ఏప్రిల్ 4 నుంచి సదరం సేవలు
ఏప్రిల్ 4వ తేదీ నుంచి మచిలీపట్నం సర్వజన ఆసుపత్రిలో సదరం సేవలు అందుబాటులోకి వస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.గంటా వరప్రసాద్ తెలిపారు.
మచిలీపట్నం కార్పొరేషన్,న్యూస్టుడే: ఏప్రిల్ 4వ తేదీ నుంచి మచిలీపట్నం సర్వజన ఆసుపత్రిలో సదరం సేవలు అందుబాటులోకి వస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.గంటా వరప్రసాద్ తెలిపారు. ఆసుపత్రిలో గత రెండునెలలుగా సదరం సేవలు నిలిచిపోవడంతో వివిధ ప్రాంతాలనుంచి వస్తున్న రోగులు పడుతున ఇబ్బందులపై శుక్రవారం ‘ఈనాడు’లో ‘రమ్మంటారు...వస్తే ఉండరు’ అన్న శీర్షికన కథనం ప్రచురితమవగా ఆయన స్పందించారు. ఆసుపత్రిలో కొన్ని విభాగాల వైద్యులు లేకపోవడం, ఉన్నవారు కొందరు సెలవు పెట్టడంతో సమస్య ఏర్పడిందని చెప్పారు. కంటివిభాగానికి చెందిన వైద్యుడిని విజయవాడ ఆసుపత్రినుంచి సదరం నిర్వహించే రోజుల్లో మచిలీపట్నం ఆసుపత్రికి వచ్చేలా ఏర్పాట్లు చేశామన్నారు. దీంతోపాటు వైద్యులకు డిజిటల్ టోకెన్స్ జారీ ప్రక్రియను కూడా పూర్తి చేశామన్నారు. 4వ తేదీ నుంచి ఇకపై నిర్దేశించిన రోజుల్లో సదరం శిబిరాలు నిర్వహిస్తామని, అందరూ వినియోగించుకోవాలని కోరారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాల్లోనూ అధునాతన సేవలు అందుబాటులోకి తెస్తున్నామని రోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పని ప్రాంతంలోనే ఎన్నికల విధులు వేయరూ..
[ 25-04-2024]
మహిళా ఉపాధ్యాయులను వారి పని చేసే నియోజకవర్గాల్లోనే ఎన్నికల విధుల్లో నియమించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ నవాబ్, కోసూరి రాజశేఖర్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావుకు బుధవారం వినతి పత్రం సమర్పించారు. -
కలగా మిగిలిన వంతెన
[ 25-04-2024]
జగనన్న వస్తాడు..ఏదో చేస్తాడని ఓట్లేస్తే పాములలంక వంతెన నిర్మించకుండా అయిదేళ్ల్లుగా ఉసూరుమనిపించారని పాములలంక గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. -
పరిహారం.. పరిహాసం
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గతేడాది ఖరీఫ్, రబీ పంటల సాగులో అన్నదాత పూర్తిగా నష్టపోయారు. నేటి వరకూ రైతులకు పావలా ఆర్థిక సాయం కూడా అందలేదని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
43 మంది అభ్యర్థులు...57 నామపత్రాలు
[ 25-04-2024]
జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలో పోటీ చేసేందుకు బుధవారం మొత్తం 43 మంది నామపత్రాలు దాఖలు చేశారు. -
పామర్రుని తెదేపా అడ్డాగా మారుస్తా: వర్ల
[ 25-04-2024]
అన్న నందమూరి తారకరామారావు పుట్టిన ఈ గడ్డపై మళ్లీ పసుపు జెండాను ఎగరేసి నియోజకవర్గాన్ని తెదేపాకు అడ్డాగా మారుస్తానని ఎన్డీఏ కూటమి అభ్యర్థి వర్ల కుమార్రాజా అన్నారు. -
పీఏసీఎన్ కంప్యూటరీకరణపై శిక్షణ
[ 25-04-2024]
ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల కంప్యూటరీకరణపై చల్లపల్లి పీఏసీఎన్లో శిక్షణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. -
‘బటన్ నొక్కుడు తప్ప చేసిందేమీ లేదు’
[ 25-04-2024]
నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెబుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్టీఆర్ గృహాలు నిర్మించుకున్న పేదలకు ఎందుకు నిధులు మంజూరు చేయలేదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శీలం ప్రకాష్రావు ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)