logo

కొట్టి చంపారు

భర్తను భార్య, అతని చిన్న కుమారుడు కొట్టి చంపిన ఘటన ఎన్టీఆర్‌ జిల్లా కానూరు పరిధి అశోక్‌నగర్‌లో చోటు చేసుకుంది.

Published : 01 Apr 2023 04:46 IST

భార్య, కుమారుడే నిందితులు

పెనమలూరు, న్యూస్‌టుడే: భర్తను భార్య, అతని చిన్న కుమారుడు కొట్టి చంపిన ఘటన ఎన్టీఆర్‌ జిల్లా కానూరు పరిధి అశోక్‌నగర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అశోక్‌నగర్‌కు చెందిన సాలిగ్రాం సురేశ్‌(50) ఆటోనగర్‌లో లారీ బాడీ బిల్డింగ్‌ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అతనికి భార్య అరుణ, ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు వినీల్‌ ఐదేళ్ల కిందట హిజ్రాగా మారి రోజాగా పేరు మార్చుకొని తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లో నివసిస్తున్నారు. కుమారుడు హిజ్రాగా మారిపోవడంపై తండ్రి తరచూ బాధపడేవాడు. వారం కిందట వినీల్‌ అలియాస్‌ రోజా తల్లిదండ్రుల వద్దకు వచ్చి తిరిగి వెళ్లిపోయాడు. కుమారుడు హిజ్రాగా మారడానికి భార్య కారణమంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాగ్వాదానికి దిగేవాడు. రెండ్రోజులుగా వీరి మధ్య ఘర్షణ కొనసాగుతోంది. గురువారం అర్ధరాత్రి వివాదం పెద్దదయింది. ఈ క్రమంలో కోపోద్రిక్తులైన భార్య అరుణ, చిన్న కుమారుడు ఆకాశ్‌లు సురేశ్‌పై దాడి చేసి తీవ్రంగా కొట్టడంతో కిందపడిపోయాడు. భర్త పీకపై ఆమె కాలుతో తొక్కేయడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటనపై  సురేశ్‌ సోదరుడు రమేశ్‌ పెనమలూరు పోలీసులకు శుకవ్రారం ఉదయం ఫిర్యాదు చేశారు. హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని