చెత్త పన్ను రద్దు చేయాల్సిందే : బొండా
‘ఏప్రిల్ నుంచి తెదేపా ఇంటింటికీ వెళుతుంది. చెత్త పన్ను కట్టొద్దంటూ ప్రతి గడపలో స్టిక్కర్లు అంటిస్తాం.
విజయవాడ(అలంకార్కూడలి), న్యూస్టుడే : ‘ఏప్రిల్ నుంచి తెదేపా ఇంటింటికీ వెళుతుంది. చెత్త పన్ను కట్టొద్దంటూ ప్రతి గడపలో స్టిక్కర్లు అంటిస్తాం. వాలంటీర్లు లేదా ఇతరులు ఎవరైనా భయబ్రాంతులకు గురిచేస్తే.. ప్రజలు తమకు తెలపాలని’ తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రజలపై విధించే చెత్త పన్నును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వానికి ప్రజల నుంచి ఎలా డబ్బు వసూలు చేసి, జోబులో వేసుకోవాలనే ఆలోచనే తప్ప.. ప్రజలకు అవసరమయ్యే పనులు చేసే ఆలోచన లేదని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు అడ్డగోలుగా పెరిగాయని, ఇందులో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్వార్థం ఎక్కువ ఉందని దుయ్యబట్టారు. విద్యుత్తు ఛార్జీల పెంపు, జె ట్యాక్స్లతో ప్రజలు బెంబెలెత్తుతున్నారని చెప్పారు. తెదేపా ప్లోర్ లీడర్, కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి మాట్లాడుతూ... వైకాపాకు చెందిన కార్పొరేటర్లంతా కౌన్సిల్లో బెదిరింపు ధోరణులకు పాల్పడటమే ధ్యేయంగా పని చేస్తున్నారని మండిపడ్డారు. వారంతా దొరికిన కాడకి దోచుకుంటున్నారని ఆరోపించారు. ఏయే పనులు చేస్తే.. డబ్బులు వస్తాయో... అని వెంపర్లాడి మరీ కౌన్సిల్లో ఆమోదంపజేసుకుంటున్నారని దుయ్యబట్టారు. వాటిని అడ్డుకుంటున్న తమపై, వామపక్ష కార్పొరేటర్పై దౌర్జన్యం ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు. చెత్త పన్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నాయకులు, శ్రేణులు ఫ్లకార్డులు పట్టుకుని నినదించారు. ఈ కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, నాయకులు కొండపల్లి రూప్కుమార్, సూర్యనారాయణ, గరిమెళ్ల రాధిక, షేక్ గౌసియా, సర్వేపల్లి అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తోడేళ్ల రాజ్యం
[ 17-04-2024]
కృష్ణా జిల్లాలో ఓ ప్రజాప్రతినిధికి జేపీ పేరుతో అప్పగించగా.. ఆయన నష్టం వస్తుందని వదిలేశారు. ప్రకాశం బ్యారేజీ ఎగువన ప్రజాప్రతినిధుల సోదరులు, మరో ప్రజాప్రతినిధి వియ్యంకుడు, కింది వైపున ఓ మంత్రి, ప్రజాప్రతినిధి సోదరుడు ఇష్టానుసారం కొల్లగొట్టారు. -
మచిలీపట్నం-రేపల్లె రైల్వేలైను ఐదేళ్లలో పూర్తి
[ 17-04-2024]
దివిసీమ వాసులు దశాబ్దాలుగా కోరుతున్న.. మచిలీపట్నం-రేపల్లె రైల్వేలైన్ను తాము గెలిచిన తర్వాత ఐదేళ్లలోనే పూర్తిచేస్తామని జనసేన, తెదేపా, భాజపా కూటమి మచిలీపట్నం లోక్సభ అభ్యర్థి, ఎంపీ వల్లభనేని బాలశౌరి వెల్లడించారు. -
తీరాన నేడు.. ప్రజాగళం
[ 17-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజాగళం సభలో పాల్గొనేందుకు తెదేపా అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్లు బుధవారం పెడన రానున్నారు. -
పనులు చేశారా.. పైసలు మేశారా..!
[ 17-04-2024]
ఎయిర్పోర్టు గ్రీన్ కారిడార్లో భాగంగా ఇటీవల విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి రామవరప్పాడు కూడలి దాకా సుమారు 13 కి.మీ జాతీయ రహదారిని అధికారులు అభివృద్ధి చేశారు. -
‘జగన్ హయాంలో కార్మికులకు ఉపాధి కరవు’
[ 17-04-2024]
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్మికులకు ఉపాధి కరవైందని తెదేపా జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురామ్ అన్నారు. విజయవాడ గురునానక్ రోడ్డులోని ఎన్ఏసీ కల్యాణ మండపంలో మంగళవారం -
హామీ ఇచ్చారు.. నిర్మాణం మరిచారు
[ 17-04-2024]
అవనిగడ్డ మండలంలోని లంక గ్రామమైన పాత ఎడ్లంకకు రాకపోకలు సాగించేందుకు వీలుగా కృష్ణా నదిపై వంతెన నిర్మిస్తామని ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ మరుగున పడింది. -
రూకలివ్వలేదు.. రూపు మారలేదు!
[ 17-04-2024]
విజయవాడ రూపురేఖలు మేమే మార్చాం. అభివృద్ధి మా ప్రభుత్వమే చేసింది’ అని సీఎం జగన్ విజయవాడ పర్యటనకు వచ్చినపుడు పదే పదే చెప్పే అబద్ధాలు చెప్పడం అలవాటు చేసుకున్నారు. -
అప్పుల బతుకు..!
[ 17-04-2024]
రాష్ట్రం రుణాంధ్రప్రదేశ్గా మారడంతో ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోయాయి. పీఆర్సీ, కరవు భత్యం, సరెండర్ లీవులు తదితరాల కింద రూ.25,000 కోట్లకు పైగా ప్రభుత్వం నుంచి అందాల్సి ఉంది. -
రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ
[ 17-04-2024]
సార్వత్రిక ఎన్నికల ఘట్టానికి తెరలేచింది. ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ లోక్ సభ స్థానంతో పాటు, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 18వ తేదీ నుంచి 25 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. -
నమ్మించి.. వంచన
[ 17-04-2024]
ప్రభుత్వం ఉపాధ్యాయ, ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా వారికి రావాల్సిన బకాయిలను సైతం ఏళ్లతరబడి విడుదల చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ విద్యార్థుల ప్రతిభ
[ 17-04-2024]
సివిల్స్ ఫలితాల్లో శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్, విజయవాడ శాఖల్లో శిక్షణ తీసుకున్న విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారని... -
వైకాపాకు ‘బొకినాల’ రాజీనామా
[ 17-04-2024]
బాపులపాడు మండలం మల్లవల్లికు చెందిన వైకాపా నాయకుడు బొకినాల సాంబశివరావు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.