తెదేపా కార్యకర్తలకు దిశా నిర్దేశం
‘మీరు ప్రసంగాలు చేయడం కాదు.. మీ క్లస్టర్లో ఎలాంటి కృషి చేశారు.. మీ అనుభవాలు ఏమిటి..? వాటిని ఇతర క్లస్టర్ల కార్యకర్తలకు స్ఫూర్తిదాయకంగా చెప్పండి..!’ అని తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఇన్ఛార్జులను సున్నితంగా మందలించారు.
సాంకేతికతపై అవగాహన
టెలిగ్రామ్ బాట్, ఆర్టీఎస్, వాట్సాప్పై శిక్షణ
ఈనాడు, అమరావతి
‘మీరు ప్రసంగాలు చేయడం కాదు.. మీ క్లస్టర్లో ఎలాంటి కృషి చేశారు.. మీ అనుభవాలు ఏమిటి..? వాటిని ఇతర క్లస్టర్ల కార్యకర్తలకు స్ఫూర్తిదాయకంగా చెప్పండి..!’ అని తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఇన్ఛార్జులను సున్నితంగా మందలించారు. నియోజకవర్గ సమస్యలపై పోరాడాలని, సాంకేతికత, సామాజిక మాధ్యమాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. తెదేపా జోన్3 సమీక్షా సమావేశంలో నేతలకు, కార్యకర్తలకు ఆయన దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశం శుక్రవారం మంగళగిరిలో రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అధ్యక్షతన వినూత్నంగా జరిగింది. ప్రస్తుత సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా పార్టీ నేతలను చైతన్యం చేసేందుకు, వారిలో అవగాహన కల్పించేందుకు వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చారు. మొత్తం జోన్3లో అయిదు జిల్లాలు ఉన్నాయి. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల పరిధిలోని నియోజకవర్గ కార్యకర్తలు, ఇన్ఛార్జులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యక్రమాలు నిర్వహించారు. మొత్తం 34 నియోజకవర్గాల నుంచి 2,450 మంది ఇన్ఛార్జులకు 2,351 మంది హాజరయ్యారు. దీనిపై చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. విజయవాడ ఎంపీ, గుంటూరు ఎంపీ హాజరుకాలేదు. మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు, మంత్రులు నియోజకవర్గాలకు చెందిన ఇన్ఛార్జులు హాజరయ్యారు. పోలింగు బూత్ స్థాయి, గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో పార్టీ కమిటీలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రతి మండలాన్ని యూనిట్గా, క్లస్టర్, సెక్షన్గా మూడు అంచెలుగా సారథులను నియమించారు. ప్రతి 30 కుటుంబాలకు, 50 మంది ఓటర్లుకు ఒకరు చొప్పున ఇన్ఛార్జిని నియమించారు. వారి ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా పరిశీలన, ఇతర కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా వీటి పురోగతిని ఎప్పటికప్పుడు కేంద్ర కార్యాలయానికి చేరాల్సి ఉంది. ఈ సమీక్షలో ఇంటింటికి తెదేపా, బాదుడే బాదుడు, గౌరవ సభలు, ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమాల నిర్వహణపై సమీక్షించారు. ఓటర్ల జాబితా పరిశీలనలో ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం మొదటి స్థానంలో నిలిచింది.
సామాజిక మాధ్యమాలపై చైతన్యం...
మొదట సమావేశానికి హాజరైన కార్యకర్తలు రిజిస్ట్రేషన్ అనంతరం టెలిగ్రామ్ బాట్ అనే యాప్ ద్వారా హాజరు తీసుకున్నారు. దీనిపై శిక్షణ కల్పించారు. సామాజిక మాధ్యమాల ఇన్ఛార్జి చింతకాయల విజయ్ అవగాహన కల్పించారు. స్మార్ట్ ఫోన్లో యాప్ను ఏవిధంగా ఉపయోగించాలి..? అనే అంశంపై దాదాపు గంటసేపు పీపీటీ ద్వారా అవగాహన కల్పించారు. దీంతో మధ్నాహ్నానికి 90శాతం నమోదు చేసుకున్నారు. అనంతరం రియల్టైం స్ట్రాటజీ (ఆర్టీఎస్) అనే అంశంపై ఆ బృందం అవగాహన కల్పించింది. గ్రామాల్లో ఓటర్ల జాబితాపై పరిశీలన గురించి ఎస్ రాజశేఖర్ అవగాహన కల్పించారు. రాష్ట్రంలో 50శాతం పరిశీలన పూర్తయిందని, మిగిలినవారు అవగాహన పెంచుకోవాలని సూచించారు.
