మాదక ద్రవ్యాల వినియోగం, విక్రయాలకు అడ్డుకట్ట
జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగం, విక్రయం, రవాణాకు అడ్డుకట్ట వేయాలని, కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎస్.డిల్లీరావు సంబంధిత అధికారులను ఆదేశించారు.
మాట్లాడుతున్న కలెక్టర్ డిల్లీరావు, చిత్రంలో న్యాయమూర్తి రామకృష్ణ,
అదితి సింగ్, రేణుక, నాగమణి, శ్రీనివాసరావు
ఎన్టీఆర్ కలెక్టరేట్, న్యూస్టుడే : జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగం, విక్రయం, రవాణాకు అడ్డుకట్ట వేయాలని, కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎస్.డిల్లీరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. మాదక ద్రవ్యాల నివారణపై కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వీటి వినియోగం వల్ల యువతలో మానసిక సమస్యలు ఏర్పడుతున్నట్టు చెప్పారు. ఒత్తిడికి గురై, చెడు బాట పడుతున్నట్టు తెలిపారు. శారీరక ఇబ్బందులతో పాటు, జ్ఞాపకశక్తి లోపిస్తున్నట్టు విశ్లేషించారు.
నగరంలో గంజాయి హాట్ స్పాట్లు..: నగరంలో గుర్తించిన గంజాయి హాట్ స్పాట్ ప్రాంతాల్లో తనిఖీలను ముమ్మరం చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. గంజాయి రవాణాలో నూతన మార్గాలను అన్వేషిస్తున్నారని, ద్విచక్ర వాహనాలు, మహిళలు, అనాథలను వినియోగించి రవాణా చేస్తున్నట్టు చెప్పారు. వీటిపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్న వారిని గుర్తించాలని ఆదేశించారు. పార్శిల్, కొరియర్ సర్వీసుల ప్రతినిధులు, ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి, లీగల్ సర్వీసెస్ అథారిటీ ఛైర్మన్ కె.వి.రామకృష్ణ, సబ్ కలెక్టర్ అదితి సింగ్, డీఈవో రేణుక, జిల్లా వ్యవసాయాధికారిణి ఎస్.నాగమణి, జిల్లా యువజన సంక్షేమ అధికారి యు.శ్రీనివాసరావు, జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ రామ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!