‘మోదీ వైఫల్యాలు ఎత్తి చూపుతాం’
మోదీ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేస్తామని మాజీ ఎంపీ, ప్రొఫెసర్ రాజీవ్గౌడ పేర్కొన్నారు.
రాజీవ్గౌడకు జ్ఞాపిక అందిస్తున్న గిడుగు రుద్రరాజు. చిత్రంలో
పద్మశ్రీ, నరసింహారావు, గురునాథం తదితరులు
గవర్నర్పేట, న్యూస్టుడే : మోదీ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేస్తామని మాజీ ఎంపీ, ప్రొఫెసర్ రాజీవ్గౌడ పేర్కొన్నారు. మార్చి 29 నుంచి ఏప్రిల్ 8 వరకు దేశ వ్యాప్తంగా ‘జై భారత్ సత్యాగ్రహ’ యాత్ర చేస్తున్నట్లు తెలిపారు. బుధవారం ఆయన ఆంధ్రరత్న భవన్లో విలేకరులతో మాట్లాడారు. అదానీ ఆర్థిక అవకతవకలపై జాయింట్ పార్లమెంటరీ ఎందుకు నియమించటం లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తుంటే రాహుల్ గాంధీపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. పార్లమెంట్ వేదికపై రాహుల్ మాట్లాడిన ప్రతి అంశానికి ఆధారాలున్నాయని స్పష్టం చేశారు. హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదికపై ఎందుకు నోరు మెదపటం లేదని ప్రశ్నించారు. రక్షణ రంగంలోకి ప్రైవేటు సంస్థలను ఎలా ఆహ్వానిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను మోదీ దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఈడీని ప్రయోగించి.. ప్రశ్నించే ప్రతిపక్ష పార్టీల నేతలను బెదిరిస్తోందన్నారు. అదానీ విషయంలో సెబీ ఇచ్చిన ఆధారాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోవటం లేదని ప్రశ్నించారు. వెలుగులోకి వస్తున్న స్కాముల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇలా చేస్తున్నారని దుయ్యపట్టారు. కక్ష సాధింపు రాజకీయాలను పోరాటాల ద్వారా ఎదుర్కొంటామని పేర్కొన్నారు. రాహుల్ అనర్హతపై హైకోర్టుకు ఎందుకు వెళ్లడం లేదని విలేకరులు ప్రశ్నించగా.. కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ దీనిపై పని చేస్తోందని, త్వరలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని స్పష్టం చేశారు. కర్ణాటక ఎన్నికలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని పేర్కొన్నారు. భాజపా ఓటమి ఇక్కడ నుంచే ప్రారంభమవుతుందని వ్యాఖ్యానించారు. 2024 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమన్నారు. అనంతరం ఆయన్ని నాయకులు సన్మానించారు. ఈ సమావేశంలో ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, కార్యనిర్వాహక అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, లీగల్ సెల్ ఛైర్మన్ వి.గురునాథం, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు నరహరశెట్టి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నయవంచన
[ 25-04-2024]
పాడి రైతుల ముంగిట్లో 20 ఏళ్లుగా సేవలిందిస్తున్న గోపాలమిత్రలు కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆరుగాలం శ్రమించినా నెలకు రూ.6,500 మాత్రమే చెల్లిస్తుండడంతో కుటుంబ పోషణకు చాలక ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతున్నారు. -
వైకాపా నాయకులకు దోచుకోవడమే తెలుసు : షర్మిల
[ 25-04-2024]
కృష్ణానది ఇసుకను దోసుకుతిన్న ఘనుడు ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ అని పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. -
జాతీయ స్థాయిలో మెరిసిన తెలుగు తేజం
[ 25-04-2024]
సివిల్ సర్వీస్లో ఎంపికవడమే కాదు.. అక్కడ ఇచ్చిన శిక్షణలో కూడా రాణించి బంగారు పతకాలు అందుకున్నారు. -
కూటమిలో జోష్
[ 25-04-2024]
విజయమే లక్ష్యంగా తెదేపా, జనసేన, భాజపా నాయకులు కార్యకర్తలు బందరులో బుధవారం జనసునామి సృష్టించారు. -
బెజవాడ సీపీగా రామకృష్ణ
[ 25-04-2024]
విజయవాడ కొత్త పోలీస్ కమిషనర్గా 2006 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన పీహెచ్డీ రామకృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. -
నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు ప్రవర్తిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
వైకాపా నాయకులు పోలీసు వ్యవస్థను అడ్డంపెట్టుకొని ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. -
షర్మిల యాత్ర విజయవంతం చేయండి
[ 25-04-2024]
కృష్ణలంకలో గురువారం (నేడు) జరిగే షర్మిలారెడ్డి యాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఏపీ ఎన్నికల ఇన్ఛార్జి చౌహాన్ పిలుపునిచ్చారు. -
పని ప్రాంతంలోనే ఎన్నికల విధులు వేయరూ..
[ 25-04-2024]
మహిళా ఉపాధ్యాయులను వారి పని చేసే నియోజకవర్గాల్లోనే ఎన్నికల విధుల్లో నియమించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ నవాబ్, కోసూరి రాజశేఖర్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావుకు బుధవారం వినతి పత్రం సమర్పించారు. -
కలగా మిగిలిన వంతెన
[ 25-04-2024]
జగనన్న వస్తాడు..ఏదో చేస్తాడని ఓట్లేస్తే పాములలంక వంతెన నిర్మించకుండా అయిదేళ్ల్లుగా ఉసూరుమనిపించారని పాములలంక గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. -
పరిహారం.. పరిహాసం
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గతేడాది ఖరీఫ్, రబీ పంటల సాగులో అన్నదాత పూర్తిగా నష్టపోయారు. నేటి వరకూ రైతులకు పావలా ఆర్థిక సాయం కూడా అందలేదని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
43 మంది అభ్యర్థులు...57 నామపత్రాలు
[ 25-04-2024]
జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలో పోటీ చేసేందుకు బుధవారం మొత్తం 43 మంది నామపత్రాలు దాఖలు చేశారు. -
పామర్రుని తెదేపా అడ్డాగా మారుస్తా: వర్ల
[ 25-04-2024]
అన్న నందమూరి తారకరామారావు పుట్టిన ఈ గడ్డపై మళ్లీ పసుపు జెండాను ఎగరేసి నియోజకవర్గాన్ని తెదేపాకు అడ్డాగా మారుస్తానని ఎన్డీఏ కూటమి అభ్యర్థి వర్ల కుమార్రాజా అన్నారు. -
పీఏసీఎన్ కంప్యూటరీకరణపై శిక్షణ
[ 25-04-2024]
ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల కంప్యూటరీకరణపై చల్లపల్లి పీఏసీఎన్లో శిక్షణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. -
‘బటన్ నొక్కుడు తప్ప చేసిందేమీ లేదు’
[ 25-04-2024]
నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెబుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్టీఆర్ గృహాలు నిర్మించుకున్న పేదలకు ఎందుకు నిధులు మంజూరు చేయలేదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శీలం ప్రకాష్రావు ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)