ఇచ్చేది లేదు... వచ్చేది రాదు
సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నామని చెబుతున్న వైకాపా ప్రభుత్వం వివిధ వర్గాల ఉపాధికి ఊతమిచ్చే సబ్సిడీ రుణాలను ఎత్తివేయడం చర్చనీయాంశంగా మారింది.
ఎస్సీ నిరుద్యోగ యువతకు దక్కని కేంద్ర సబ్సిడీ
కలెక్టరేట్(మచిలీపట్నం), న్యూస్టుడే
ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం
సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నామని చెబుతున్న వైకాపా ప్రభుత్వం వివిధ వర్గాల ఉపాధికి ఊతమిచ్చే సబ్సిడీ రుణాలను ఎత్తివేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా ఎస్సీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువత, రైతులకు మెరుగైన జీవనోపాధి కల్పించాలన్న లక్ష్యంతో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందిస్తూ వస్తున్న రాయితీ రుణాలను అర్ధంతరంగా నిలిపివేసింది. రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఎటువంటి ఆర్థిక సహకారం లభించకపోగా చివరకు కేంద్ర ప్రభుత్వం పరంగా ఇచ్చే సబ్సిడీ సైతం వారికి దక్కడం లేదు.
గతంలో ఎస్సీ వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిరుద్యోగ యువత, రైతులు, భూమిలేని నిరుపేదలకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా బ్యాంకు లింకేజీతో రాయితీ రుణాలు అందించేవారు. ఎంపికచేసిన లబ్ధిదారులకు వివిధ యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన మొత్తంలో సగాన్ని ప్రభుత్వమే రాయితీగా భరించి మిగిలిన మొత్తాన్ని బ్యాంకుల నుంచి రుణంగా ఇప్పించేవారు. ఎస్సీ రైతులకు పొలాల్లో బోర్లు వేసుకునేందుకు రుణాలు, నిరుపేదలకు భూమి కొనుగోలు నిమిత్తం రుణం మంజూరు చేసేవారు. 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి 2018-19 వరకూ జిల్లాలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు 15,864 యూనిట్లు మంజూరు చేసి మొత్తం రూ.223.07 కోట్లు రాయితీ రుణాలుగా మంజూరు చేశారు. అనంతరం అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం మొదటి సంవత్సరం సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తులను ఆహ్వానించి లబ్ధిదారుల ఎంపిక సాగుతుండగా రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల మౌఖిక ఆదేశాల మేరకు రుణ మంజూరు ప్రక్రియను నిలిపివేశారు. అప్పటి నుంచి నేటి వరకూ కార్పొరేషన్ పరంగా ఎలాంటి కదలిక లేదు. వ్యక్తిగతంగా ఎవరైనా స్వయం ఉపాధి పథకాల కోసం నేరుగా బ్యాంకులను ఆశ్రయించినా పట్టించుకునే దిక్కే లేకుండా పోయింది.
బ్యాంకులను ఆశ్రయించినా..
సంక్షేమ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే రుణాలను ప్రభుత్వం పూర్తిగా నిలిపివేయడంతో ఉపాధి కోసం ఎస్సీ వర్గాలు వ్యక్తిగతంగా రుణాల కోసం బ్యాంకులను ఆశ్రయించినా ఎటువంటి ఫలితం ఉండటం లేదు. చిన్నపాటి రైతులు వ్యవసాయ భూముల్లో బోర్లు, బిందు సేద్యం తదితరాలకూ రుణం పుట్టే పరిస్థితి లేకుండా పోయింది. ఫలితంగా గడచిన నాలుగేళ్లుగా ఎటువంటి స్వయం ఉపాధి అవకాశాలకు నోచుకోని ఎస్సీ వర్గాలు ప్రభుత్వ నవరత్న పథకాలైన అమ్మఒడి, ఆసరా, చేయూత వంటి వాటి ద్వారా స్వల్ప లబ్ధికి పరిమితం కావాల్సి వచ్చింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గాల సంక్షేమ కోసం అదనపు సబ్సిడీని ఇవ్వాలని నిర్ణయించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో స్వయం ఉపాధికోసం ఆటోలు, ట్రాక్టర్లు, దుకాణాలు, టెంట్హౌస్లు, ల్యాబ్ల వంటివి కార్పొరేషన్ లేదా వ్యక్తిగత రుణాలతో ఏర్పాటు చేసుకున్న యువతకు యంగ్ ఎంటర్ప్రెన్యూర్ కింద గరిష్ఠంగా రూ.60 వేలు, పొలాల్లో బోర్లు, బిందు, తుంపర సేద్యం కోసం రుణాలు తీసుకున్న ఎస్సీ రైతులకు గరిష్ఠంగా రూ.50 వేల వరకూ అదనపు సబ్సిడీ ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి 31 లోపు అర్హుల జాబితాలను నివేదించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.
వివరాలు లేవు
నాలుగేళ్లుగా కేవలం అలంకారప్రాయంగా కొనసాగుతూ ఎస్సీ వర్గాలకు దూరమైన కార్పొరేషన్ వద్ద వ్యక్తిగతంగా స్వయం ఉపాధి పొందుతున్న వారి వివరాలు లేవు. దీంతో గ్రామాల్లో ఎవరైనా కేంద్ర సబ్సిడీకి అర్హులుగా ఉంటే వారి వివరాలు తెలియచేయాలంటూ బ్యాంకర్లు, పరిశ్రమలశాఖ, ఎంపీడీవోలను కోరినా నేటి వరకూ ఒక్కరి పేరుకూడా రాకపోవడాన్ని బట్టి జిల్లా వార్షిక రుణప్రణాళికలో ఎస్సీ వర్గాల అభ్యున్నతి కోసం చూపే లక్ష్యాలు ఏమవుతున్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొత్తం మీద అందివచ్చే అవకాశం ఉన్న ఆర్థిక ఆసరా కళ్లెదుటే చేజారుతోందన్న విషయం తెలుసుకున్న ఎస్సీ వర్గాలకు చెందిన పలువురు తమ అభ్యున్నతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరు మేడిపండును తలపిస్తోందని ఆరోపిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గులకరాయికి.. రాజకీయ రంగు!
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్పై గులకరాయి కేసు.. కుట్ర కేసుగా మారుతోంది. రాజకీయ రంగు పులుముకునేందుకు రంగం సిద్ధమైంది. తెదేపా నేతలు అనుమానించినట్లే.. మరికొందరు కీలక నేతలను ఇరికించేందుకు ఖాళీ వదిలినట్లు తెలిసింది. -
తెచ్చిపెట్టేది లేదు... తరిమికొట్టుడే..!
[ 19-04-2024]
‘గత ఐదేళ్ల జగన్ పాలనలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఒక్క పరిశ్రమ కూడా నెలకొల్పింది లేదు. కానీ.. గత చంద్రబాబు సర్కారు ఎన్నో ఇబ్బందులు పడి, పారిశ్రామికవేత్తలను ఒప్పించి, రాయితీలు ఇచ్చి ఇక్కడ పెట్టించిన పరిశ్రమలను మూతపడేలా చేయడంలో వైకాపా సర్కారు విజయవంతమైంది. -
అభివృద్ధి పరుగులు పెట్టిస్తా: సుజనా
[ 19-04-2024]
విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ప్రధాని మోదీ, చంద్రబాబు సహకారంతో అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తానని భాజపా పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు. గురువారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. -
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: బాలశౌరి
[ 19-04-2024]
వైకాపా అరాచక పాలన నుంచి విముక్తి పొందేందుకు తెదేపా, జనసేన కూటమి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కూటమి బందరు ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి పిలుపునిచ్చారు. -
ఒడిసిపడతానని.. విడిచిపెడతావేం?
[ 19-04-2024]
సీఎం జగన్ మాటలకు అర్థాలే వేరు. ఆయన చెప్పారంటే... అసలు చేయరని అర్థం. దీనికి సజీవ సాక్ష్యం కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీకి దిగువన ప్రతిపాదించిన రెండు బ్యారేజీల నిర్మాణం. కృష్ణా, గుంటూరు జిల్లాలకు ప్రాణావసరమైన వీటి గురించి జగన్ సర్కారు ఏమాత్రం పట్టించుకోలేదు. -
నాలుగో సింహం నలిగిపోతోంది
[ 19-04-2024]
వారాంతపు సెలవులు లేక పోలీసులు తీవ్ర ఇబ్బందుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. రోజూ ఒత్తిడితో పని చేయాల్సి వస్తోంది. ఈ విధంగా ఉద్యోగం చేయడం కష్టంగా ఉందని పోలీసు ఉద్యోగుల సంఘం తరఫున ఉన్నతాధికారులను, ప్రజా ప్రతినిధులను వేడుకున్నారు. -
తెదేపా అభ్యర్థుల నామ పత్రాల దాఖలు
[ 19-04-2024]
గన్నవరం నియోజకవర్గంలో జనసేన, భాజపా మద్దతుతో తెదేపా బలపర్చిన ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గురువారం ఉదయం 11.15 గంటలకు తొలి విడత నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి జేసీ గీతాంజలిశర్మకు సమర్పించారు. -
లారీ ఢీకొని ప్రసాదంపాడు వాసి దుర్మరణం
[ 19-04-2024]
చంద్రుగొండ మండలం అయ్యన్నపాలెం ఒడ్డు వద్ద గల మలుపు సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన శ్రీకృష్ణచక్రపాణి(61) మృతి చెందారు. -
బావిలో పడిన యువకుడు
[ 19-04-2024]
బాపులపాడు మండలం బొమ్ములూరులో ఓ యువకుడు బావిలో పడిన ఘటన గురువారం రాత్రి కలకలం రేపింది. ఇదే గ్రామానికి చెందిన పవన్ స్థానిక విద్యుత్తు ఉపకేంద్రం సమీపంలో ఉన్న పొలంలోని బావిలో పడిపోయాడు. -
చెత్తకు నిప్పు.. గ్యాస్ పైప్లైన్కు మంటలు
[ 19-04-2024]
ముదినేపల్లి ప్రధాన రహదారిలో చెత్త కాలుస్తుండగా..గ్యాస్ పైప్లైన్ లుకింగ్ పాయింట్కు అంటుకొని భీతావహ పరిస్థితి ఏర్పడింది. వెంటనే స్పందించిన అగ్నిమాపకశాఖ అధికారులు మంటల్ని అదుపు చేశారు. -
ప్రోత్సాహం అన్నావు.. సాయం మరిచావు
[ 19-04-2024]
బందరు బంగారంగా ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన రోల్డ్గోల్డ్ పరిశ్రమ ప్రస్తుతం అనేక ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. -
ఆ భోజనం మా కొద్దు
[ 19-04-2024]
మధ్యాహ్నభోజన మెనూ మార్చాం...పోషకాలతో కూడిన భోజనం అందిస్తున్నాం అని ముఖ్యమంత్రి జగన్ గొప్పలు చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. -
ఇన్నాళ్లూ.. కాలయాపన
[ 19-04-2024]
పేరుకే అది వంద పడకల ఆసుపత్రి.. వైద్యం మాత్రం ‘ప్రాథమిక’ స్థాయిలోనే అందుతోంది. వైద్యశాలను ఉన్నతంగా తీర్చిదిద్దామని ఎమ్మెల్యే సోదరులు ప్రజలను మభ్యపెడుతున్నారు. స్థాయి పెంపు కాగితాలకే పరిమితమైంది. -
నాడు కళకళ.. నేడు వెలవెల
[ 19-04-2024]
వైకాపా పాలనలో పారిశ్రామికవాడలు పూర్తిగా చతికిల పడ్డాయి. గుడివాడ ఆటోనగర్ ఒకప్పుడు దేశవ్యాప్తంగా వ్యవసాయ పరికరాలకు ప్రఖ్యాతి. కర్నాటక, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు ఇక్కడి నుంచి కల్టివేటర్లు, వీల్స్, నూర్పిడి యంత్రాలు సరఫరా అయ్యాయి. -
సుద్దగా అన్నం.. అందుకే తినం
[ 19-04-2024]
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చాలా మంది విద్యార్థులకు రుచించడం లేదు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మెనూ అమలు చేస్తున్నప్పటికీ ఆహార పదార్థాలు రుచి, శుచి ఉండడం లేదని పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చెబుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM