‘ఆరోగ్యశ్రీ సేవలకు రుసుం వసూలు చేస్తే చర్యలు’
కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్కేర్ ట్రస్టు ద్వారా వైద్య సేవలను పూర్తిగా ఉచితంగా అందించాలని, రోగుల నుంచి అక్రమంగా రుసుం వసూలు చేస్తే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఎస్.డిల్లీరావు హెచ్చరించారు.
ఎన్టీఆర్ కలెక్టరేట్, న్యూస్టుడే : కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్కేర్ ట్రస్టు ద్వారా వైద్య సేవలను పూర్తిగా ఉచితంగా అందించాలని, రోగుల నుంచి అక్రమంగా రుసుం వసూలు చేస్తే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఎస్.డిల్లీరావు హెచ్చరించారు. నగరంలోని కలెక్టరేట్లో జిల్లా క్రమ శిక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పేదలకు వైద్యం అందించేందుకు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తోందని, పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో రుసుం వసూలు చేస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో కమిటీ సభ్యులు ఆసుపత్రులపై పర్యవేక్షించాలని పేర్కొన్నారు. ఫిర్యాదులపై ప్రాథమిక విచారణ పూర్తి చేసి, నివేదికలు అందజేయాలని ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్తను ఆదేశించారు. తిరువూరు అమరావతి ఆసుపత్రి, విజయవాడలోని స్మైల్, వంశీ హార్ట్ కేర్ ఆసుపత్రుల్లో కొంత మొత్తాన్ని వసూలు చేసినట్టు ఆరోపణలు వచ్చినట్టు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Baharla Ha Madhumas: యూట్యూబ్, ఇన్స్టాలో ఈ పాటదే ఇప్పుడు ట్రెండ్!
-
Sports News
Anand Mahindra: ఐపీఎల్ ఫైనల్పై వైరల్గా మారిన ఆనంద్ మహీంద్రా ట్వీట్!
-
Politics News
Eatela rajender: పొంగులేటి.. జూపల్లి నాకే రివర్స్ కౌన్సెలింగ్ ఇస్తున్నారు: ఈటల
-
Politics News
BJP: ప్రధాని మోదీ టార్గెట్ విజన్-2047: కేంద్ర మంత్రి మేఘ్వాల్
-
India News
Manipur: ప్రజలను మానవకవచాలుగా వాడుకొని దాడులు.. మణిపుర్ వేర్పాటు వాదుల కుట్ర
-
India News
Bimal Hasmukh Patel: కొత్త పార్లమెంట్ను చెక్కిన శిల్పి.. ఎవరీ బిమల్ పటేల్