సినిమా టికెట్ల ధరల పెంపుపై నిరసన
నగరంలోని పలు సినిమా థియేటర్ల నిర్వాహకులు గురువారం విడుదలైన కొత్త సినిమా టికెట్టు ధరలను ప్రభుత్వ అనుమతి లేకుండా పెంచడంతో ప్రేక్షకులు నిరసన వ్యక్తం చేశారు.
గాంధీనగర్, న్యూస్టుడే : నగరంలోని పలు సినిమా థియేటర్ల నిర్వాహకులు గురువారం విడుదలైన కొత్త సినిమా టికెట్టు ధరలను ప్రభుత్వ అనుమతి లేకుండా పెంచడంతో ప్రేక్షకులు నిరసన వ్యక్తం చేశారు. ధరలు పెంచడానికి వీల్లేదంటూ థియేటర్ యాజమాన్యాలకు బుధవారం జేసీ నోటీసులు పంపించినా పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు పట్టించుకోలేదు. రెవెన్యూ అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ రూ.110 విక్రయించాల్సిన టికెట్టును రూ.145కి, రూ.70ల టికెట్టును రూ.100కి, రూ.150 టికెట్టు రూ.195కి విక్రయించినట్లు ప్రేక్షకులు ఆరోపించారు. ఆయా థియేటర్ల వద్ద నిర్వాహకులతో ప్రేక్షకులు గొడవకు దిగారు. చిన్న సినిమాలకు కూడా భారీ బడ్జెట్ చిత్రాల మాదిరిగా ధరలు పెంచారంటూ అసహనం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు: మధ్యప్రదేశ్ సీఎం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!