అడిగేదెవరు.. బాదెయ్..!
వేసవి రద్దీని పలు ప్రైవేటు బస్సు ఆపరేటర్లు సొమ్ము చేసుకుంటున్నారు.డిమాండ్ ఉన్న రూట్లలో అందిన కాడికి దోచుకుంటున్నారు.
వేసవి రద్దీని సొమ్ము చేసుకుంటున్న ప్రైవేటు ఆపరేటర్లు
గిరాకీని బట్టి టికెట్ ధరలను పెంచేస్తున్న ట్రావెల్స్
ఈనాడు- అమరావతి: వేసవి రద్దీని పలు ప్రైవేటు బస్సు ఆపరేటర్లు సొమ్ము చేసుకుంటున్నారు.డిమాండ్ ఉన్న రూట్లలో అందిన కాడికి దోచుకుంటున్నారు. సాధారణం కంటే 40 శాతం నుంచి 50 శాతం అధికంగా ధరలను వసూలు చేస్తున్నారు. ఈ ధరలను చూసి ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. అత్యవసర పనులపై వెళ్లే వారు చేసేది లేక చెల్లిస్తున్నారు. ప్రయాణికుల వాహనాల్లో వాణిజ్య సరకులను చేరవేయకూడదు. వారికి సంబంధించిన వాటినే తీసుకెళ్లాలి. చాలా బస్సుల్లో డబ్బులకు కక్కుర్తిపడి ఇష్టారీతిన సరకులను తీసుకెళ్తున్నారు. ఉల్లంఘనలపై కొరడా ఝళిపించాల్సిన రవాణా శాఖ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా విజయవాడ కేంద్రంగానే ప్రైవేటు ట్రావెల్స్ ఏజెన్సీలు నడుస్తున్నాయి. ఎక్కువగా హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం, చెన్నై, తదితర చోట్లకు వెళ్తుంటాయి. ఏసీ, నాన్-ఏసీ, స్లీపర్ సర్వీసులు తిరుగుతున్నాయి. విజయవాడ నగరం మీదుగా నిత్యం 550 బస్సుల వరకు నడుస్తుంటాయి. శని, ఆదివారాలు మినహా సాధరాణ రోజుల్లో వీటిల్లో పెద్దగా డిమాండ్ ఉండదు. ఈ నష్టాలను పూడ్చుకునేందుకు రద్దీగా సమయాలలో రెట్టింపు చేసి టికెట్లు అమ్ముతుంటారు. పండగ సీజన్లలో వారం రోజులపాటు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో అయితే నెల నుంచి నెలన్నర వరకు రద్దీ కనిపిస్తుంది. దీంతో ప్రైవేటు ఆపరేటర్లు ఎడాపెడా ధరలను వసూలు చేశారు. డిమాండ్ మేరకు రెట్టింపు కూడా చేస్తున్నారు. ఇక వారాంతాల్లో అయితే మరీ ఎక్కువగా ఉంటోంది.
* విజయవాడ నగరంతోపాటు ఇతరచోట్ల ఉత్తరాంధ్ర నుంచి వచ్చి పనులు చేసుకునే వారు అధికంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాలకు వెళ్లే సర్వీసులకు డిమాండ్ ఉంటోంది. విశాఖపట్నం వెళ్లే నాన్- ఏసీ బస్సుల్లో గరిష్ఠంగా రూ.1,200 వరకు వసూలు చేస్తున్నారు. ఇది ఆర్టీసీతో పోలిస్తే రెట్టింపు ధర. ఏసీ బస్సుల్లో సీటు రూ.1,300 దాకా పలుకుతోంది. పలు ట్రావెల్స్ అయితే.. ఏసీ స్లీపర్ బస్సుల్లో ఎక్కితే ఏకంగా రూ.2,300 చెల్లించాల్సి వస్తోంది.
* డిమాండ్ ఎక్కువ ఉండే బెంగళూరు మార్గంలోనూ ఇదే రీతిలో ధరలు ఉంటున్నాయి. నాన్-ఏసీ సర్వీసుల్లో సాధారణం కంటే 30 శాతం అధికంగా టికెట్ ధరలు వసూలు చేస్తున్నారు. పలు ఏసీ బస్సుల్లో రూ.1,700 వరకు, ఓల్వో మల్టీ యాక్సిల్ బస్సుల్లో రూ.3 వేలు వరకు ముక్కు పిండి తీసుకుంటున్నారు. హైదరాబాద్ రూట్లోనూ అధిక ధరలు ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నాయి. నాన్-ఏసీ సర్వీసుల్లో ఆర్టీసీ కంటే రెట్టింపు ధరలు ఉన్నాయి. వారాంతాల్లో డిమాండ్ను బట్టి రూ.1,200 వసూలు చేస్తున్నారు. ఏసీ 2 ప్లస్ 1 బస్సుల్లో రూ.1,700-2,000 వరకు ఉంటోంది.
పైనా, కిందా సరకుల రవాణా...
పరిమితికి మించి యథేచ్ఛగా సరకులను వేసి తరలిస్తున్నాయి. విజయవాడ నుంచి పలు వ్యాపార వస్తువులను బుక్ చేసుకుని పార్శిల్ ఏజెన్సీల మాదిరిగా రవాణా చేస్తున్నారు. చాలా ట్రావెల్స్ సంస్థలు ఇలా అనుమతి లేకుండా చేరవేస్తున్నాయి. ప్రయాణికులను మాత్రమే చేరవేసేందుకు అనుమతి ఉన్నా దీనికి విరుద్ధంగా ఆపరేటర్లు వివిధ సరకులను రవాణా చేస్తున్నారు. వెరసి ప్రయాణికుల వాహనాలు సరకు రవాణా వాహనాలుగా మారుతున్నాయి. విజయవాడ నుంచి బిందెలు, ఇతర వ్యాపార వస్తువులను బుక్ చేసుకుని పార్శిల్ ఏజెన్సీల మాదిరిగా రవాణా చేస్తున్నారు. పలు బస్సుల డిక్కీల్లో స్కూటీలు కూడా చేరవేస్తున్నారు. ఇలా వాహనాలను తీసుకెళ్లడం వల్ల వాటిలోని ఇంధనం మండి బస్సులు అగ్నిప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. బస్సుల పై భాగంలో, కింద ఛాంబర్లలో వాణిజ్య సరకులు రవాణా అవుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెచ్చిపెట్టేది లేదు... తరిమికొట్టుడే..!
[ 19-04-2024]
‘గత ఐదేళ్ల జగన్ పాలనలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఒక్క పరిశ్రమ కూడా నెలకొల్పింది లేదు. కానీ.. గత చంద్రబాబు సర్కారు ఎన్నో ఇబ్బందులు పడి, పారిశ్రామికవేత్తలను ఒప్పించి, రాయితీలు ఇచ్చి ఇక్కడ పెట్టించిన పరిశ్రమలను మూతపడేలా చేయడంలో వైకాపా సర్కారు విజయవంతమైంది. -
అభివృద్ధి పరుగులు పెట్టిస్తా: సుజనా
[ 19-04-2024]
విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ప్రధాని మోదీ, చంద్రబాబు సహకారంతో అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తానని భాజపా పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు. గురువారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. -
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: బాలశౌరి
[ 19-04-2024]
వైకాపా అరాచక పాలన నుంచి విముక్తి పొందేందుకు తెదేపా, జనసేన కూటమి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కూటమి బందరు ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి పిలుపునిచ్చారు. -
ఒడిసిపడతానని.. విడిచిపెడతావేం?
[ 19-04-2024]
సీఎం జగన్ మాటలకు అర్థాలే వేరు. ఆయన చెప్పారంటే... అసలు చేయరని అర్థం. దీనికి సజీవ సాక్ష్యం కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీకి దిగువన ప్రతిపాదించిన రెండు బ్యారేజీల నిర్మాణం. కృష్ణా, గుంటూరు జిల్లాలకు ప్రాణావసరమైన వీటి గురించి జగన్ సర్కారు ఏమాత్రం పట్టించుకోలేదు. -
గులకరాయికి.. రాజకీయ రంగు!
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్పై గులకరాయి కేసు.. కుట్ర కేసుగా మారుతోంది. రాజకీయ రంగు పులుముకునేందుకు రంగం సిద్ధమైంది. తెదేపా నేతలు అనుమానించినట్లే.. మరికొందరు కీలక నేతలను ఇరికించేందుకు ఖాళీ వదిలినట్లు తెలిసింది. -
నాలుగో సింహం నలిగిపోతోంది
[ 19-04-2024]
వారాంతపు సెలవులు లేక పోలీసులు తీవ్ర ఇబ్బందుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. రోజూ ఒత్తిడితో పని చేయాల్సి వస్తోంది. ఈ విధంగా ఉద్యోగం చేయడం కష్టంగా ఉందని పోలీసు ఉద్యోగుల సంఘం తరఫున ఉన్నతాధికారులను, ప్రజా ప్రతినిధులను వేడుకున్నారు. -
తెదేపా అభ్యర్థుల నామ పత్రాల దాఖలు
[ 19-04-2024]
గన్నవరం నియోజకవర్గంలో జనసేన, భాజపా మద్దతుతో తెదేపా బలపర్చిన ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గురువారం ఉదయం 11.15 గంటలకు తొలి విడత నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి జేసీ గీతాంజలిశర్మకు సమర్పించారు. -
లారీ ఢీకొని ప్రసాదంపాడు వాసి దుర్మరణం
[ 19-04-2024]
చంద్రుగొండ మండలం అయ్యన్నపాలెం ఒడ్డు వద్ద గల మలుపు సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన శ్రీకృష్ణచక్రపాణి(61) మృతి చెందారు. -
బావిలో పడిన యువకుడు
[ 19-04-2024]
బాపులపాడు మండలం బొమ్ములూరులో ఓ యువకుడు బావిలో పడిన ఘటన గురువారం రాత్రి కలకలం రేపింది. ఇదే గ్రామానికి చెందిన పవన్ స్థానిక విద్యుత్తు ఉపకేంద్రం సమీపంలో ఉన్న పొలంలోని బావిలో పడిపోయాడు. -
చెత్తకు నిప్పు.. గ్యాస్ పైప్లైన్కు మంటలు
[ 19-04-2024]
ముదినేపల్లి ప్రధాన రహదారిలో చెత్త కాలుస్తుండగా..గ్యాస్ పైప్లైన్ లుకింగ్ పాయింట్కు అంటుకొని భీతావహ పరిస్థితి ఏర్పడింది. వెంటనే స్పందించిన అగ్నిమాపకశాఖ అధికారులు మంటల్ని అదుపు చేశారు. -
ప్రోత్సాహం అన్నావు.. సాయం మరిచావు
[ 19-04-2024]
బందరు బంగారంగా ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన రోల్డ్గోల్డ్ పరిశ్రమ ప్రస్తుతం అనేక ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. -
ఆ భోజనం మా కొద్దు
[ 19-04-2024]
మధ్యాహ్నభోజన మెనూ మార్చాం...పోషకాలతో కూడిన భోజనం అందిస్తున్నాం అని ముఖ్యమంత్రి జగన్ గొప్పలు చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. -
ఇన్నాళ్లూ.. కాలయాపన
[ 19-04-2024]
పేరుకే అది వంద పడకల ఆసుపత్రి.. వైద్యం మాత్రం ‘ప్రాథమిక’ స్థాయిలోనే అందుతోంది. వైద్యశాలను ఉన్నతంగా తీర్చిదిద్దామని ఎమ్మెల్యే సోదరులు ప్రజలను మభ్యపెడుతున్నారు. స్థాయి పెంపు కాగితాలకే పరిమితమైంది. -
నాడు కళకళ.. నేడు వెలవెల
[ 19-04-2024]
వైకాపా పాలనలో పారిశ్రామికవాడలు పూర్తిగా చతికిల పడ్డాయి. గుడివాడ ఆటోనగర్ ఒకప్పుడు దేశవ్యాప్తంగా వ్యవసాయ పరికరాలకు ప్రఖ్యాతి. కర్నాటక, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు ఇక్కడి నుంచి కల్టివేటర్లు, వీల్స్, నూర్పిడి యంత్రాలు సరఫరా అయ్యాయి. -
సుద్దగా అన్నం.. అందుకే తినం
[ 19-04-2024]
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చాలా మంది విద్యార్థులకు రుచించడం లేదు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మెనూ అమలు చేస్తున్నప్పటికీ ఆహార పదార్థాలు రుచి, శుచి ఉండడం లేదని పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చెబుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు