మచిలీపట్నం), న్యూస్టుడే: జిల్లాలో ప్రభుత్వ ఆస్తులను లీజుకు ఇచ్చే సందర్భాల్లో తప్పనిసరిగా సంబంధిత ఒప్పంద ప్రతాలు రిజిస్ట్రేషన్ చేయించాలని కలెక్టర్ రంజిత్బాషా అధికారులకు స్పష్టం చేశారు. స్పందన కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్లో వివిధ శాఖల జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ షాపింగ్ కాంప్లెక్స్లు, ప్రభుత్వ స్థలాల్లోని చెరువులు, పెట్రోల్ బంకులు, మందుల దుకాణాలు, వంటి వాటితో పాటు టోల్గేట్లకు సంబంధించిన లీజ్ డీడ్లు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించాలని చెప్పారు. ఈ నిబంధన కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ఆధార్ నవీకరణ ప్రక్రియ జూన్ 14 వరకూ ఉచితంగా చేయించుకోవచ్చన్నారు. ఆసరా పథకం మూడో విడత కార్యక్రమాన్ని ఈనెల 25న , పాఠశాలల్లో రాగిజావ అందించే కార్యక్రమాన్ని ఈనెల 21న సీఎం చేతులమీదగా ప్రారంభిస్తారని, అందుకు అనుగుణంగా పాఠశాలల్లో తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. పోషణ్ అభియాన్ పథకం ద్వారా ఏప్రిల్ 4 వరకూ పోషకాహార పక్షోత్సవాల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ ఏడాది అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లా లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్తో పాటు జేసీ అపరాజితసింగ్, డీఆర్వో ఎం.వెంకటేశ్వర్లు, తదితరులు అర్జీలు స్వీకరించారు.
అర్జీలు ఇవీ..
అమెరికాలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ మోసం చేసి రూ.12 లక్షలు తీసుకున్న వారిపై తగు చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరుతూ పోరంకి గ్రామానికి చెందిన సాయి కోటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. కృత్తివెన్ను మండలం ఇంతేరు గ్రామ పరిధిలోని 3,500 ఎకరాలకు పైగా అన్యాక్రాంతంలో ఉన్న గ్రామ పంచాయతీ అటవీ భూములను స్వాధీనం చేసుకోవాలని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ వినతిపత్రం సమర్పించారు. వివిధ వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోరుతూ వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారు ఫిర్యాదు చేశారు.
క్యాజువల్ వేకెన్సీల ఎన్నికలకు సిద్ధం కావాలి
స్థానిక సంస్థల్లో క్యాజువల్ వేకెన్సీల ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ బంగ్లాలో రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. జిల్లాలో ఉయ్యూరు జడ్పీటీసీ, ఉంగుటూరు మండలం తేలప్రోలు ఎంపీటీసీ స్థానాలతో పాటు రెండు సర్పంచి, 32 వార్డు మెంబర్ల ఖాళీల భర్తీకై త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుందన్నారు. డీఆర్వో ఎం.వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈవో శ్రీనివాసరావు, కేఆర్సీసీ డిప్యూటీ కలెక్టర్ శివనారాయణరెడ్డి, డీఎల్పీవో జ్యోతిర్మయి, డీఎల్పీవో కార్యాలయ ఏవో సీతారామయ్య, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీకో దండం.. మీతో ఉండం
[ 29-03-2024]
మచిలీపట్నం నగరపాలిక పరిధిలో 12 మంది వాలంటీర్లు ఈ నెలలోనే తమ రాజీనామాలను కమిషనర్కు సమర్పించారు. 39వ వార్డులో ఆరుగురు, 20వ వార్డులో నలుగురు, 7, 47వ వార్డుల్లో ఒక్కొక్కరు చొప్పున వైదొలగారు. -
అంతా అన్నారు.. కొంతే కొన్నారు!
[ 29-03-2024]
దివిసీమలో ఖరీఫ్ ఆలస్యంగా సాగు చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే కోతలు కోస్తున్నారు. నూర్పిళ్లు చేస్తున్నారు. -
ఆత్మీయ అతిథికి అపూర్వ స్వాగతం
[ 29-03-2024]
సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ గురువారం కృష్ణా జిల్లాలో పర్యటించారు. -
తమ్ముళ్లూ.. మీరే మా బలం
[ 29-03-2024]
పోరాట పటిమ చూపి రానున్న ఎన్నికల్లో తెదేపా విజయానికి కృషి చేయాలని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. -
‘తుస్సుమన్న జగన్ బస్సు యాత్ర’
[ 29-03-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర తుస్సుమందని.. డబ్బులిచ్చినా, బిర్యానీలు పెట్టినా ఎవరూ రావడం లేదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. -
దూసుకొస్తున్నాయ్.. జాగ్రత్తమ్మా!
[ 29-03-2024]
రెప్పపాటులో దూసుకొచ్చే వాహనాలు.. ఆదమరచి రోడ్డుపైనే ఆడుకునే చిన్నారులు.. రోడ్డు దాటాలా వద్దా అని తటపటాయించి ఒక్కసారిగా పరిగెత్తే విద్యార్థులు.. -
వైకాపా నేతల కనుసన్నల్లో.. అర్ధరాత్రి ఇసుక అక్రమ తవ్వకాలు
[ 29-03-2024]
అనుమతులు లేని తవ్వకాలపై ప్రజలు ఆందోళనకు దిగినా.. జాతీయ హరిత ట్రైబ్యునల్కు ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకునే నాథుడే లేరు. -
అంతర జిల్లా ద్విచక్ర వాహనాల దొంగ అరెస్టు
[ 29-03-2024]
జల్సాలకు అలవాటుపడి వివిధ జిల్లాల్లో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతూ వాటిని విక్రయిస్తున్న దొంగను పట్టుకొని 37 ద్విచక్ర వాహనాలను తోట్లవల్లూరు పోలీసులు పట్టుకున్నారని కృష్ణా జిల్లా ఎస్పీ నయీం అస్మి తెలిపారు. -
నిశిత తనిఖీలు
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నగదు, మద్యం, గంజాయి తదితరాల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. -
కోడ్ ఉల్లంఘించి.. వైకాపా నేతల వేడుకలు
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా.. వైకాపా నేతల ఉల్లంఘనలు యథేచ్ఛగా సాగుతున్నాయి. -
‘అతడి ఆత్మహత్యాయత్నానికి కారకులెవరు..?’
[ 29-03-2024]
ఓ మనిషి ప్రాణం తీసుకునేలా ప్రేరేపించడం దారుణం. న్యాయం కోసం వస్తే కంచె చేను మేసిన చందంగా రక్షించాల్సిన వారే అతడి ఆత్మహత్యాయత్నానికి కారణం కావడం శోచనీయం. -
ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
[ 29-03-2024]
జిల్లాలోని గంపలగూడెం మండలం పెదకొమిర, రెడ్డిగూడెం మండలం మద్దులపర్వలోని ఆదర్శ పాఠశాలల్లో ప్రథమ ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాళ్లు ఆర్.శైలజ, ఎ.వీరరాజు గురువారం తెలిపారు.