రమ్మంటారు.. వస్తే ఉండరు!
జిల్లా ఆసుపత్రి సర్వజన ఆసుపత్రిగా వర్గోన్నతి చెందడంతో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుతాయని అందరు భావిస్తుంటే ఉన్నవి కూడా సక్రమంగా అందక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మచిలీపట్నం సర్వజన ఆసుపత్రిలో ఆగిన సదరం సేవలు
ఇబ్బందులు పడుతున్న రోగులు
ఆసుపత్రిలోని వ్యాధి నిర్ధారణ పరీక్ష కేంద్రం
మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్టుడే: జిల్లా ఆసుపత్రి సర్వజన ఆసుపత్రిగా వర్గోన్నతి చెందడంతో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుతాయని అందరు భావిస్తుంటే ఉన్నవి కూడా సక్రమంగా అందక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రిని అభివృద్ధి చేసే క్రమంలో పలు సేవలు నిలిపివేశారు. వాటిలో ఒక్కొక్కటిగా పునరుద్ధరించినా ఇంకా సదరం సేవలు ప్రారంభించలేదు. ఆన్లైన్లో నమోదు చేసుకున్నవారికి మాత్రం యథావిధిగా తేదీలు కేటాయించడంతో దూర ప్రాంతాలనుంచి వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రెండు నెలలుగా నిలిచిన సేవలు
ఆసుపత్రిలో మానసిక, ఆర్ధో, కంటి, చెవి విభాగాలకు సంబంధించి సదరం సేవలు అందుబాటులో ఉన్నాయి. వారంలో మంగళవారం, శుక్రవారం రెండు రోజులపాటు శిబిరం జరుగుతుంది. సర్వజన ఆసుపత్రిగా వర్గోన్నతి కల్పించడంతో అంతకు ముందు వైద్యవిధానపరిషత్ పరిధిలో విధులు నిర్వహించిన వివిధ విభాగాల వైద్యులు అందరినీ ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. అప్పటినుంచి సేవలు నిలిచిపోయాయి. వారి స్థానంలో కొత్త వైద్యులను నియమించడంతో వైద్యపరమైన సేవలు అందిస్తున్నా సదరం శిబిరం ప్రారంభం కాలేదు. కొత్తగా నియమితులైన వైద్యులకు డిజిటల్ టోకెన్ల పంపిణీ పూర్తికాకపోవడంతోనే ఈసమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయితేనే వారు పరీక్షలు నిర్వహించి వైకల్య ధ్రువీకరణ పత్రం జారీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఉన్నతాధికారులకు తెలిసినా ఇంతవరకు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. టోకెన్లు కేటాయించే క్రమంలో ఒక్కో వైద్యుడు రూ.1300ల నగదు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని తరువాత ప్రభుత్వపరంగా వైద్యులకు తిరిగి ఇస్తారు. దీనిని చెల్లించడానికి కూడా కొందరు వైద్యులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు.
రోగుల ఇక్కట్లు
సేవలు నిలిచినా ఆన్లైన్లో నమోదు చేసుకున్న వారికి ఫలానా తేదీల్లో మచిలీపట్నం ఆసుపత్రికి వెళ్లాలన్నా సందేశాలు వస్తున్నాయి. దీంతో ఆయా విభాగాలకు చెందిన వారు తమకు నిర్దేశించిన రోజుల్లో ఆసుపత్రికి వచ్చి ఉసూరు మంటూ వెనుదిరిగి వెళుతున్నారు. శిబిరానికి వచ్చే వారందరూ వివిధ వైకల్యాలకు సంబంధించినవారే. వారిని ఆసుపత్రికి తీసుకురావాలంటే కుటుంబ సభ్యులు కూడా తోడు రావాలి. ఇలా అనేకమంది వాహనాలను బాడుగకు తీసుకుని వచ్చి సేవలు నిలిచిపోయాయని తెలుసుకుని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అదే విషయాన్ని ముందుగానే సమాచారం ఇస్తే ఇక్కడవరకు రావాల్సిన అవసరం ఉండదుకదా అని ప్రశ్నిస్తున్నారు. గడచిన మంగళవారం కూడా పామర్రుతోపాటు వివిధ ప్రాంతాలనుంచి అనేకమంది ఆసుపత్రికి వచ్చి వెనుదిరిగి వెళ్లారు. కొన్ని వారాలుగా ఇదే పరిస్థితి నెలకొంది. అయినా అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఎప్పటికి అందుబాటులోకి వస్తాయో కూడా అధికారులు స్పష్టత ఇవ్వడం లేదని వాపోతున్నారు. మళ్లీ ఎప్పుడు రావాలో... ఇంకెన్ని నెలలకు పరీక్షలు నిర్వహిస్తారో... ధ్రువపత్రాలు ఎప్పటికి వస్తాయో తెలియక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వచ్చి తిరిగివెళ్తున్నా
- గోవిందరాజులు, కారకంపాడు, మొవ్వ మండలం
గతంలో నాకు ధ్రువపత్రం జారీ చేశారు. అందులో తప్పులు ఉన్నాయని, సరిచేసుకురావాలని చెబితే ఇక్కడి వచ్చాను. అందుబాటులో ఎవరూ లేరు తరువాత రావాలని చెప్పారు. ఎప్పుడు రావాలో కూడా స్పష్టత ఇవ్వడం లేదు. నాలాగా పరీక్షల కోసమని వచ్చి వెళ్లిపోయారు. అధికారులు చొరవ తీసుకుని సాధ్యమైనంత త్వరగా సేవలు ప్రారంభించాలని కోరుతున్నాం.
త్వరలోనే ప్రారంభిస్తాం
- రామచంద్రరావు, ఆర్ఎంవో, సర్వజన ఆసుపత్రి
అందరూ కొత్త వైద్యులు కావడంతో డిజిటల్ టోకెన్స్ జారీలో కొంత ఆలస్యమైంది. ఆ సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకున్నాం. సాధ్యమైనంతవరకు వచ్చేవారంలోనే సదరం సేవలు తిరిగి ప్రారంభిస్తాం. రోగులు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం. ధ్రువపత్రాలను కూడా వేగవంతంగా జారీ చేసేందుకు కార్యాచరణ చేపట్టాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ షాకులు.. జనం కేకలు!
[ 24-04-2024]
విద్యుత్తు సర్దుబాటు ఛార్జీల రూపంలో జగన్ వేసిన దొంగ దెబ్బకు ప్రజలు అల్లాడిపోతున్నారు. పేరుకు ఛార్జీలు పెంచలేదంటూనే.. దొడ్డిదారిన వడ్డిస్తున్న ట్రూఅప్ బాదుడు మామూలుగా లేదు. -
తవ్వుకో.. దండుకో!
[ 24-04-2024]
పెడన నియోజకవర్గంలో అక్రమ ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగిపోతోంది. పెడనతో పాటు గూడూరు, కృత్తివెన్ను మండలాల్లో అక్రమార్కులు ఇసుక తవ్వకాలను నిరాటంకంగా సాగిస్తున్నారు. -
పేర్ని కిట్టూ నామినేషన్ దాఖలు
[ 24-04-2024]
మచిలీపట్నం అసెంబ్లీ స్థానానికి వైకాపా అభ్యర్థిగా పేర్ని వాకా సాయికృష్ణమూర్తి(కిట్టూ) అట్టహాసంగా నామినేషన్ వేశారు. -
ప్రతిభ చాటిన విద్యార్థినులకు సన్మానం
[ 24-04-2024]
స్థానిక తోటమూల భట్ట మోహనరావు, హైమావతి జిల్లా పరిషత్తు హైస్కూలు విద్యార్థులు తొలిసారిగా మంచి ఫలితాలు సాధించారని ఎంఈవో-2 వైవీ హరినాథ్ అన్నారు. -
ఏటా కొలువులన్నారు.. ఏమార్చారు
[ 24-04-2024]
రాష్ట్రంలో 2.50 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని నిరుద్యోగులకు కల్లబొల్లి మాటలు చెప్పి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇప్పటి వరకూ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలంటూ నిరుద్యోగులు, వివిధ సంఘాల నాయకులు కోరుతున్నారు. -
ఒక్క ఎస్సీకైనా అవకాశమిచ్చారా జగన్?
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్ కార్యాలయంలో ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగి అయినా గత ఐదు సంవత్సరాలలో పనిచేశారా అని మచిలీపట్నం పార్లమెంటు అభ్యర్థి వల్లభనేని బాలశౌరి ప్రశ్నించారు. -
22 మంది అభ్యర్థులు...28 నామపత్రాలు
[ 24-04-2024]
జిల్లాలోని పార్లమెంట్తో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మంగళవారం 22 మంది అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు. -
అయిదేళ్లుగా.. రెండు పిల్లర్లు వేయలేదు!
[ 24-04-2024]
ఉట్టికెగరలేని అమ్మ.. ఆకాశానికి ఎగురుతానన్నదట.. అలాగే ఉంది వైకాపా ప్రభుత్వ తీరు. అయిదేళ్లలో రెండు పిల్లర్లు నిర్మించడం చేతకాలేదు కానీ.. అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ బిల్డప్లు ఇస్తుంటారు. -
కార్లు, స్థలాల పేరుతో రూ.కోట్లు స్వాహా
[ 24-04-2024]
విజయవాడ పరిసర ప్రాంతాల్లో తక్కువ ధరకు కార్లు, స్థలాలు ఇప్పిస్తానంటూ రూ.కోట్లు స్వాహా చేసిన కేటుగాడిని పెనమలూరు పోలీసులు అరెస్టు చేశారు. -
రైల్వేస్టేషన్లో రూ.20కే నాణ్యమైన భోజనం
[ 24-04-2024]
వేసవి రైలు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఐఆర్సీటీసీతో కలిసి తక్కువ ధరకే నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు ఎకానమీ మీల్స్ పేరుతో విజయవాడ రైల్వే అధికారులు కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. -
అదనపు పని భారంతో సిబ్బంది సతమతం
[ 24-04-2024]
ఏటా జాబ్ క్యాలెండర్ వేస్తాం. భారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తాం. యువతకు ఉపాధి కల్పిస్తామని.. సీఎం జగన్మోహన్రెడ్డి ఊదరగొట్టారు. అయిదేళ్లు గడిచాయి. ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా వేయలేదని నిరుద్యోగులు మండిపడుతున్నారు. -
పాత బూత్ల ముద్రణతో ఓటరు స్లిప్పుల పంపిణీ
[ 24-04-2024]
అధికార వైకాపా ఓటర్లను తప్పుదోవ పట్టిస్తోంది. ఓటరు స్లిప్పులను పోలింగ్ అధికారులు పంపిణీ చేయాల్సి ఉండగా, ముందస్తుగానే వాటి పంపిణీని చేపట్టింది. -
సింహ వాహనంపై ఆది దంపతులు
[ 24-04-2024]
చైత్రమాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదిదంపతులకు సింహ వాహన సేవను దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో రుత్వికులు శోభాయమానంగా మంగళవారం నిర్వహించారు. -
ముఖ్యమంత్రి మాట.. నీటి మూట
[ 24-04-2024]
అవనిగడ్డ - నాగాయలంక ప్రధాన రహదారిపై ఉన్న డంపింగ్ యార్డు తరలింపు ఆవశ్యకతను ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్బాబు 2022 అక్టోబరు 20న అవనిగడ్డ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్కు వివరించారు. -
జనంపై జగనన్న అదనపు బాదుడు
[ 24-04-2024]
విద్యుత్తు వినియోగదారులకు బిల్లులు షాక్ కొడుతున్నాయి. రీడింగ్ తీసేందుకు సిబ్బంది వస్తే చాలు ప్రజలు భయపడిపోతున్నారు. సర్ఛార్జీలు, విద్యుత్తు సుంకం, ఫిక్స్డ్, ట్రూఅప్, ఇతర ఛార్జీల పేరుతో వినియోగదారుడి ఇంటి బడ్జెట్ను ప్రభుత్వం తలకిందులు చేస్తోంది. -
గుడివాడ పసుపుమయం
[ 24-04-2024]
గుడివాడ పట్టణమంతా మంగళవారం పసుపుమయమైంది. ఎటువైపు చూసినా కనుచూపుమేరలో జనవాహిని కనిపించింది. ప్రత్యర్థి పార్టీల గుండెలదిరేలా ఎన్డీఏ కూటమి అభ్యర్థి వెనిగండ్ల రాము నామినేషన్కు జనం తరలి వచ్చారు.