logo

వీఆర్వో, కానిస్టేబుల్‌ వివాదంపై విచారణ

వీఆర్వో, మహిళా కానిస్టేబుల్‌ వివాదంపై కలెక్టరు రంజిత్‌ బాషా ఆదేశాల మేరకు ఆర్డీవో పద్మావతి సోమవారం విచారణ చేపట్టారు.

Published : 28 Mar 2023 04:45 IST

గుడివాడ(నెహ్రూచౌక్‌), న్యూస్‌టుడే: వీఆర్వో, మహిళా కానిస్టేబుల్‌ వివాదంపై కలెక్టరు రంజిత్‌ బాషా ఆదేశాల మేరకు ఆర్డీవో పద్మావతి సోమవారం విచారణ చేపట్టారు. విచారణకు ఇద్దరూ హాజరు కావాలని ఆర్డీవో ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ వీఆర్వో అనిల్‌కుమార్‌ మాత్రమే హాజరయ్యారు. మహిళా కానిస్టేబుల్‌ రమాదేవి గైర్హాజరయ్యారు. వీఆర్వోతోపాటు గొడవ జరిగినప్పుడు ప్రత్యక్షంగా ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తలు కూడా హాజరవ్వగా వేర్వేరుగా వారిని ఆర్డీవో విచారించారు. కానిస్టేబుల్‌ రమాదేవిని కూడా విచారించిన తర్వాత నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని ఆమె తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని