బ్యాంకు లావాదేవీల్లో కేడీసీసీకి గుర్తింపు : ఛైర్మన్
దేశంలో అయిదో అతి పెద్ద డీసీసీబీగా కేడీసీసీ గుర్తింపు పొందిందని ఆ బ్యాంకు ఛైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు వెల్లడించారు.
ప్రసంగిస్తున్న తన్నీరు నాగేశ్వరరావు. చిత్రంలో డైరెక్టర్లు తదితరులు
విజయవాడ(అలంకార్కూడలి), న్యూస్టుడే : దేశంలో అయిదో అతి పెద్ద డీసీసీబీగా కేడీసీసీ గుర్తింపు పొందిందని ఆ బ్యాంకు ఛైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు వెల్లడించారు. 42 శాతం వ్యాపారాభివృద్ధితో రూ.10150 కోట్ల వ్యాపారం దాటిందన్నారు. బుధవారం విజయవాడ ఎంబీ విజ్ఞాన కేంద్రంలో కృష్ణా జిల్లా సహకార బ్యాంకు 108వ మహా సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ గుర్తింపుకు కారణం సహకార సంఘాలు అని, రైతుల అభ్యున్నతికి తీసుకున్న కీలక నిర్ణయాలే అని చెప్పారు. ఇందులో భాగంగా నష్టాల్లో ఉన్న 41 సహకార సంఘాలకు రూ.6.66కోట్లు వడ్డీ రాయితీ ప్రకటించామని తెలిపారు. 172 సంఘాలకు నూతన భవనాలు, మౌలిక వసతుల కల్పనకు సుమారు రూ.42 కోట్ల రుణాలు, రూ.2.38 కోట్ల గ్రాంట్లు మంజూరు చేసినట్టు వివరించారు. సంఘంలోని రైతు మరణిస్తే బీమా, రూ.లక్ష లోపు పంట రుణం తీసుకున్న రైతు మరణిస్తే వడ్డీ మాఫీ చేస్తామని చెప్పారు. గత 20 నెలల్లో ఓటీఎస్ ద్వారా రూ.3.99 కోట్ల వడ్డీ మాఫీ చేశామని, డ్వాక్రా మహిళలకు రూ.20 లక్షల వరకు రుణం ఇస్తున్నట్లు చెప్పారు. అద్దె భవనాల్లోని బ్యాంకులకు సొంతంగా స్థలాలు కొనుగోలు చేసి, భవనాల నిర్మాణాలు, ఇతర శాఖల్లో మౌలిక వసతులు, మరమ్మతులకు రూ.22 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. వంద శాతం రుణాలు వసూలు చేసిన ఆరు సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీబీ డైరెక్టర్లు పడమట సుజాత, భూక్యారాణి, ఎన్.కె.ఎస్.ప్రకాష్రావు, కొమ్మినేని రవిశంకర్, గుడిదేశి పెద వెంకయ్య, గుమ్మడపు రవీంద్రరాణి, సీఈవో శ్యామ్మనోహర్, జీఎం చంద్రశేఖర్, రంగబాబు, ఆప్కాబ్ జీఎం పి.ఎస్.మణి, సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయవాడ తూర్పులో వైకాపాకు షాక్.. తెదేపా గూటికి ఎంవీఆర్ చౌదరి
[ 23-04-2024]
తూర్పు నియోజకవర్గంలో వైకాపాకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు వైకాపా నాయకులు -
పేరుకే ఆర్టీసీ గ్రూప్.. అంతా వైకాపా భజనే
[ 23-04-2024]
తాను ఆర్టీసీ జోనల్ ఛైర్పర్సన్గా ఉన్న సమయంలో ఆర్టీసీ అధికారులు, యూనియన్ నాయకులతో ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్లో వైకాపా నాయకురాలు తాతినేని పద్మావతి పార్టీకి సంబంధించిన వీడియోలు, చిత్రాలు, కార్యక్రమాలను పోస్టు చేస్తున్నారు. -
గెలుపు వాకిట పసుపు తోరణం
[ 23-04-2024]
ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు మయం.. తెలుపు, కాషాయం జెండాలతో రంగుల హరివిల్లు..! నినాదాలతో హోరెత్తిన నియోజకవర్గాలు.. జై చంద్రబాబు, పవన్ కల్యాణ్, మోదీ అని దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు. -
పదిలో.. మళ్లీ పదకొండే
[ 23-04-2024]
పదోతరగతి ఫలితాల్లో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కృష్ణా మళ్లీ 11వ స్థానానికే పరిమితమైంది. కృష్ణాలో గతేడాది కంటే ఉత్తీర్ణత శాతం మెరుగైనా.. -
రూ.3వేలు పెంచి.. సంక్షేమం రద్దు చేసి
[ 23-04-2024]
ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో తీసుకుంటే దాన్ని మోసం అంటాము. కానీ సీఎం జగన్ దాన్ని సాయం అని చెప్పుకుంటూ ఊదరగొడుతున్నారు. -
బుద్ధప్రసాద్ నామపత్రం దాఖలు
[ 23-04-2024]
అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. -
‘కూటమి’ కోసం కదలిన కోలవెన్ను
[ 23-04-2024]
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే ప్రసాద్, బందరు జనసేన ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరికి మద్దతుగా రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్, తెదేపా నాయకుడు తుమ్మల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి -
ఫోర్జరీ సంతకాలతో డబ్బులు డ్రా
[ 23-04-2024]
-
జీతాలు అందక.. జీవనం గడవక
[ 23-04-2024]
ఒప్పంద/పొరుగు సేవల విధానంలో పని చేస్తున్న ఉద్యోగుల పట్ల వైకాపా ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. పొరుగు సేవల ఉద్యోగులు, పలువురు ఒప్పంద ఉద్యోగులకు ప్రతి నెలా సక్రమంగా జీతాలు అందని పరిస్థితి ఏర్పడింది. -
పదిలో అద్భుత ప్రతిభ
[ 23-04-2024]
విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్టుడే: ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రతిభతో మెరిశారు. -
వెలంపల్లీ..హామీ..చేసిందేమీ..
[ 23-04-2024]
భవానీపురం పరిధిలో సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు చెప్పిన మాటలు నీటి మూటలుగానే మిగిలాయి. -
‘అరాచక పాలకులను సాగనంపాలి’
[ 23-04-2024]
అరాచక పాలకులను ప్రజలు సాగనంపాలని ఎన్డీయే విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. -
పేదింట విరిసిన విద్యాకుసుమాలు
[ 23-04-2024]
తల్లిదండ్రుల పేదరికం చిన్నారుల ప్రతిభకు ఆటంకం కాదు అని దళవాయి సుబ్బరామయ్య మున్సిపల్ హైస్కూల్ పదో తరగతి విద్యార్థినులు నిరూపించారు. సోమవారం వెల్లడైన ఫలితాల్లో మంచి ప్రతిభ చటారు. -
నన్ను చంపేందుకు వైకాపా నేతల కుట్ర
[ 23-04-2024]
వైకాపా నేతలు తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని తిరువూరు తెదేపా అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఆరోపించారు. సోమవారం నామినేషన్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. -
28 మంది అభ్యర్థులు... 31 నామపత్రాలు
[ 23-04-2024]
మచిలీపట్నం పార్లమెంట్ స్థానంతో పాటు జిల్లాలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సోమవారం 28 మంది అభ్యర్థులు నామపత్రాలు అందజేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
-
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
-
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది మలేసియా నేవీ సిబ్బంది మృతి