logo

వీఆర్వోల సమస్యలు పరిష్కరించాలి

గ్రామ రెవెన్యూ అధికారులకు(వీఆర్వో) సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వీఆర్వో సంఘ నాయకులు కలెక్టర్‌ రంజిత్‌బాషాకు వినతిపత్రం అందజేేశారు.

Published : 30 Mar 2023 03:09 IST

కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించిన సంఘ నాయకులు

కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే: గ్రామ రెవెన్యూ అధికారులకు(వీఆర్వో) సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వీఆర్వో సంఘ నాయకులు కలెక్టర్‌ రంజిత్‌బాషాకు వినతిపత్రం అందజేేశారు. కలెక్టరేట్‌లో బుధవారం ఆయనను కలిసిన సంఘ రాష్ట్ర అధ్యక్షులు భూపతిరాజు రవీంద్రరాజు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి మిరియాల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జిల్లాలో పనిచేస్తున్న గ్రేడ్‌-2 వీఆర్వోకు ప్రొబేషన్‌ కల్పించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గుడివాడ వీఆర్వో అనిల్‌పై ఇటీవల పోలీసులు ఏకపక్షంగా కేసు నమోదు చేశారని, విచారించి తగు న్యాయం చేయాలని కోరారు. సీనియర్‌ అసిస్టెంట్‌లుగా వీఆర్వోల పదోన్నతికి తగు చర్యలు తీసుకోవాలన్నారు. వీఆర్‌ఏల నుంచి అర్హులైన వారికి గ్రేడ్‌-2 వీఆర్వోలుగా అవకాశం కల్పించాలని కోరారు. సంఘ రాష్ట్ర నాయకులు గోపాలకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి కొడాలి సందీప్‌, నాయకులు నరసింహారావు, నళినికుమార్‌, వెంకటేశ్వరరావు, తదితరులు కలెక్టర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని