ముగిసిన జేఎన్టీయూకే సెంట్రల్ జోన్ క్రీడా పోటీలు
స్థానిక ఎస్ఆర్జీఈసీలో రెండు రోజులుగా నిర్వహించిన జేఎన్టీయూకే సెంట్రల్జోన్ క్రీడా పోటీలు ముగిశాయి.
బహుమతులు సాధించిన గుడ్లవల్లేరు కళాశాల క్రీడాకారులతో ప్రసాద్, కోదండ రామారావు తదితరులు
గుడ్లవల్లేరు, న్యూస్టుడే: స్థానిక ఎస్ఆర్జీఈసీలో రెండు రోజులుగా నిర్వహించిన జేఎన్టీయూకే సెంట్రల్జోన్ క్రీడా పోటీలు ముగిశాయి. యూనివర్శిటి పరిధిలోని ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయ గోదావరి, విశాఖ జిల్లాల్లోని కళాశాలలకు చెందిన 198 జట్లు పురుషులు, మహిళల విభాగాల్లో పోటీ పడ్డాయి. విజేతల వివరాలను కళాశాల ప్రిన్సిపల్, టోర్నమెంట్ ఛైర్మన్ డాక్టర్ గుత్తా ప్రసాద్ వెల్లడించారు. పురుషుల విభాగంలో వాలీబాల్లో రాజమండ్రి, సూరంపాలెం కళాశాలలు ప్రథమ, ద్వితీయ స్థానాలను, కబడ్డీలో పరిటాల, గుడ్లవల్లేరు జట్లు, టేబుల్టెన్నిస్లో కాకినాడ, తాడేపల్లిగూడెం, బాల్బ్యాడ్మింటన్లో గుడ్లవల్లేరు, విజయవాడ, మహిళా విభాగంలో వాలీబాల్లో గుడ్లవల్లేరు, గుంటూరు, కబడ్డీలో గుడ్లవల్లేరు, కాకినాడ, టేబుల్టెన్నిస్లో విశాఖపట్నం, గుడ్లవల్లేరు, బాల్బ్యాడ్మింటన్లో గుడ్లవల్లేరు, విశాఖపట్నం జట్లు వరుసగా ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించినట్లు ఆయన వెల్లడించారు. విజేతలకు ట్రోఫీలను ప్రిన్సిపల్ ప్రసాద్, వైస్ ప్రిన్సిపల్స్ డాక్టర్ పి.కోదండరామారావు, డాక్టర్ ఎంఆర్సీహెచ్.శాస్త్రి, విద్యా డైరెక్టర్ డాక్టర్ బి.కరుణకుమార్, యాజమాన్య సలహాదారు డాక్టర్ పి.రవీంద్రబాబు తదితరులు అందజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీకో దండం.. మీతో ఉండం
[ 29-03-2024]
మచిలీపట్నం నగరపాలిక పరిధిలో 12 మంది వాలంటీర్లు ఈ నెలలోనే తమ రాజీనామాలను కమిషనర్కు సమర్పించారు. 39వ వార్డులో ఆరుగురు, 20వ వార్డులో నలుగురు, 7, 47వ వార్డుల్లో ఒక్కొక్కరు చొప్పున వైదొలగారు. -
అంతా అన్నారు.. కొంతే కొన్నారు!
[ 29-03-2024]
దివిసీమలో ఖరీఫ్ ఆలస్యంగా సాగు చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే కోతలు కోస్తున్నారు. నూర్పిళ్లు చేస్తున్నారు. -
ఆత్మీయ అతిథికి అపూర్వ స్వాగతం
[ 29-03-2024]
సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ గురువారం కృష్ణా జిల్లాలో పర్యటించారు. -
తమ్ముళ్లూ.. మీరే మా బలం
[ 29-03-2024]
పోరాట పటిమ చూపి రానున్న ఎన్నికల్లో తెదేపా విజయానికి కృషి చేయాలని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. -
‘తుస్సుమన్న జగన్ బస్సు యాత్ర’
[ 29-03-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర తుస్సుమందని.. డబ్బులిచ్చినా, బిర్యానీలు పెట్టినా ఎవరూ రావడం లేదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. -
దూసుకొస్తున్నాయ్.. జాగ్రత్తమ్మా!
[ 29-03-2024]
రెప్పపాటులో దూసుకొచ్చే వాహనాలు.. ఆదమరచి రోడ్డుపైనే ఆడుకునే చిన్నారులు.. రోడ్డు దాటాలా వద్దా అని తటపటాయించి ఒక్కసారిగా పరిగెత్తే విద్యార్థులు.. -
వైకాపా నేతల కనుసన్నల్లో.. అర్ధరాత్రి ఇసుక అక్రమ తవ్వకాలు
[ 29-03-2024]
అనుమతులు లేని తవ్వకాలపై ప్రజలు ఆందోళనకు దిగినా.. జాతీయ హరిత ట్రైబ్యునల్కు ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకునే నాథుడే లేరు. -
అంతర జిల్లా ద్విచక్ర వాహనాల దొంగ అరెస్టు
[ 29-03-2024]
జల్సాలకు అలవాటుపడి వివిధ జిల్లాల్లో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతూ వాటిని విక్రయిస్తున్న దొంగను పట్టుకొని 37 ద్విచక్ర వాహనాలను తోట్లవల్లూరు పోలీసులు పట్టుకున్నారని కృష్ణా జిల్లా ఎస్పీ నయీం అస్మి తెలిపారు. -
నిశిత తనిఖీలు
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నగదు, మద్యం, గంజాయి తదితరాల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. -
కోడ్ ఉల్లంఘించి.. వైకాపా నేతల వేడుకలు
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా.. వైకాపా నేతల ఉల్లంఘనలు యథేచ్ఛగా సాగుతున్నాయి. -
‘అతడి ఆత్మహత్యాయత్నానికి కారకులెవరు..?’
[ 29-03-2024]
ఓ మనిషి ప్రాణం తీసుకునేలా ప్రేరేపించడం దారుణం. న్యాయం కోసం వస్తే కంచె చేను మేసిన చందంగా రక్షించాల్సిన వారే అతడి ఆత్మహత్యాయత్నానికి కారణం కావడం శోచనీయం. -
ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
[ 29-03-2024]
జిల్లాలోని గంపలగూడెం మండలం పెదకొమిర, రెడ్డిగూడెం మండలం మద్దులపర్వలోని ఆదర్శ పాఠశాలల్లో ప్రథమ ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాళ్లు ఆర్.శైలజ, ఎ.వీరరాజు గురువారం తెలిపారు.