రహదారి ప్రమాదాల నియంత్రణకు చర్యలు
జిల్లాలో రహదారి ప్రమాదాలను పూర్తిగా అరికట్టేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రంజిత్బాషా అధికారులకు స్పష్టం చేశారు.
గాలికుంటు వ్యాధి నివారణ టీకాపై గోడపత్రికలు ఆవిష్కరిస్తున్న కలెక్టర్, జేసీ, తదితరులు
కలెక్టరేట్(మచిలీపట్నం), న్యూస్టుడే: జిల్లాలో రహదారి ప్రమాదాలను పూర్తిగా అరికట్టేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రంజిత్బాషా అధికారులకు స్పష్టం చేశారు. శనివారం కలెక్టరేట్లో జిల్లా రహదారి భద్రత కమిటీతో సమావేశం నిర్వహించిన ఆయన పలు సూచనలు చేశారు. రాత్రి సమయాల్లోనే ఎక్కువ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ప్రస్తావిస్తూ అందుకు కారణాలు విశ్లేషించాలన్నారు. పోలీస్, రవాణా శాఖల పరంగా విధిగా డ్రంక్ అండ్ డ్రెవ్పై దృష్టి సారించాలన్నారు. అప్రోచ్ రహదారులకు వేగనిరోధకాలతో పాటు అవసరమైన చోట్ల సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. పెనమలూరు హైవే వద్ద రద్దీ సమయాల్లో ఇసుక లారీలు అనుమతించకుండా వాటికి ప్రత్యేక సమయాలు కేటాయించాలని ఆదేశించారు. జిల్లా రవాణా అధికారి సీతాపతిరావు గడచిన నెలలో 65 రహదారి ప్రమాదాలు సంభవించాయన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకు సంబంధించి 83 డ్రైవింగ్ లైసెన్స్లు రద్దు చేశామని, అతివేగం, ఓవర్ లోడింగ్లపై 1,966 కేసులు నమోదు చేసినట్లు కలెక్టర్కు వివరించారు. మచిలీపట్నం, ఉయ్యూరు, గుడివాడ డివిజన్లకు రెండు స్పీడ్గన్లు, 6 బ్రీత్ ఎనలైజర్లు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు చెప్పారు. డీఎస్పీ రమేష్బాబు, డీఎంహెచ్వో గీతాబాయి, బందరు డిపో మేనేజర్ పెద్దిరాజు, కమిటీ సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు.
30 నాటికి పంట నష్టం అంచనాలు
జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా సంభవించిన పంట నష్టం అంచనాలను ఈనెల 30 లోపు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జేసీ అపరాజితసింగ్తో కలిసి నిర్వహించిన జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశంలో వివిధ అంశాలను సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ అకాల వర్షాల కారణంగా 6,850 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక అంచనాల ద్వారా తెలిసిందన్నారు. పూర్తి నష్టం తెలుసుకునేందుకు నియమించిన బృందాలు నెలాఖరు నాటికి నివేదిక ఇస్తే ఏప్రిల్ మొదటి వారంలో ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. సలహా మండలి ఛైర్మన్ జన్ను రాఘవరావు మాట్లాడారు. పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణ టీకాలపై అవగాహన కల్పించే గోడపత్రికలను ఆవిష్కరించారు.
అసౌకర్యాలు లేకుండా చూడాలి
రంజాన్ మాసంలో ముస్లింలు భక్తిశ్రద్ధలతో వారి కార్యక్రమాలు నిర్వహించేందుకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా చూడాలని కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. కలెక్టరేట్లో ముస్లిం మత పెద్దలతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి మసీదును సంబంధిత అధికారులు సందర్శించి పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ సౌకర్యాలపై ఆరా తీయాలని సూచించారు. ఎమ్మెల్సీ మహ్మద్రుహుల్లా మాట్లాడారు. డీఎస్పీ మాసుంబాషా మాట్లాడుతూ మసీదుల వద్ద తగు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మున్సిపల్ మాజీ ఛైర్మన్ సిలార్దాదా, జామియా మసీదు అధ్యక్షులు, పలువురు ముస్లిం పెద్దలు కొన్ని సమస్యలు తెలియచేసి, కలెక్టర్, ఎమ్మెల్సీని సత్కరించారు. డీఆర్వో వెంకటేశ్వర్లు, మైనార్టీ సంక్షేమాధికారిణి షంషున్నీసా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశంలో ఏపీ తప్ప రాజధాని లేని రాష్ట్రం ఉందా?: షర్మిల
[ 25-04-2024]
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. -
రోడ్డేయలేదని అడిగితే.. కొడాలి నాని వర్గం దాడి
[ 25-04-2024]
గుడివాడ వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరుల ఆగడాలు శృతిమించిపోతున్నాయి. ఈ ఐదేళ్లు ఎమ్మెల్యేగా జనం సమస్యలు పట్టించుకోకుండా వదిలేసి.. -
నీ నిర్లక్ష్యమే.. పెనువిపత్తు!
[ 25-04-2024]
అకాల వర్షాలు.. వరదలకు నిలువునా మునిగిపోయిన అన్నదాతను ఆదుకోవడంలో జగన్ సర్కారు ఘోరంగా విఫలమైంది. పరిహారం ఇవ్వడంలో కనికరం చూపించలేదు. -
అభిమాన కెరటం
[ 25-04-2024]
తెదేపా, జనసేన, భాజపా.. కూటమి అభ్యర్థుల నామినేషన్లకు.. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మూడు పార్టీల శ్రేణులు.. ఏకతాటిపైకి వచ్చి తమ అభ్యర్థుల కోసం తరలివస్తున్నారు. -
సిగ్గు విడిచి సంబరమా!
[ 25-04-2024]
వైకాపా నేతల నామినేషన్లు.. జనానికి ప్రాణసంకటంలా మారాయి. నామినేషన్ల ర్యాలీలకు డబ్బులిచ్చి భారీగా జనాన్ని ఆటోలు, వాహనాల్లో తీసుకొచ్చి.. లేని బలాన్ని.. ఉన్నట్టు చూపించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. -
నయవంచన
[ 25-04-2024]
పాడి రైతుల ముంగిట్లో 20 ఏళ్లుగా సేవలిందిస్తున్న గోపాలమిత్రలు కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆరుగాలం శ్రమించినా నెలకు రూ.6,500 మాత్రమే చెల్లిస్తుండడంతో కుటుంబ పోషణకు చాలక ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతున్నారు. -
వైకాపా నాయకులకు దోచుకోవడమే తెలుసు : షర్మిల
[ 25-04-2024]
కృష్ణానది ఇసుకను దోసుకుతిన్న ఘనుడు ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ అని పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. -
జాతీయ స్థాయిలో మెరిసిన తెలుగు తేజం
[ 25-04-2024]
సివిల్ సర్వీస్లో ఎంపికవడమే కాదు.. అక్కడ ఇచ్చిన శిక్షణలో కూడా రాణించి బంగారు పతకాలు అందుకున్నారు. -
కూటమిలో జోష్
[ 25-04-2024]
విజయమే లక్ష్యంగా తెదేపా, జనసేన, భాజపా నాయకులు కార్యకర్తలు బందరులో బుధవారం జనసునామి సృష్టించారు. -
బెజవాడ సీపీగా రామకృష్ణ
[ 25-04-2024]
విజయవాడ కొత్త పోలీస్ కమిషనర్గా 2006 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన పీహెచ్డీ రామకృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. -
నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు ప్రవర్తిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
వైకాపా నాయకులు పోలీసు వ్యవస్థను అడ్డంపెట్టుకొని ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. -
షర్మిల యాత్ర విజయవంతం చేయండి
[ 25-04-2024]
కృష్ణలంకలో గురువారం (నేడు) జరిగే షర్మిలారెడ్డి యాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఏపీ ఎన్నికల ఇన్ఛార్జి చౌహాన్ పిలుపునిచ్చారు. -
పని ప్రాంతంలోనే ఎన్నికల విధులు వేయరూ..
[ 25-04-2024]
మహిళా ఉపాధ్యాయులను వారి పని చేసే నియోజకవర్గాల్లోనే ఎన్నికల విధుల్లో నియమించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ నవాబ్, కోసూరి రాజశేఖర్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావుకు బుధవారం వినతి పత్రం సమర్పించారు. -
కలగా మిగిలిన వంతెన
[ 25-04-2024]
జగనన్న వస్తాడు..ఏదో చేస్తాడని ఓట్లేస్తే పాములలంక వంతెన నిర్మించకుండా అయిదేళ్ల్లుగా ఉసూరుమనిపించారని పాములలంక గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. -
పరిహారం.. పరిహాసం
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గతేడాది ఖరీఫ్, రబీ పంటల సాగులో అన్నదాత పూర్తిగా నష్టపోయారు. నేటి వరకూ రైతులకు పావలా ఆర్థిక సాయం కూడా అందలేదని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
43 మంది అభ్యర్థులు...57 నామపత్రాలు
[ 25-04-2024]
జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలో పోటీ చేసేందుకు బుధవారం మొత్తం 43 మంది నామపత్రాలు దాఖలు చేశారు. -
పామర్రుని తెదేపా అడ్డాగా మారుస్తా: వర్ల
[ 25-04-2024]
అన్న నందమూరి తారకరామారావు పుట్టిన ఈ గడ్డపై మళ్లీ పసుపు జెండాను ఎగరేసి నియోజకవర్గాన్ని తెదేపాకు అడ్డాగా మారుస్తానని ఎన్డీఏ కూటమి అభ్యర్థి వర్ల కుమార్రాజా అన్నారు. -
పీఏసీఎన్ కంప్యూటరీకరణపై శిక్షణ
[ 25-04-2024]
ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల కంప్యూటరీకరణపై చల్లపల్లి పీఏసీఎన్లో శిక్షణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. -
‘బటన్ నొక్కుడు తప్ప చేసిందేమీ లేదు’
[ 25-04-2024]
నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెబుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్టీఆర్ గృహాలు నిర్మించుకున్న పేదలకు ఎందుకు నిధులు మంజూరు చేయలేదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శీలం ప్రకాష్రావు ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం