మెరక పేరుతో... నిధుల మేత..!
మైలవరం నియోజకవర్గ పరిధిలో ఒక లేఔట్ మెరక పనులకు రూ.15 కోట్లు ప్రతిపాదించాలని ఓ మంత్రి సిఫార్సు. దీనికి మెరకతో పాటు అంతర్గత రహదారులు, కల్వర్టులు ఇతరత్రా పనులకు ప్రతిపాదనలు చేసినా రూ.6.5కోట్లు దాటలేదు.
పనులు చేయకుండానే బిల్లులు
జగనన్న లేఔట్లలో నిధుల దుర్వినియోగం
ఈనాడు, అమరావతి
కొండపల్లి జగనన్న కాలనీ
మైలవరం నియోజకవర్గ పరిధిలో ఒక లేఔట్ మెరక పనులకు రూ.15 కోట్లు ప్రతిపాదించాలని ఓ మంత్రి సిఫార్సు. దీనికి మెరకతో పాటు అంతర్గత రహదారులు, కల్వర్టులు ఇతరత్రా పనులకు ప్రతిపాదనలు చేసినా రూ.6.5కోట్లు దాటలేదు. ఏం నేను చెప్పిన మాట వినవా..? అంటూ ఎన్టీఆర్ జిల్లా అధికారిపై బదిలీ వేటు పడింది. ప్రస్తుతం కొత్త అధికారితో ప్రతిపాదనలకు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. జగనన్న లేఔట్ల పేరుతో నిధుల దుర్వినియోగానికి ఇదొక ఉదాహరణ మాత్రమే.
ఉమ్మడి జిల్లాలో ఇంతవరకు ఒక్క గృహ ప్రవేశం కాలేదు. ఒక్క జగనన్న కాలనీలోనూ మౌలిక వసతులు లేవు. కానీ మెరక పేరుతో రూ.కోట్లు ఖర్చయ్యాయి. అంతర్గత రహదారులు, కల్వర్టుల పేరుతో నిధులు మేసేశారు. తమకు అనుకూల అధికారులను నియమించుకుని ఇష్టానుసారంగా బిల్లులు చేశారు. అసలు పనులు చేయకుండానే నిధులు ఆవిరయ్యాయి. ఉగాది నాటికి ఉమ్మడి జిల్లాలో దాదాపు 22వేల కుటుంబాలతో సామూహిక గృహ ప్రవేశాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా నెరవేరక చేతులెత్తేశారు. ఇప్పటికే కొంత మంది లబ్ధిదారులు గృహాలను పూర్తి చేసుకుని మౌలిక వసతులు లేక ఇంటికి తాళాలు వేసుకున్నారు. నిర్మాణం పూర్తయినా ఉండలేని పరిస్థితి ఉందని వాపోతున్నారు. కొన్ని లేఔట్లలో ఒక్క గృహాన్ని ప్రారంభించలేదు. మరోవైపు సివిల్ పనుల పేరుతో నిధులను మేస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో 82,823 గృహాలకు కేవలం 7,258 పూర్తయ్యాయి. మార్చి నాటికి ఇవి 9వేలకు చేరుకున్నట్లు చెబుతున్నారు. ఏప్రిల్లో సామూహిక గృహప్రవేశాలు ఉంటాయని చెబుతున్నారు. మరోవైపు ఇంకా మెరక పేరుతో నిధులు కుమ్మరిస్తున్నారు. లేఔట్లు మాత్రం మెరక కావడం లేదు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద నిధులు కరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు రూ.100 కోట్ల వరకు కేవలం మెరక పనుల కోసం ఖర్చు చేశారు. గన్నవరం నియోజకవర్గంలో దాదాపు నాలుగైదు కొండలు కరిగిపోయాయి.
* కృష్ణా జిల్లాలో ఉన్న గృహ నిర్మాణ ప్రాజెక్టు డైరెక్టర్ను ప్రధాన కార్యాలయానికి పంపారు. డిప్యుటేషన్పై ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న ఆయన వేతనం మాత్రం కృష్ణా జిల్లా పీడీగా తీసుకుంటున్నారు. ఆయన స్థానంలో డ్వామా పీడీ సూర్యనారాయణకు అదనపు బాధ్యతలు అప్పగించారు.
* ఎన్టీఆర్ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ను పదవీ విరమణ మూడు నెలల ముందు బదిలీ చేశారు. ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేశారు. ఆమె స్థానంలో అనంతపురంలో పీడీగా నియమించిన రజినీకుమారిని నియమించారు. ఆమె అనంతపురంలో వేతనం పొందుతూ ఇక్కడ డిప్యుటేషన్పై పనిచేస్తున్నారు. ఇంత మతలబు ఎందుకనేదే అర్థం కాని ప్రశ్న.
* ఎన్టీఆర్ జిల్లాకు కృష్ణా జిల్లా డ్వామా పీడీ సూర్యనారాయణ నిధులు మంజూరు చేయాల్సి ఉంది. దీంతో ఆయనను హౌసింగ్ ఇన్ఛార్జి పీడీగా నియమించినట్లు చెబుతున్నారు.
* ఎన్టీఆర్ జిల్లాలో 80 లేఔట్లు చదునుకు రూ.50 కోట్లు ఉపాధి నిధులు ఖర్చయ్యాయి. కేవలం మెరక పనులకే వెచ్చించినట్లు నమోదు చేశారు. కానీ వణుకూరులో పొలాల్లోనే లేఔట్లు ఉన్నాయి. మెట్ట ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన లేఔట్ల మెరక పనులు చేయలేదు. కానీ గ్రావెల్ తరలిపోయింది.
* ఎన్టీఆర్ జిల్లాలో అప్రోచ్ రోడ్లు, లేఔట్ రోడ్లు కలిపి మొత్తం రూ.588.60 కోట్లు ఖర్చు చేశారు. ఇంకా 162 పనులు జరుగుతున్నాయి. ఎన్ఆర్ఈజీఎస్ కింద రూ.5 లక్షల చొప్పున విడగొట్టి నేతలకు పనులను అప్పజెప్పారు. నామమాత్రంగా పనులు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
[ 29-03-2024]
పెండింగ్లో ఉన్న 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను తెదేపా ప్రకటించింది. -
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
[ 29-03-2024]
రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదు.. ప్రజలకు సేవచేయడమని ఎన్టీఆర్ నిరూపించారని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు, నేతలకు ఎక్స్(ట్విటర్) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. -
మీకో దండం.. మీతో ఉండం
[ 29-03-2024]
మచిలీపట్నం నగరపాలిక పరిధిలో 12 మంది వాలంటీర్లు ఈ నెలలోనే తమ రాజీనామాలను కమిషనర్కు సమర్పించారు. 39వ వార్డులో ఆరుగురు, 20వ వార్డులో నలుగురు, 7, 47వ వార్డుల్లో ఒక్కొక్కరు చొప్పున వైదొలగారు. -
అంతా అన్నారు.. కొంతే కొన్నారు!
[ 29-03-2024]
దివిసీమలో ఖరీఫ్ ఆలస్యంగా సాగు చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే కోతలు కోస్తున్నారు. నూర్పిళ్లు చేస్తున్నారు. -
ఆత్మీయ అతిథికి అపూర్వ స్వాగతం
[ 29-03-2024]
సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ గురువారం కృష్ణా జిల్లాలో పర్యటించారు. -
తమ్ముళ్లూ.. మీరే మా బలం
[ 29-03-2024]
పోరాట పటిమ చూపి రానున్న ఎన్నికల్లో తెదేపా విజయానికి కృషి చేయాలని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. -
‘తుస్సుమన్న జగన్ బస్సు యాత్ర’
[ 29-03-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర తుస్సుమందని.. డబ్బులిచ్చినా, బిర్యానీలు పెట్టినా ఎవరూ రావడం లేదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. -
దూసుకొస్తున్నాయ్.. జాగ్రత్తమ్మా!
[ 29-03-2024]
రెప్పపాటులో దూసుకొచ్చే వాహనాలు.. ఆదమరచి రోడ్డుపైనే ఆడుకునే చిన్నారులు.. రోడ్డు దాటాలా వద్దా అని తటపటాయించి ఒక్కసారిగా పరిగెత్తే విద్యార్థులు.. -
వైకాపా నేతల కనుసన్నల్లో.. అర్ధరాత్రి ఇసుక అక్రమ తవ్వకాలు
[ 29-03-2024]
అనుమతులు లేని తవ్వకాలపై ప్రజలు ఆందోళనకు దిగినా.. జాతీయ హరిత ట్రైబ్యునల్కు ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకునే నాథుడే లేరు. -
అంతర జిల్లా ద్విచక్ర వాహనాల దొంగ అరెస్టు
[ 29-03-2024]
జల్సాలకు అలవాటుపడి వివిధ జిల్లాల్లో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతూ వాటిని విక్రయిస్తున్న దొంగను పట్టుకొని 37 ద్విచక్ర వాహనాలను తోట్లవల్లూరు పోలీసులు పట్టుకున్నారని కృష్ణా జిల్లా ఎస్పీ నయీం అస్మి తెలిపారు. -
నిశిత తనిఖీలు
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నగదు, మద్యం, గంజాయి తదితరాల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. -
కోడ్ ఉల్లంఘించి.. వైకాపా నేతల వేడుకలు
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా.. వైకాపా నేతల ఉల్లంఘనలు యథేచ్ఛగా సాగుతున్నాయి. -
‘అతడి ఆత్మహత్యాయత్నానికి కారకులెవరు..?’
[ 29-03-2024]
ఓ మనిషి ప్రాణం తీసుకునేలా ప్రేరేపించడం దారుణం. న్యాయం కోసం వస్తే కంచె చేను మేసిన చందంగా రక్షించాల్సిన వారే అతడి ఆత్మహత్యాయత్నానికి కారణం కావడం శోచనీయం. -
ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
[ 29-03-2024]
జిల్లాలోని గంపలగూడెం మండలం పెదకొమిర, రెడ్డిగూడెం మండలం మద్దులపర్వలోని ఆదర్శ పాఠశాలల్లో ప్రథమ ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాళ్లు ఆర్.శైలజ, ఎ.వీరరాజు గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు