నిబంధనలు తూచ్..!
నిర్మాణ రంగంలో కీలకమైన ఇటుకలకు గిరాకీ పెరగడంతో బట్టీలు కూడా విచ్చలవిడిగా వెలుస్తున్నాయి.
విచ్చలవిడిగా బట్టీల ర్పాటు
న్యూస్టుడే, తోట్లవల్లూరు: నిర్మాణ రంగంలో కీలకమైన ఇటుకలకు గిరాకీ పెరగడంతో బట్టీలు కూడా విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. జిల్లాలో సుమారు 700కు పైగా ఇటుక బట్టీలున్నాయని అధికారులు చెబుతున్నారు. నివాస ప్రాంతాలు, రహదారులకు దూరంగా ఇటుకలు తయారు చేయాలని నిబంధనలున్నప్పటికీ వ్యాపారులు వాటిని తుంగలో తొక్కుతున్నారు. అధికారులు కూడా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో పలు గ్రామాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టీలు నడుస్తున్నాయి.
అనుమతులు లేకున్నా
ఇటుక తయారీకి రెవెన్యూ, కాలుష్య నియంత్రణ మండలితోపాటు స్థానిక పంచాయతీ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి. భూమి వినియోగిస్తున్నందుకు ప్రభుత్వానికి నిర్ణీత రుసుము చెల్లించాలి. కానీ బట్టీల నిర్వాహకులు వాటిని పాటించడం లేదు. దీంతో స్థానిక సంస్థల ఆదాయానికి గండి పడుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వ భూములు, లంకల్ని సైతం వదలడం లేదు. నది ఒడ్డున కూడా బట్టీలు ఏర్పాటు చేస్తున్నారు. మట్టి కోసం గ్రామాల చెంతన ఉన్న లంకల్లో యథేచ్ఛగా తవ్వేస్తుండడంతో లంకభూములు నదీ పాతానికి గురవుతున్నాయి.
ఇవీ మార్గదర్శకాలు
ఇటుక బట్టీలు గ్రామానికి, పండ్ల తోటలకు కనీసం 0.8 కిలో మీటర్ల దూరంలో ఉండాలని కేంద్ర పర్యావరణ శాఖ పేర్కొంది. బట్టీలన్నీ ఒకేచోట ఏర్పడితే వాయు కాలుష్యం పెరిగే ప్రమాదం ఉందనే కారణంగా కనీసం కిలో మీటరు దూరం పాటించాలని షరతు విధిచింది. ఇటుకలను కాల్చడానికి టైరు, ప్లాస్టిక్ వంటి ప్రమాదకర వ్యర్థాలను ఎట్టిపరిస్థితుల్లోనూ వాడకూడదని స్పష్టం చేసింది.
బీమా సౌకర్యం సున్నా
బట్టీలో పనిచేసే కార్మికులకు నిర్వాహకులు కనీసం బీమా సౌకర్యం కూడా కల్పించడం లేదు. ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు మాత్రమే అధికారులు నిబంధనల పేరుతో హడావుడి చేస్తున్నారు. ముందస్తు చర్యలు తీసుకుంటే ఇబ్బందులు తలెత్తవని పలువురు సూచిస్తున్నారు. బట్టీల పర్యవేక్షణపై తహసీల్దార్ కట్టా శివయ్య వద్ద ‘న్యూస్టుడే’ ప్రస్తావించగా ఆ బాధ్యత పంచాయతీలదని తెలిపారు.
పరిశీలించి అనుమతులిస్తాం
కాలుష్య నియంత్రణ మండలి అనుమతి తప్పని సరి. పొలంలో బట్టీ ఏర్పాటు చేస్తే భూమార్పిడి ధ్రువపత్రం, చుట్టుపక్కల రైతుల అభ్యంతరాలు లేకుండా తీర్మాన కాపీలు ఉండాలి. అన్నీ పరిశీలించి సక్రమంగా ఉంటేనే గ్రామ పంచాయతీల నుంచి అనుమతులు మంజూరు చేస్తాం.
తుంగల స్వర్ణలత, ఎంపీడీవో
తీవ్రమైన కాలుష్యం
రహదారుల పక్కనే ఇటుక బట్టీలు ఉండటంతో విపరీతంగా పొగ వెలువడి తీవ్రమైన వాయు కాలుష్యం ఏర్పడుతోంది. దీంతో ప్రయాణికులు శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నారు. పొగ కారణంగా ప్రమాదాలు కూడా చోటుచేసుకునే ఆస్కారం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీకో దండం.. మీతో ఉండం
[ 29-03-2024]
మచిలీపట్నం నగరపాలిక పరిధిలో 12 మంది వాలంటీర్లు ఈ నెలలోనే తమ రాజీనామాలను కమిషనర్కు సమర్పించారు. 39వ వార్డులో ఆరుగురు, 20వ వార్డులో నలుగురు, 7, 47వ వార్డుల్లో ఒక్కొక్కరు చొప్పున వైదొలగారు. -
అంతా అన్నారు.. కొంతే కొన్నారు!
[ 29-03-2024]
దివిసీమలో ఖరీఫ్ ఆలస్యంగా సాగు చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే కోతలు కోస్తున్నారు. నూర్పిళ్లు చేస్తున్నారు. -
ఆత్మీయ అతిథికి అపూర్వ స్వాగతం
[ 29-03-2024]
సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ గురువారం కృష్ణా జిల్లాలో పర్యటించారు. -
తమ్ముళ్లూ.. మీరే మా బలం
[ 29-03-2024]
పోరాట పటిమ చూపి రానున్న ఎన్నికల్లో తెదేపా విజయానికి కృషి చేయాలని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. -
‘తుస్సుమన్న జగన్ బస్సు యాత్ర’
[ 29-03-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర తుస్సుమందని.. డబ్బులిచ్చినా, బిర్యానీలు పెట్టినా ఎవరూ రావడం లేదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. -
దూసుకొస్తున్నాయ్.. జాగ్రత్తమ్మా!
[ 29-03-2024]
రెప్పపాటులో దూసుకొచ్చే వాహనాలు.. ఆదమరచి రోడ్డుపైనే ఆడుకునే చిన్నారులు.. రోడ్డు దాటాలా వద్దా అని తటపటాయించి ఒక్కసారిగా పరిగెత్తే విద్యార్థులు.. -
వైకాపా నేతల కనుసన్నల్లో.. అర్ధరాత్రి ఇసుక అక్రమ తవ్వకాలు
[ 29-03-2024]
అనుమతులు లేని తవ్వకాలపై ప్రజలు ఆందోళనకు దిగినా.. జాతీయ హరిత ట్రైబ్యునల్కు ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకునే నాథుడే లేరు. -
అంతర జిల్లా ద్విచక్ర వాహనాల దొంగ అరెస్టు
[ 29-03-2024]
జల్సాలకు అలవాటుపడి వివిధ జిల్లాల్లో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతూ వాటిని విక్రయిస్తున్న దొంగను పట్టుకొని 37 ద్విచక్ర వాహనాలను తోట్లవల్లూరు పోలీసులు పట్టుకున్నారని కృష్ణా జిల్లా ఎస్పీ నయీం అస్మి తెలిపారు. -
నిశిత తనిఖీలు
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నగదు, మద్యం, గంజాయి తదితరాల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. -
కోడ్ ఉల్లంఘించి.. వైకాపా నేతల వేడుకలు
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా.. వైకాపా నేతల ఉల్లంఘనలు యథేచ్ఛగా సాగుతున్నాయి. -
‘అతడి ఆత్మహత్యాయత్నానికి కారకులెవరు..?’
[ 29-03-2024]
ఓ మనిషి ప్రాణం తీసుకునేలా ప్రేరేపించడం దారుణం. న్యాయం కోసం వస్తే కంచె చేను మేసిన చందంగా రక్షించాల్సిన వారే అతడి ఆత్మహత్యాయత్నానికి కారణం కావడం శోచనీయం. -
ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
[ 29-03-2024]
జిల్లాలోని గంపలగూడెం మండలం పెదకొమిర, రెడ్డిగూడెం మండలం మద్దులపర్వలోని ఆదర్శ పాఠశాలల్లో ప్రథమ ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాళ్లు ఆర్.శైలజ, ఎ.వీరరాజు గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!