logo

ఆత్మహత్యాయత్నం చేసిన ప్రియుడు మృతి

ప్రియురాలు తన మాట వినలేదని ఆదివారం పెట్రోలు పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రాజ్‌పుత్‌ శైలేష్‌సింగ్‌(26) విజయవాడలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు.

Published : 21 Mar 2023 04:48 IST

శైలేష్‌సింగ్‌ (పాత చిత్రం)

గుడివాడ(నెహ్రూచౌక్‌), న్యూస్‌టుడే: ప్రియురాలు తన మాట వినలేదని ఆదివారం పెట్రోలు పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రాజ్‌పుత్‌ శైలేష్‌సింగ్‌(26) విజయవాడలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. 70 శాతం శరీరం కాలిపోవడంతో తొలుత గుడివాడ నుంచి మచిలీపట్నం రిఫర్‌ చేశారు. యువకుడి పరిస్థితి విషమించడంతో విజయవాడ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. చేతికి అందొచ్చిన కుమారుడు మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని