అక్రమాలపై విచారణ చేస్తాం: పీడీ
జగనన్న కాలనీలోని మెరక పనుల్లో ఎక్కడైనా అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు అందితే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా గృహ నిర్మాణ సంస్థ అధికారి (ఎఫ్ఏసీ), డ్వామా పీడీ జీవీ సూర్యనారాయణ స్పష్టం చేశారు.
ఈనాడు, అమరావతి: జగనన్న కాలనీలోని మెరక పనుల్లో ఎక్కడైనా అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు అందితే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా గృహ నిర్మాణ సంస్థ అధికారి (ఎఫ్ఏసీ), డ్వామా పీడీ జీవీ సూర్యనారాయణ స్పష్టం చేశారు. కృష్ణా జిల్లాలో జగనన్న కాలనీలో మౌలిక సదుపాయాల పనులను పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖలే పర్యవేక్షిస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. చేసిన పనులకు ఎంబుక్లు తయారు చేసి శాఖకు పంపిన తర్వాత ప్రధాన కార్యాలయం నుంచి ఆయా శాఖలకే నిధులు విడుదలవుతున్నాయన్నారు. ఈ పనులను జిల్లా కలెక్టర్ టెండర్ లేదా నామినేషన్ పద్ధతిలో అప్పగిస్తున్నారని తెలిపారు. ‘మెరక పేరుతో నిధుల మేత’ శీర్షికన ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. కృష్ణా జిల్లాలో 13,873 గృహాల నిర్మాణం లక్ష్యం కాగా 13,919 పూర్తి చేశామన్నారు. దాదాపు 12,700 మంది గృహప్రవేశాలు నిర్వహించుకున్నారని తెలిపారు.
వీఆర్ఎస్ ఆమోదించకనే..!
పాత అధికారి వీఆర్ఎస్కు దరఖాస్తు చేయగా ప్రభుత్వం ఆమోదించలేదని, ఆయన అనారోగ్య కారణాల వల్ల సెలవు పెట్టారని, తర్వాత మూడు నెలల్లోపు జిల్లాలో జాయిన్ కాకపోవడంతో ఆయన ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాల్సి వచ్చిందని, దీంతో కలెక్టర్ తనకు అదనపు బాధ్యతలు అప్పగించారని వివరణ ఇచ్చారు. జగనన్న కాలనీలకు సంబంధించి ఇప్పటి వరకు రూ.4.84కోట్లు పీఆర్ శాఖ బిల్లులు చెల్లించారని, మున్సిపల్ శాఖ రూ.8.08 కోట్లకు బిల్లులు ఇచ్చారని వివరించారు. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ఏ జిల్లా అధికారి ఆ జిల్లా చెల్లింపులు చూసుకుంటున్నారని, తన వద్ద చెల్లింపుల అధికారం లేదని స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
[ 29-03-2024]
పెండింగ్లో ఉన్న 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను తెదేపా ప్రకటించింది. -
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
[ 29-03-2024]
రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదు.. ప్రజలకు సేవచేయడమని ఎన్టీఆర్ నిరూపించారని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు, నేతలకు ఎక్స్(ట్విటర్) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. -
మీకో దండం.. మీతో ఉండం
[ 29-03-2024]
మచిలీపట్నం నగరపాలిక పరిధిలో 12 మంది వాలంటీర్లు ఈ నెలలోనే తమ రాజీనామాలను కమిషనర్కు సమర్పించారు. 39వ వార్డులో ఆరుగురు, 20వ వార్డులో నలుగురు, 7, 47వ వార్డుల్లో ఒక్కొక్కరు చొప్పున వైదొలగారు. -
అంతా అన్నారు.. కొంతే కొన్నారు!
[ 29-03-2024]
దివిసీమలో ఖరీఫ్ ఆలస్యంగా సాగు చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే కోతలు కోస్తున్నారు. నూర్పిళ్లు చేస్తున్నారు. -
ఆత్మీయ అతిథికి అపూర్వ స్వాగతం
[ 29-03-2024]
సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ గురువారం కృష్ణా జిల్లాలో పర్యటించారు. -
తమ్ముళ్లూ.. మీరే మా బలం
[ 29-03-2024]
పోరాట పటిమ చూపి రానున్న ఎన్నికల్లో తెదేపా విజయానికి కృషి చేయాలని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. -
‘తుస్సుమన్న జగన్ బస్సు యాత్ర’
[ 29-03-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర తుస్సుమందని.. డబ్బులిచ్చినా, బిర్యానీలు పెట్టినా ఎవరూ రావడం లేదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. -
దూసుకొస్తున్నాయ్.. జాగ్రత్తమ్మా!
[ 29-03-2024]
రెప్పపాటులో దూసుకొచ్చే వాహనాలు.. ఆదమరచి రోడ్డుపైనే ఆడుకునే చిన్నారులు.. రోడ్డు దాటాలా వద్దా అని తటపటాయించి ఒక్కసారిగా పరిగెత్తే విద్యార్థులు.. -
వైకాపా నేతల కనుసన్నల్లో.. అర్ధరాత్రి ఇసుక అక్రమ తవ్వకాలు
[ 29-03-2024]
అనుమతులు లేని తవ్వకాలపై ప్రజలు ఆందోళనకు దిగినా.. జాతీయ హరిత ట్రైబ్యునల్కు ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకునే నాథుడే లేరు. -
అంతర జిల్లా ద్విచక్ర వాహనాల దొంగ అరెస్టు
[ 29-03-2024]
జల్సాలకు అలవాటుపడి వివిధ జిల్లాల్లో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతూ వాటిని విక్రయిస్తున్న దొంగను పట్టుకొని 37 ద్విచక్ర వాహనాలను తోట్లవల్లూరు పోలీసులు పట్టుకున్నారని కృష్ణా జిల్లా ఎస్పీ నయీం అస్మి తెలిపారు. -
నిశిత తనిఖీలు
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నగదు, మద్యం, గంజాయి తదితరాల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. -
కోడ్ ఉల్లంఘించి.. వైకాపా నేతల వేడుకలు
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా.. వైకాపా నేతల ఉల్లంఘనలు యథేచ్ఛగా సాగుతున్నాయి. -
‘అతడి ఆత్మహత్యాయత్నానికి కారకులెవరు..?’
[ 29-03-2024]
ఓ మనిషి ప్రాణం తీసుకునేలా ప్రేరేపించడం దారుణం. న్యాయం కోసం వస్తే కంచె చేను మేసిన చందంగా రక్షించాల్సిన వారే అతడి ఆత్మహత్యాయత్నానికి కారణం కావడం శోచనీయం. -
ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
[ 29-03-2024]
జిల్లాలోని గంపలగూడెం మండలం పెదకొమిర, రెడ్డిగూడెం మండలం మద్దులపర్వలోని ఆదర్శ పాఠశాలల్లో ప్రథమ ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాళ్లు ఆర్.శైలజ, ఎ.వీరరాజు గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్