పన్నుల సొమ్మూ విద్యుత్తు బకాయిలకేనా?
జిల్లాలోని పంచాయతీల్లో ఇంటి పన్నుల వసూళ్ల లక్ష్యం రూ.78 కోట్ల వరకూ ఉండగా ఇప్పటికే 63 శాతానికి పైగా వసూలు చేశారు.
జిల్లా పంచాయతీ కార్యాలయం
కలెక్టరేట్(మచిలీపట్నం), న్యూస్టుడే: జిల్లాలోని పంచాయతీల్లో ఇంటి పన్నుల వసూళ్ల లక్ష్యం రూ.78 కోట్ల వరకూ ఉండగా ఇప్పటికే 63 శాతానికి పైగా వసూలు చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఒకరోజులో ముగుస్తుండగా మిగిలిన రూ.27 కోట్ల వసూళ్లపై దృష్టి సారించారు.అయితే తాము ఇంత కష్టపడి పన్నులు వసూలు చేసినా తమకు ఒరిగేదేమీ ఉండదని , పన్నుల రూపంలో వచ్చిన మొత్తాన్ని విద్యుత్తు బకాయిలకు సర్దుబాటు చేస్తారేమోనన్న భయం సర్పంచులను వెంటాడుతోంది.
జిల్లాలోని 497 పంచాయతీలకు సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను వసూళ్ల లక్ష్యం 78.05 కోట్లుగా ఉంది. ఇందులో గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బకాయిలు రూ.25.59 కోట్లు. పంచాయతీలకు స్థానికంగా సమకూరే ఆదాయంలో ఇంటి పన్నులే కీలకం. గతంలో ఈ ఆదాయంతోనే పరిపాలనా పరమైన అవసరాలు తీర్చుకోవాల్సి వచ్చింది. కేంద్ర ఆర్థిక సంఘ నిధులు నేరుగా పంచాయతీలకు జమ చేస్తున్నప్పటి నుంచి అభివృద్ధి పనులు చేపట్టే విషయంలో పంచాయతీలకు ఆర్థిక పరిపుష్ఠి లభించింది. గడచిన రెండు సంవత్సరాలుగా ఆర్థిక సంఘ నిధులను రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు బకాయిల రూపంలో దారి మళ్లిస్తుండటంతో ఎప్పటికప్పుడు ఖజానాలు ఖాళీ అవుతున్నాయి. అత్యధిక శాతం పంచాయతీల్లో గడచిన నాలుగేళ్లగా అభివృద్ధి పనుల ఊసే లేకపోగా కొన్ని పంచాయతీలు పారిశుద్ధ్య కార్మికులకు సైతం జీతాలు చెల్లించలేని స్థితిలో ఉన్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో కనీసం ఇంటి పన్నుల ద్వారా వచ్చే ఆదాయం ద్వారా కనీసం ఒకట్రెండు పనులైనా చేసి తమ పరువు నిలుపుకోవాలనే ఆలోచన పలువురు సర్పంచుల్లో వ్యక్తమవుతోంది.
సర్పంచుల ఆవేదన
గత ఏడాదితో పోలిస్తే పన్ను వసూళ్ల పరిస్థితి మెరుగ్గా ఉన్నా సర్పంచుల్లో మాత్రం ఆందోళన వ్యక్తమవుతోంది. గ్రామస్థులను ఒత్తిడి చేసి పన్నులు కట్టించినా పంచాయతీలకు ఒరిగేది ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇటీవలే జిల్లా పంచాయతీ అధికారులు పంచాయతీ సాధారణ నిధుల నుంచి విద్యుత్తు బకాయిలు చెల్లించాలంటూ కార్యదర్శులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. అన్ని పంచాయతీల మీద ఇంకా రూ.150 కోట్లకు పైగా బకాయిలున్న దృష్ట్యా వాటి చెల్లింపులపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు. దీంతో మొత్తం వసూలైన పన్నుల మొత్తాన్ని కూడా విద్యుత్తు బకాయిలకు సర్దుబాటు చేస్తారన్న భయం వారిని వెంటాడుతోంది.
లక్ష్యాలు నిర్దేశించి..
ఇంటి పన్నుల వసూలు విషయంలో జిల్లా ఉన్నతాధికారులు గడచిన మూడు నెలలుగా కార్యదర్శులపై ఒత్తిడి పెంచుతున్నారు. నెల వారీ లక్ష్యాలు నిర్దేశించి సమీక్షల ద్వారా కార్యదర్శులను పరుగులు పెట్టించారు. ఇంటి పన్ను, గ్రంథాలయ పన్నుకు సంబంధించిన డిమాండ్ రూ.52.77 కోట్లలో 66.64 శాతం, చేపల చెరువులు, దుకాణ లైసెన్స్లు, కుళాయిలు తదితర నాన్ట్యాక్స్ డిమాండ్ రూ.25.28 కోట్లలో 61.24 శాతం వసూలు చేశారు. జిల్లా మొత్తం మీద ఇప్పటికి రమారమి 150కు పైగా పంచాయతీల్లో నూరు శాతం లక్ష్యం సాధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయవాడ తూర్పులో వైకాపాకు షాక్.. తెదేపా గూటికి ఎంవీఆర్ చౌదరి
[ 23-04-2024]
తూర్పు నియోజకవర్గంలో వైకాపాకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు వైకాపా నాయకులు -
పేరుకే ఆర్టీసీ గ్రూప్.. అంతా వైకాపా భజనే
[ 23-04-2024]
తాను ఆర్టీసీ జోనల్ ఛైర్పర్సన్గా ఉన్న సమయంలో ఆర్టీసీ అధికారులు, యూనియన్ నాయకులతో ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్లో వైకాపా నాయకురాలు తాతినేని పద్మావతి పార్టీకి సంబంధించిన వీడియోలు, చిత్రాలు, కార్యక్రమాలను పోస్టు చేస్తున్నారు. -
గెలుపు వాకిట పసుపు తోరణం
[ 23-04-2024]
ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు మయం.. తెలుపు, కాషాయం జెండాలతో రంగుల హరివిల్లు..! నినాదాలతో హోరెత్తిన నియోజకవర్గాలు.. జై చంద్రబాబు, పవన్ కల్యాణ్, మోదీ అని దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు. -
పదిలో.. మళ్లీ పదకొండే
[ 23-04-2024]
పదోతరగతి ఫలితాల్లో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కృష్ణా మళ్లీ 11వ స్థానానికే పరిమితమైంది. కృష్ణాలో గతేడాది కంటే ఉత్తీర్ణత శాతం మెరుగైనా.. -
రూ.3వేలు పెంచి.. సంక్షేమం రద్దు చేసి
[ 23-04-2024]
ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో తీసుకుంటే దాన్ని మోసం అంటాము. కానీ సీఎం జగన్ దాన్ని సాయం అని చెప్పుకుంటూ ఊదరగొడుతున్నారు. -
బుద్ధప్రసాద్ నామపత్రం దాఖలు
[ 23-04-2024]
అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. -
‘కూటమి’ కోసం కదలిన కోలవెన్ను
[ 23-04-2024]
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే ప్రసాద్, బందరు జనసేన ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరికి మద్దతుగా రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్, తెదేపా నాయకుడు తుమ్మల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి -
ఫోర్జరీ సంతకాలతో డబ్బులు డ్రా
[ 23-04-2024]
-
జీతాలు అందక.. జీవనం గడవక
[ 23-04-2024]
ఒప్పంద/పొరుగు సేవల విధానంలో పని చేస్తున్న ఉద్యోగుల పట్ల వైకాపా ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. పొరుగు సేవల ఉద్యోగులు, పలువురు ఒప్పంద ఉద్యోగులకు ప్రతి నెలా సక్రమంగా జీతాలు అందని పరిస్థితి ఏర్పడింది. -
పదిలో అద్భుత ప్రతిభ
[ 23-04-2024]
విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్టుడే: ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రతిభతో మెరిశారు. -
వెలంపల్లీ..హామీ..చేసిందేమీ..
[ 23-04-2024]
భవానీపురం పరిధిలో సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు చెప్పిన మాటలు నీటి మూటలుగానే మిగిలాయి. -
‘అరాచక పాలకులను సాగనంపాలి’
[ 23-04-2024]
అరాచక పాలకులను ప్రజలు సాగనంపాలని ఎన్డీయే విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. -
పేదింట విరిసిన విద్యాకుసుమాలు
[ 23-04-2024]
తల్లిదండ్రుల పేదరికం చిన్నారుల ప్రతిభకు ఆటంకం కాదు అని దళవాయి సుబ్బరామయ్య మున్సిపల్ హైస్కూల్ పదో తరగతి విద్యార్థినులు నిరూపించారు. సోమవారం వెల్లడైన ఫలితాల్లో మంచి ప్రతిభ చటారు. -
నన్ను చంపేందుకు వైకాపా నేతల కుట్ర
[ 23-04-2024]
వైకాపా నేతలు తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని తిరువూరు తెదేపా అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఆరోపించారు. సోమవారం నామినేషన్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. -
28 మంది అభ్యర్థులు... 31 నామపత్రాలు
[ 23-04-2024]
మచిలీపట్నం పార్లమెంట్ స్థానంతో పాటు జిల్లాలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సోమవారం 28 మంది అభ్యర్థులు నామపత్రాలు అందజేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM