జిల్లా అధికారుల చెంతకురోజుకు రూ.1 టెండర్ వ్యవహారం
రోజుకు రూ.1 టెండర్ వ్యవహారం గుడ్లవల్లేరులో వివాదంగా మారింది. ఈ వ్యవహారం పంచాయతీ అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తుండగా, వివాదం జిల్లా పంచాయతీ అధికారుల వద్దకు చేరింది.
పంచాయతీ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు
గుడ్లవల్లేరు, న్యూస్టుడే: రోజుకు రూ.1 టెండర్ వ్యవహారం గుడ్లవల్లేరులో వివాదంగా మారింది. ఈ వ్యవహారం పంచాయతీ అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తుండగా, వివాదం జిల్లా పంచాయతీ అధికారుల వద్దకు చేరింది. ఏటా పారిశుద్ధ్య, నీటిసరఫరా, విద్యుత్తు మరమ్మతులకు టెండర్లు నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో మంగళవారం టెండర్లు ఆహ్వానించగా అందులో రోజుకు రూ.1 వేతనాలు చెల్లించేలా టెండర్ దాఖలైంది. దీన్ని నాని అనే వ్యక్తి వేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి అతి తక్కువకు కోట్ చేసిన టెండర్ను అధికారులు ఖరారు చేయాల్సి ఉంటుంది. గుడ్లవల్లేరులో నిత్యం 30 మంది పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహిస్తుంటారు. అయితే రోజుకు రూ.1కి పారిశుద్ధ్య కార్మికులను గుత్తేదారుడు ఎలా అందజేయగలడనే అంశం వివాదాస్పదంగా మారింది. కనీస వేతన చట్టానికి, వారి జీవనానికి ఇది తీవ్ర అడ్డంకి. దీంతో పంచాయతీ అధికారులు ఈ టెండర్ల ఖరారు ప్రక్రియను నిలిపివేశారు. విషయం పారిశుద్ధ్య కార్మికులకు తెలియడంతో బుధవారం 30 మంది తమ విధులను బహిష్కరించారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులను నిలిపివేశారు. పంచాయతీ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. కార్యదర్శి నరసింహారావు, శానిటరీ ఇన్స్పెక్టర్ వాణికుమార్లను కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఇచ్చే రూ.300 వేతనం చాలక పస్తులుంటున్నామని, కనీస వేతనాలను అమలు చేయాలని కోరుతుంటే ఇప్పుడు రోజుకు రూ.1 టెండర్తో తమ జీవితాలను నాశనం చేయాలని చూస్తున్నారని వాపోయారు. రోజుకు రూపాయితో ఎలా బతకాలంటూ ప్రశ్నించారు. ఈ విషయం తేలే వరకు తాము పనులు చేపట్టబోమంటూ నిరసించారు. దీనిపై ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లగా జిల్లా పంచాయతీ అధికారులకు తెలియపర్చాలని నిర్ణయించారు. గురువారం శ్రీరామనవమి సెలవు కావడంతో శుక్రవారం జిల్లా అధికారుల ఆదేశాలు వెలువడగలవని భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
-
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్