మట్టి మాఫియా బరి తెగింపు
మట్టి మాఫియా బరి తెగించారు. పట్టపగలే టిప్పర్లు, పొక్లెయిన్లు తెచ్చుకొని చెరువు నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు.
చెరువు నుంచి అక్రమ తరలింపు
తెలిసినా నోరు మెదపని అధికారులు
దుర్గాదేవి చెరువులో గ్రావెల్ను టిప్పర్లో లోడు చేస్తున్న పొక్లెయిన్
వినగడప (గంపలగూడెం), న్యూస్టుడే: మట్టి మాఫియా బరి తెగించారు. పట్టపగలే టిప్పర్లు, పొక్లెయిన్లు తెచ్చుకొని చెరువు నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. అనుమతి లేకుండా మట్టి తరలిస్తున్నా రెవెన్యూ, నీటిపారుదల శాఖ (పీడబ్ల్యూడీ) అధికారులు నోరు మెదపడం లేదు. వైకాపాకు చెందిన గుత్తేదారు కావడంతో అధికారులు చేష్టలుడిగి కూర్చున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం వరకు రాత్రి వేళల్లో యంత్రాలతో గుట్టుచప్పుడు కాకుండా తరలించిన వైకాపా గుత్తేదారు తమనెవరూ ప్రశ్నించక పోవడంతో శుక్రవారం పట్టపగలే మట్టి తరలింపునకు సాహసించారు.
కొన్ని రోజులుగా సాగుతున్న వ్యవహారం
మండలంలోని వినగడప దుర్గాదేవి చెరువు నుంచి కొన్ని రోజులుగా రాత్రి వేళల్లో వైకాపాకు చెందిన గుత్తేదారు తన క్వారీకి చెందిన 2 పొక్లెయిన్లు, పదికిపైగా టిప్పర్లతో అక్రమంగా మట్టి తరలిస్తున్నారు. మొదట రహదారి మార్జిన్లకు పోసేందుకు ప్రారంభించి తర్వాత ఇతర ప్రాంతాలకు తరలించడం మొదలుపెట్టారు. చెరువులోని కొంత భాగంలో గ్రావెల్ లభ్యమైంది. ఇదే అదనుగా గుత్తేదారు తన నిర్మాణ పనుల అవసరాల మేరకు మట్టిని కొద్ది రోజులుగా అక్రమంగా బయటకు తరలిస్తున్నారు. పీడబ్ల్యూడీ అధికారులకు చెరువులపై అజమాయిషీ కొరవడింది. రెవెన్యూ అధికారులు తమకెందుకంటూ మిన్నకున్నారు. ఈ నేపథ్యంలో ఎవరూ తరలింపును ఆపడానికి సాహసించలేకపోయారు. దుర్గాదేవి చెరువులో గ్రావెల్, మట్టి తవ్వకాలకు అధికారికంగా ఎలాంటి అనుమతులు లేవు. దుర్గాదేవి చెరువు తెలంగాణకు సరిహద్దులో ఉండటంతో బరి తెగించారు. శుక్రవారం పట్టపగలే యంత్రాలు, టిప్పర్లతో మట్టి తరలిస్తుండటంతో బయటపడింది. దాదాపు 8 నుంచి 10 అడుగుల లోతుతో 200 అడుగుల మేరకు పొడవు, వెడల్పుతో గుంతలు తీసి మట్టి, గ్రావెల్ను తరలించడం గమనార్హం.
* దీనిపై న్యూస్టుడే, పీడబ్ల్యూడీ ఏఈ వి.కిశోర్ను సంప్రదించగా మండలంలోని ఏ చెరువులోనూ మట్టి తరలింపునకు ఎవరికీ అనుమతులు ఇవ్వలేదన్నారు. దుర్గాదేవి చెరువులో మట్టి, గ్రావెల్ అక్రమంగా తీసుకెళుతున్న సంగతి తనకు తెలియదన్నారు. తహసీల్దారు బాలకృష్ణారెడ్డిని సంప్రదించగా మట్టి అక్రమంగా తరలిస్తే యంత్రాలు, వాహనాలను స్వాధీనం చేసుకుంటామన్నారు. ఇదిలా ఉండగా చెరువులో మట్టి అక్రమంగా తరలిస్తున్న విషయం తన దృష్టికి రాలేదన్నారు.
అధికారులకు తెలిసినా పట్టించుకోలేదు
వినగడప, కొత్తపల్లికి చెందిన కొందరు వైకాపా నాయకులు, అధికారుల అండదండలతో వినగడప దుర్గాదేవి చెరువులో మట్టిని అధికార పార్టీకి చెందిన గుత్తేదారు అక్రమంగా తరలిస్తున్నారు. రేయింబవళ్లు చెరువులో పొక్లెయిన్లు, టిప్పర్లతో గ్రావెల్ తీసుకెళుతున్నా ఆయా శాఖల అధికారులు చోద్యం చూస్తున్నారు. ఒకవేళ అధికారులకు ఫిర్యాదు చేసినా, వారే అక్రమార్కులకు సమాచారం ఇచ్చి బయటకు రాకుండా చేస్తున్నారు. శుక్రవారం పట్టపగలే యంత్రాలు, లారీలు వినియోగించి వేలాది క్యూబిక్ మీటర్ల మట్టి, గ్రావెల్ తరలిస్తున్నా పీడబ్ల్యూడీ, రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు. వారి అండదండలతోనే మట్టి మాఫియా చెలరేగిపోతున్నారన్న అనుమానం కలుగుతోంది. ఇప్పటికే లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్, మట్టిని అక్రమార్కులు చెరువు నుంచి బయటకు తరలించారు.
గువ్వల వెంకటేశ్వరరెడ్డి, తెదేపా సీనియర్ నాయకుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గులకరాయికి.. రాజకీయ రంగు!
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్పై గులకరాయి కేసు.. కుట్ర కేసుగా మారుతోంది. రాజకీయ రంగు పులుముకునేందుకు రంగం సిద్ధమైంది. తెదేపా నేతలు అనుమానించినట్లే.. మరికొందరు కీలక నేతలను ఇరికించేందుకు ఖాళీ వదిలినట్లు తెలిసింది. -
తెచ్చిపెట్టేది లేదు... తరిమికొట్టుడే..!
[ 19-04-2024]
‘గత ఐదేళ్ల జగన్ పాలనలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఒక్క పరిశ్రమ కూడా నెలకొల్పింది లేదు. కానీ.. గత చంద్రబాబు సర్కారు ఎన్నో ఇబ్బందులు పడి, పారిశ్రామికవేత్తలను ఒప్పించి, రాయితీలు ఇచ్చి ఇక్కడ పెట్టించిన పరిశ్రమలను మూతపడేలా చేయడంలో వైకాపా సర్కారు విజయవంతమైంది. -
అభివృద్ధి పరుగులు పెట్టిస్తా: సుజనా
[ 19-04-2024]
విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ప్రధాని మోదీ, చంద్రబాబు సహకారంతో అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తానని భాజపా పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు. గురువారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. -
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: బాలశౌరి
[ 19-04-2024]
వైకాపా అరాచక పాలన నుంచి విముక్తి పొందేందుకు తెదేపా, జనసేన కూటమి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కూటమి బందరు ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి పిలుపునిచ్చారు. -
ఒడిసిపడతానని.. విడిచిపెడతావేం?
[ 19-04-2024]
సీఎం జగన్ మాటలకు అర్థాలే వేరు. ఆయన చెప్పారంటే... అసలు చేయరని అర్థం. దీనికి సజీవ సాక్ష్యం కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీకి దిగువన ప్రతిపాదించిన రెండు బ్యారేజీల నిర్మాణం. కృష్ణా, గుంటూరు జిల్లాలకు ప్రాణావసరమైన వీటి గురించి జగన్ సర్కారు ఏమాత్రం పట్టించుకోలేదు. -
నాలుగో సింహం నలిగిపోతోంది
[ 19-04-2024]
వారాంతపు సెలవులు లేక పోలీసులు తీవ్ర ఇబ్బందుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. రోజూ ఒత్తిడితో పని చేయాల్సి వస్తోంది. ఈ విధంగా ఉద్యోగం చేయడం కష్టంగా ఉందని పోలీసు ఉద్యోగుల సంఘం తరఫున ఉన్నతాధికారులను, ప్రజా ప్రతినిధులను వేడుకున్నారు. -
తెదేపా అభ్యర్థుల నామ పత్రాల దాఖలు
[ 19-04-2024]
గన్నవరం నియోజకవర్గంలో జనసేన, భాజపా మద్దతుతో తెదేపా బలపర్చిన ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గురువారం ఉదయం 11.15 గంటలకు తొలి విడత నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి జేసీ గీతాంజలిశర్మకు సమర్పించారు. -
లారీ ఢీకొని ప్రసాదంపాడు వాసి దుర్మరణం
[ 19-04-2024]
చంద్రుగొండ మండలం అయ్యన్నపాలెం ఒడ్డు వద్ద గల మలుపు సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన శ్రీకృష్ణచక్రపాణి(61) మృతి చెందారు. -
బావిలో పడిన యువకుడు
[ 19-04-2024]
బాపులపాడు మండలం బొమ్ములూరులో ఓ యువకుడు బావిలో పడిన ఘటన గురువారం రాత్రి కలకలం రేపింది. ఇదే గ్రామానికి చెందిన పవన్ స్థానిక విద్యుత్తు ఉపకేంద్రం సమీపంలో ఉన్న పొలంలోని బావిలో పడిపోయాడు. -
చెత్తకు నిప్పు.. గ్యాస్ పైప్లైన్కు మంటలు
[ 19-04-2024]
ముదినేపల్లి ప్రధాన రహదారిలో చెత్త కాలుస్తుండగా..గ్యాస్ పైప్లైన్ లుకింగ్ పాయింట్కు అంటుకొని భీతావహ పరిస్థితి ఏర్పడింది. వెంటనే స్పందించిన అగ్నిమాపకశాఖ అధికారులు మంటల్ని అదుపు చేశారు. -
ప్రోత్సాహం అన్నావు.. సాయం మరిచావు
[ 19-04-2024]
బందరు బంగారంగా ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన రోల్డ్గోల్డ్ పరిశ్రమ ప్రస్తుతం అనేక ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. -
ఆ భోజనం మా కొద్దు
[ 19-04-2024]
మధ్యాహ్నభోజన మెనూ మార్చాం...పోషకాలతో కూడిన భోజనం అందిస్తున్నాం అని ముఖ్యమంత్రి జగన్ గొప్పలు చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. -
ఇన్నాళ్లూ.. కాలయాపన
[ 19-04-2024]
పేరుకే అది వంద పడకల ఆసుపత్రి.. వైద్యం మాత్రం ‘ప్రాథమిక’ స్థాయిలోనే అందుతోంది. వైద్యశాలను ఉన్నతంగా తీర్చిదిద్దామని ఎమ్మెల్యే సోదరులు ప్రజలను మభ్యపెడుతున్నారు. స్థాయి పెంపు కాగితాలకే పరిమితమైంది. -
నాడు కళకళ.. నేడు వెలవెల
[ 19-04-2024]
వైకాపా పాలనలో పారిశ్రామికవాడలు పూర్తిగా చతికిల పడ్డాయి. గుడివాడ ఆటోనగర్ ఒకప్పుడు దేశవ్యాప్తంగా వ్యవసాయ పరికరాలకు ప్రఖ్యాతి. కర్నాటక, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు ఇక్కడి నుంచి కల్టివేటర్లు, వీల్స్, నూర్పిడి యంత్రాలు సరఫరా అయ్యాయి. -
సుద్దగా అన్నం.. అందుకే తినం
[ 19-04-2024]
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చాలా మంది విద్యార్థులకు రుచించడం లేదు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మెనూ అమలు చేస్తున్నప్పటికీ ఆహార పదార్థాలు రుచి, శుచి ఉండడం లేదని పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చెబుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె