ఆక్రమణలో దుర్గగుడి స్థలం
విజయవాడ దుర్గగుడికి చెందిన రూ.కోట్ల విలువైన ఆస్తులను అక్రమార్కులకు వదిలేసి భక్తులపై మాత్రం భరించలేనంత భారం మోపడంలో అధికారులు ఎప్పుడూ ముందుంటారు.
విలువైన ఆస్తుల పరిరక్షణలో అధికారుల విఫలం
టిక్కెట్ ధరలు పెంచడంలో మాత్రం అత్యుత్సాహం
ఆలయానికి రావాల్సిన అద్దెలు అక్రమార్కుల జేబుల్లోకి
ఈనాడు, అమరావతి, ఇంద్రకీలాద్రి, న్యూస్టుడే
ఆలయం కోసం రూ.కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన స్థలంలో అక్రమంగా వెలిసిన దుకాణాలు
విజయవాడ దుర్గగుడికి చెందిన రూ.కోట్ల విలువైన ఆస్తులను అక్రమార్కులకు వదిలేసి భక్తులపై మాత్రం భరించలేనంత భారం మోపడంలో అధికారులు ఎప్పుడూ ముందుంటారు. ఆలయ సమగ్రాభివృద్ధి చేపడతామంటూ కొన్నాళ్ల క్రితం ఇంద్రకీలాద్రి దిగువన అర్జునవీధి ఆరంభంలో స్థలాన్ని రూ.5 కోట్లకు పైగా వెచ్చించి కొనుగోలు చేశారు. గతంలో అక్కడ ఇతర ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన కార్యాలయాలు, ఓ ప్రైవేటు హోటల్ ఉండేవి. వాటిని తొలగించి పరిహారం చెల్లించి ఆలయం కోసం తీసుకున్నారు. కొండపై ఎలాంటి కార్యాలయాలు ఉండకుండా కిందనే ఈ స్థలంలో కట్టాలని అప్పట్లో ప్రణాళికలు రూపొందించారు. దీని కోసం కొండపై ఉన్న కార్యాలయాలను అడ్డంగా కొట్టేశారు. అన్నదాన భవనాన్ని కూడా తొలగించేశారు. కానీ ప్రస్తుతం కొండ దిగువన ఉన్న ఆ స్థలం అక్రమార్కుల పాలైంది. ఎవరెవరో వచ్చి దుకాణాలు పెట్టుకున్నారు. ఈ దుకాణదారులు ఆలయానికి ఒక్క రూపాయి కూడా అద్దె చెల్లించడం లేదు. స్థానికంగా ఉన్న అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి అండదండలు వీరికి ఉండడంతో ఆలయ అధికారులు సైతం ఇటువైపు కన్నెత్తి చూడడం లేదు. పైగా చోటామోటా నాయకులు వీరి నుంచి భారీగా మామూళ్లు వసూలు చేసుకుంటున్నారు. కనీసం ఆ స్థలంలో ఉన్న దుకాణాల నుంచి అద్దెలు వసూలు చేయాలనే స్పృహ కూడా అధికారులకు లేదు. ఎంతసేపూ భక్తుల టిక్కెట్లు, ప్రసాదాల ధరలు పెంచుకుంటూ వారిని ఇబ్బందులకు గురిచేయడంపైనే అధికారుల దృష్టంతా ఉంటుంది.
ఇదే స్థలంలో రూ.50లక్షలతో షెడ్డు కూడా..
కొండ దిగువన ఉన్న ఈ స్థలంలో రూ.50 లక్షలతో ఈవో సూర్యకుమారి హయాంలో ఓ భారీ షెడ్డు కూడా గతంలో వేశారు. ఇక్కడ కొద్దికాలం అన్నదానం ఏర్పాటు చేశారు. ఇక్కడే అన్నదానం కోసం ఓ భవనం కట్టాలని అప్పట్లో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ.. ఈవో మారగానే అన్నీ పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఆ షెడ్డు కూడా నిరుపయోగంగా పడి ఉంది. కనీసం రూ.కోట్ల విలువైన ఆ స్థలం పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు శూన్యం. ప్రస్తుతం మహామండపంలో అన్నదానం పెడుతుండడంతో భక్తుల అవస్థలు వర్ణనాతీతం. ఇవేవీ అధికారులకు పట్టడం లేదు.
రూ.500 టిక్కెట్పై తీవ్ర విమర్శలు..
రూ.కోట్ల విలువైన స్థలాలు, ఆస్తులను పరిరక్షించి.. వాటి ద్వారా ఆలయానికి ఆదాయాన్ని వచ్చేలా చేయడంపై అధికారులు దృష్టిపెడితే బాగుంటుంది. కానీ వాటిని అక్రమార్కులకు వదిలేసి ఎప్పుడు చూసినా టిక్కెట్ ధరలు పెంచుకుంటూ పోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత దసరాలో వీఐపీ భక్తుల కోసమంటూ రూ.500 టిక్కెట్ ధరను పెట్టారు. కానీ దసరా తర్వాత అదే టిక్కెట్ ధరను కొనసాగిస్తున్నామని.. సాధారణ భక్తులూ అంతరాలయ దర్శనం కావాలంటే కొని తీరాల్సిందేనని ప్రస్తుత ఈవో ప్రకటించారు. భక్తులకు సకల సౌకర్యాలు ఉన్న తిరుపతిలోనే రూ.300 టిక్కెట్ ధర ఉంటే.. ఇక్కడ మాత్రం రూ.500 ఉండడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కడెక్కడి నుంచో అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులు.. అంతరాలయ దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేయలేక అసంతృప్తితో తిరిగి వెళ్తున్నారు. ఐదుగురు సభ్యులున్న కుటుంబం వస్తే రూ.2500 ధర పెట్టి అంతరాలయ దర్శనం చేసుకోవడం తీవ్ర భారంగా మారింది. ఒకేసారి ఒక్కో టిక్కెట్పై ఇంత భారీగా రూ.200 చొప్పున ధర పెంచడం అంటే భక్తులపై ఆర్థికంగా తీవ్ర భారం మోపడమే. కానీ అధికారులు కనీస ఆలోచన కూడా లేకుండా భారీగా పెంచేశారు. కనీసం ఇప్పటికైనా దీనిపై పాలక మండలి, అధికారులు పునరాలోచించి ధర తగ్గిస్తే భక్తులకు భారం తగ్గుతుంది. అంతరాలయ టిక్కెట్ ధర తగ్గించినా ఆలయానికి ఆదాయం మాత్రం తగ్గదు. అంతరాలయ దర్శనం లేనప్పుడు రూ.300, రూ.100కు పెద్దగా తేడాలేదని భక్తులు భావిస్తున్నారు. అందుకే రూ.100 దర్శనాలకే వెళ్లిపోతున్నారు. అంతరాలయం ధర గతంలో మాదిరిగా రూ.300 చేస్తే.. ఎక్కువ మంది కొనుగోలు చేస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయవాడ తూర్పులో వైకాపాకు షాక్.. తెదేపా గూటికి ఎంవీఆర్ చౌదరి
[ 23-04-2024]
తూర్పు నియోజకవర్గంలో వైకాపాకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు వైకాపా నాయకులు -
పేరుకే ఆర్టీసీ గ్రూప్.. అంతా వైకాపా భజనే
[ 23-04-2024]
తాను ఆర్టీసీ జోనల్ ఛైర్పర్సన్గా ఉన్న సమయంలో ఆర్టీసీ అధికారులు, యూనియన్ నాయకులతో ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్లో వైకాపా నాయకురాలు తాతినేని పద్మావతి పార్టీకి సంబంధించిన వీడియోలు, చిత్రాలు, కార్యక్రమాలను పోస్టు చేస్తున్నారు. -
గెలుపు వాకిట పసుపు తోరణం
[ 23-04-2024]
ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు మయం.. తెలుపు, కాషాయం జెండాలతో రంగుల హరివిల్లు..! నినాదాలతో హోరెత్తిన నియోజకవర్గాలు.. జై చంద్రబాబు, పవన్ కల్యాణ్, మోదీ అని దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు. -
పదిలో.. మళ్లీ పదకొండే
[ 23-04-2024]
పదోతరగతి ఫలితాల్లో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కృష్ణా మళ్లీ 11వ స్థానానికే పరిమితమైంది. కృష్ణాలో గతేడాది కంటే ఉత్తీర్ణత శాతం మెరుగైనా.. -
రూ.3వేలు పెంచి.. సంక్షేమం రద్దు చేసి
[ 23-04-2024]
ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో తీసుకుంటే దాన్ని మోసం అంటాము. కానీ సీఎం జగన్ దాన్ని సాయం అని చెప్పుకుంటూ ఊదరగొడుతున్నారు. -
బుద్ధప్రసాద్ నామపత్రం దాఖలు
[ 23-04-2024]
అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. -
‘కూటమి’ కోసం కదలిన కోలవెన్ను
[ 23-04-2024]
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే ప్రసాద్, బందరు జనసేన ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరికి మద్దతుగా రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్, తెదేపా నాయకుడు తుమ్మల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి -
ఫోర్జరీ సంతకాలతో డబ్బులు డ్రా
[ 23-04-2024]
-
జీతాలు అందక.. జీవనం గడవక
[ 23-04-2024]
ఒప్పంద/పొరుగు సేవల విధానంలో పని చేస్తున్న ఉద్యోగుల పట్ల వైకాపా ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. పొరుగు సేవల ఉద్యోగులు, పలువురు ఒప్పంద ఉద్యోగులకు ప్రతి నెలా సక్రమంగా జీతాలు అందని పరిస్థితి ఏర్పడింది. -
పదిలో అద్భుత ప్రతిభ
[ 23-04-2024]
విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్టుడే: ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రతిభతో మెరిశారు. -
వెలంపల్లీ..హామీ..చేసిందేమీ..
[ 23-04-2024]
భవానీపురం పరిధిలో సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు చెప్పిన మాటలు నీటి మూటలుగానే మిగిలాయి. -
‘అరాచక పాలకులను సాగనంపాలి’
[ 23-04-2024]
అరాచక పాలకులను ప్రజలు సాగనంపాలని ఎన్డీయే విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. -
పేదింట విరిసిన విద్యాకుసుమాలు
[ 23-04-2024]
తల్లిదండ్రుల పేదరికం చిన్నారుల ప్రతిభకు ఆటంకం కాదు అని దళవాయి సుబ్బరామయ్య మున్సిపల్ హైస్కూల్ పదో తరగతి విద్యార్థినులు నిరూపించారు. సోమవారం వెల్లడైన ఫలితాల్లో మంచి ప్రతిభ చటారు. -
నన్ను చంపేందుకు వైకాపా నేతల కుట్ర
[ 23-04-2024]
వైకాపా నేతలు తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని తిరువూరు తెదేపా అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఆరోపించారు. సోమవారం నామినేషన్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. -
28 మంది అభ్యర్థులు... 31 నామపత్రాలు
[ 23-04-2024]
మచిలీపట్నం పార్లమెంట్ స్థానంతో పాటు జిల్లాలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సోమవారం 28 మంది అభ్యర్థులు నామపత్రాలు అందజేశారు.
తాజా వార్తలు (Latest News)
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు