పది పరీక్షలకు భద్రతా ఏర్పాట్లు: డీఈవో
పది పరీక్షలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా విద్యాశాఖాధికారి తాహెరా సుల్తానా అన్నారు.
గంగాధరపురంలో విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేస్తున్న ఆర్జేడీ నాగమణి
మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్టుడే: పది పరీక్షలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా విద్యాశాఖాధికారి తాహెరా సుల్తానా అన్నారు. శుక్రవారం మచిలీపట్నంలోని డీఈవో కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె పరీక్షల నిర్వహణకు తీసుకుంటున్న వివరాలు వెల్లడించారు. ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లాలో మొత్తం 22,436మంది పరీక్షలకు హాజరవుతారని వారిలో 12,048 మంది బాలురు, 10,388మంది బాలికలు ఉన్నారని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 143 కేంద్రాలు ఎంపిక చేశామని, 143మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 143మంది డిపార్ట్మెంటల్ అధికారులను నియమించామన్నారు. పరీక్షల సామగ్రి పంపిణీకి పది రూట్లు గుర్తించి 10మంది రూట్ అధికారులు, మరో 10మంది అదనపు రూట్ అధికారులకు బాధ్యతలు కేటాయించినట్లు తెలిపారు. బంటుమిల్లి మండలంలోని పెదతుమ్మిడి, గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు, కంకిపాడు మండలంలోని పునాదిపాడు, ఘంటసాల మండలంలోని శ్రీకాకుళం కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. కేంద్రాల్లోకి చరవాణులు తీసుకెళ్లకూడదని, విధులు కేటాయించిన సిబ్బంది అందరికీ గుర్తింపు కార్డులు జారీ చేశామని, వారికి తప్ప లోపలికి ఎవరినీ అనుమతించబోమన్నారు. ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరగనుండగా, 8.30 నుంచే కేంద్రంలోకి అనుమతిస్తామని చెప్పారు. విద్యార్థులు హాల్టికెట్ చూపించి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు.ఏవైనా సమస్యలు ఉంటే ఈ ఫోన్ నెంబర్లలో (9848232601, 9966753718, 9848530928) సంప్రదించాలని కోరారు.
గుడివాడ(నెహ్రూచౌక్),న్యూస్టుడే: గుడివాడ పట్టణం, మండలంలోని చౌటపల్లి, గంగాధరపురం, మోటూరులోని పదో తరగతి పరీక్ష కేంద్రాలను ఆర్జేడీ నాగమణి, డీఈవో తాహెరా సుల్తానా శుక్రవారం పరిశీలించారు. పరీక్ష ఏర్పాట్లపై స్థానిక ఎస్పీఎస్ పాఠశాలలో ఆమె తనిఖీ చేశారు. గంగాధరపురం ఉన్నత పాఠశాలలో పిల్లల అభ్యాసన, పఠనా సామర్థ్యం తదితర విషయాలను అంచనా వేశారు. ఎంఈవో బీఎస్సీ శేఖర్ సింగ్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయవాడ తూర్పులో వైకాపాకు షాక్.. తెదేపా గూటికి ఎంవీఆర్ చౌదరి
[ 23-04-2024]
తూర్పు నియోజకవర్గంలో వైకాపాకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు వైకాపా నాయకులు -
పేరుకే ఆర్టీసీ గ్రూప్.. అంతా వైకాపా భజనే
[ 23-04-2024]
తాను ఆర్టీసీ జోనల్ ఛైర్పర్సన్గా ఉన్న సమయంలో ఆర్టీసీ అధికారులు, యూనియన్ నాయకులతో ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్లో వైకాపా నాయకురాలు తాతినేని పద్మావతి పార్టీకి సంబంధించిన వీడియోలు, చిత్రాలు, కార్యక్రమాలను పోస్టు చేస్తున్నారు. -
గెలుపు వాకిట పసుపు తోరణం
[ 23-04-2024]
ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు మయం.. తెలుపు, కాషాయం జెండాలతో రంగుల హరివిల్లు..! నినాదాలతో హోరెత్తిన నియోజకవర్గాలు.. జై చంద్రబాబు, పవన్ కల్యాణ్, మోదీ అని దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు. -
పదిలో.. మళ్లీ పదకొండే
[ 23-04-2024]
పదోతరగతి ఫలితాల్లో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కృష్ణా మళ్లీ 11వ స్థానానికే పరిమితమైంది. కృష్ణాలో గతేడాది కంటే ఉత్తీర్ణత శాతం మెరుగైనా.. -
రూ.3వేలు పెంచి.. సంక్షేమం రద్దు చేసి
[ 23-04-2024]
ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో తీసుకుంటే దాన్ని మోసం అంటాము. కానీ సీఎం జగన్ దాన్ని సాయం అని చెప్పుకుంటూ ఊదరగొడుతున్నారు. -
బుద్ధప్రసాద్ నామపత్రం దాఖలు
[ 23-04-2024]
అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. -
‘కూటమి’ కోసం కదలిన కోలవెన్ను
[ 23-04-2024]
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే ప్రసాద్, బందరు జనసేన ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరికి మద్దతుగా రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్, తెదేపా నాయకుడు తుమ్మల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి -
ఫోర్జరీ సంతకాలతో డబ్బులు డ్రా
[ 23-04-2024]
-
జీతాలు అందక.. జీవనం గడవక
[ 23-04-2024]
ఒప్పంద/పొరుగు సేవల విధానంలో పని చేస్తున్న ఉద్యోగుల పట్ల వైకాపా ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. పొరుగు సేవల ఉద్యోగులు, పలువురు ఒప్పంద ఉద్యోగులకు ప్రతి నెలా సక్రమంగా జీతాలు అందని పరిస్థితి ఏర్పడింది. -
పదిలో అద్భుత ప్రతిభ
[ 23-04-2024]
విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్టుడే: ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రతిభతో మెరిశారు. -
వెలంపల్లీ..హామీ..చేసిందేమీ..
[ 23-04-2024]
భవానీపురం పరిధిలో సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు చెప్పిన మాటలు నీటి మూటలుగానే మిగిలాయి. -
‘అరాచక పాలకులను సాగనంపాలి’
[ 23-04-2024]
అరాచక పాలకులను ప్రజలు సాగనంపాలని ఎన్డీయే విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. -
పేదింట విరిసిన విద్యాకుసుమాలు
[ 23-04-2024]
తల్లిదండ్రుల పేదరికం చిన్నారుల ప్రతిభకు ఆటంకం కాదు అని దళవాయి సుబ్బరామయ్య మున్సిపల్ హైస్కూల్ పదో తరగతి విద్యార్థినులు నిరూపించారు. సోమవారం వెల్లడైన ఫలితాల్లో మంచి ప్రతిభ చటారు. -
నన్ను చంపేందుకు వైకాపా నేతల కుట్ర
[ 23-04-2024]
వైకాపా నేతలు తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని తిరువూరు తెదేపా అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఆరోపించారు. సోమవారం నామినేషన్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. -
28 మంది అభ్యర్థులు... 31 నామపత్రాలు
[ 23-04-2024]
మచిలీపట్నం పార్లమెంట్ స్థానంతో పాటు జిల్లాలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సోమవారం 28 మంది అభ్యర్థులు నామపత్రాలు అందజేశారు.
తాజా వార్తలు (Latest News)
-
డిన్నరేనా.. డ్యాన్స్ వద్దా?: షారుక్ఖాన్తో మోహన్లాల్
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..