కుటుంబ సాధికారిక సారథి
ఈ సారి వినూత్నంగా కుటుంబ సాధికారిక సారథి నియామకాలు చేపట్టాలని సూచించారు. ప్రతి 30 కుటుంబాలకు 100 ఓట్లకు ఒక సారథిని నియమించాల్సి ఉంది. దీనిలో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని తప్పనిసరిగా 50 శాతం మంది మహిళలు ఉండాలని, ఈ సారథి కీలకంగా వ్యవహరించాలని సూచించారు.
* రాష్ట్రంలో ఓటర్ల జాబితా పరిశీలనలో ప్రథమ స్థానంలో నిలిచిన మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని ఉమా మాట్లాడుతూ 26 వేల బోగస్, డూప్లికేట్ ఓట్లను తొలగించామని వివరించారు. గ్రామాల్లో పర్యటిస్తే వైకాపా బోగస్ ఓట్ల చిట్టా బయట పడిందన్నారు.
అంతా చంద్రబాబు ఘనతే...
ఈ సమావేశంలో పంచుమర్తి అనురాధ ప్రత్యేక ఆకర్షణ అయ్యారు. ఆమెను ప్రసంగించాలని చంద్రబాబు కోరగా తన విజయం చంద్రబాబు ఘనతేనని, తనది కాదని స్పష్టం చేశారు. తాను అసలు ఊహించలేదని సంతోషం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గులకరాయికి.. రాజకీయ రంగు!
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్పై గులకరాయి కేసు.. కుట్ర కేసుగా మారుతోంది. రాజకీయ రంగు పులుముకునేందుకు రంగం సిద్ధమైంది. తెదేపా నేతలు అనుమానించినట్లే.. మరికొందరు కీలక నేతలను ఇరికించేందుకు ఖాళీ వదిలినట్లు తెలిసింది. -
తెచ్చిపెట్టేది లేదు... తరిమికొట్టుడే..!
[ 19-04-2024]
‘గత ఐదేళ్ల జగన్ పాలనలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఒక్క పరిశ్రమ కూడా నెలకొల్పింది లేదు. కానీ.. గత చంద్రబాబు సర్కారు ఎన్నో ఇబ్బందులు పడి, పారిశ్రామికవేత్తలను ఒప్పించి, రాయితీలు ఇచ్చి ఇక్కడ పెట్టించిన పరిశ్రమలను మూతపడేలా చేయడంలో వైకాపా సర్కారు విజయవంతమైంది. -
అభివృద్ధి పరుగులు పెట్టిస్తా: సుజనా
[ 19-04-2024]
విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ప్రధాని మోదీ, చంద్రబాబు సహకారంతో అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తానని భాజపా పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు. గురువారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. -
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: బాలశౌరి
[ 19-04-2024]
వైకాపా అరాచక పాలన నుంచి విముక్తి పొందేందుకు తెదేపా, జనసేన కూటమి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కూటమి బందరు ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి పిలుపునిచ్చారు. -
ఒడిసిపడతానని.. విడిచిపెడతావేం?
[ 19-04-2024]
సీఎం జగన్ మాటలకు అర్థాలే వేరు. ఆయన చెప్పారంటే... అసలు చేయరని అర్థం. దీనికి సజీవ సాక్ష్యం కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీకి దిగువన ప్రతిపాదించిన రెండు బ్యారేజీల నిర్మాణం. కృష్ణా, గుంటూరు జిల్లాలకు ప్రాణావసరమైన వీటి గురించి జగన్ సర్కారు ఏమాత్రం పట్టించుకోలేదు. -
నాలుగో సింహం నలిగిపోతోంది
[ 19-04-2024]
వారాంతపు సెలవులు లేక పోలీసులు తీవ్ర ఇబ్బందుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. రోజూ ఒత్తిడితో పని చేయాల్సి వస్తోంది. ఈ విధంగా ఉద్యోగం చేయడం కష్టంగా ఉందని పోలీసు ఉద్యోగుల సంఘం తరఫున ఉన్నతాధికారులను, ప్రజా ప్రతినిధులను వేడుకున్నారు. -
తెదేపా అభ్యర్థుల నామ పత్రాల దాఖలు
[ 19-04-2024]
గన్నవరం నియోజకవర్గంలో జనసేన, భాజపా మద్దతుతో తెదేపా బలపర్చిన ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గురువారం ఉదయం 11.15 గంటలకు తొలి విడత నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి జేసీ గీతాంజలిశర్మకు సమర్పించారు. -
లారీ ఢీకొని ప్రసాదంపాడు వాసి దుర్మరణం
[ 19-04-2024]
చంద్రుగొండ మండలం అయ్యన్నపాలెం ఒడ్డు వద్ద గల మలుపు సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన శ్రీకృష్ణచక్రపాణి(61) మృతి చెందారు. -
బావిలో పడిన యువకుడు
[ 19-04-2024]
బాపులపాడు మండలం బొమ్ములూరులో ఓ యువకుడు బావిలో పడిన ఘటన గురువారం రాత్రి కలకలం రేపింది. ఇదే గ్రామానికి చెందిన పవన్ స్థానిక విద్యుత్తు ఉపకేంద్రం సమీపంలో ఉన్న పొలంలోని బావిలో పడిపోయాడు. -
చెత్తకు నిప్పు.. గ్యాస్ పైప్లైన్కు మంటలు
[ 19-04-2024]
ముదినేపల్లి ప్రధాన రహదారిలో చెత్త కాలుస్తుండగా..గ్యాస్ పైప్లైన్ లుకింగ్ పాయింట్కు అంటుకొని భీతావహ పరిస్థితి ఏర్పడింది. వెంటనే స్పందించిన అగ్నిమాపకశాఖ అధికారులు మంటల్ని అదుపు చేశారు. -
ప్రోత్సాహం అన్నావు.. సాయం మరిచావు
[ 19-04-2024]
బందరు బంగారంగా ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన రోల్డ్గోల్డ్ పరిశ్రమ ప్రస్తుతం అనేక ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. -
ఆ భోజనం మా కొద్దు
[ 19-04-2024]
మధ్యాహ్నభోజన మెనూ మార్చాం...పోషకాలతో కూడిన భోజనం అందిస్తున్నాం అని ముఖ్యమంత్రి జగన్ గొప్పలు చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. -
ఇన్నాళ్లూ.. కాలయాపన
[ 19-04-2024]
పేరుకే అది వంద పడకల ఆసుపత్రి.. వైద్యం మాత్రం ‘ప్రాథమిక’ స్థాయిలోనే అందుతోంది. వైద్యశాలను ఉన్నతంగా తీర్చిదిద్దామని ఎమ్మెల్యే సోదరులు ప్రజలను మభ్యపెడుతున్నారు. స్థాయి పెంపు కాగితాలకే పరిమితమైంది. -
నాడు కళకళ.. నేడు వెలవెల
[ 19-04-2024]
వైకాపా పాలనలో పారిశ్రామికవాడలు పూర్తిగా చతికిల పడ్డాయి. గుడివాడ ఆటోనగర్ ఒకప్పుడు దేశవ్యాప్తంగా వ్యవసాయ పరికరాలకు ప్రఖ్యాతి. కర్నాటక, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు ఇక్కడి నుంచి కల్టివేటర్లు, వీల్స్, నూర్పిడి యంత్రాలు సరఫరా అయ్యాయి. -
సుద్దగా అన్నం.. అందుకే తినం
[ 19-04-2024]
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చాలా మంది విద్యార్థులకు రుచించడం లేదు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మెనూ అమలు చేస్తున్నప్పటికీ ఆహార పదార్థాలు రుచి, శుచి ఉండడం లేదని పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చెబుతున్నారు.